ఒడిశాలోని కేంద్రపార జిల్లాలో జరిగిన ఓ వివాహ శుభకార్యంలో కలుషిత ఆహారం తీసుకుని దాదాపు 100 మంది అస్వస్థతకు గురయ్యారు. మాటియా గ్రామానికి చెందిన పెళ్లి కొడుకు బంధువులు వివాహం నిమిత్తం పెళ్లికూతురు గ్రామం నిమ్పూర్కు వెళ్లారు. ఈ ఉదయం పెళ్లి తర్వాత ఏర్పాటు చేసిన విందు భోజనం ఆరగించిన బంధువులంతా ఒక్కసారిగా అనారోగ్యానికి లోనయ్యారు. వాంతులు, విరేచనాలతో ఇబ్బందులు పడ్డారు. వెంటనే అప్రమత్తమైన గ్రామస్థులు వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు.
బాధితులు తీసుకున్న ఆహారాన్ని పరీక్షించిన వైద్యులు ఆ ఆహారం కలుషితం అయినట్లు తేల్చారు. చికిత్స తీసుకుంటన్న బాధితుల్లో ముగ్గురి ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో కటక్ ఆస్పత్రికి తరలించినట్లు వైద్యులు తెలిపారు.