ETV Bharat / bharat

'గంగా, హిమాలయాలను మోదీ కాపాడతారు'

గంగా నది, హిమాలయాలను ప్రధాని మోదీ కాపాడతారని వ్యాఖ్యానించారు భాజపా నాయకురాలు, మధ్యప్రదేశ్ మాజీ సీఎం ఉమా భారతి. మోదీ ఓ అతీంద్రియ నేత అని అన్నారు.

author img

By

Published : May 19, 2021, 7:06 AM IST

Updated : May 19, 2021, 7:12 AM IST

BJP leader
ఉమా భారతి, భాజపా నాయకురాలు

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఓ గొప్ప నాయకుడు అని కొనియాడారు భాజపా నేత, మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ఉమా భారతి. గంగానది, హిమాలయాలను మోదీ కాపాడతారని అన్నారు. బిహార్, ఉత్తర్​ప్రదేశ్ రాష్ట్రాల్లోని గంగానదిలో మృతదేహాలు తేలుతున్న నేపథ్యంలో ఉమాభారతి వ్యాఖ్యలకు ప్రాధాన్యం సంతరించుకుంది.

uma bharati tweet
ఉమా భారతి ట్వీట్
uma bharati
ఉమా భారతి ట్వీట్

"2014 జూన్ నుంచి 2016 జులై వరకు నా శరీరంలో ప్రవహించింది రక్తం కాదు.. గంగా నది. ఆ రోజుల్లో గంగానే నా సర్వస్వం. 2016 జులై-అక్టోబర్ మధ్యకాలంలో గంగా అభివృద్ధి పనులు చేపట్టాం. ఆ నదికి సంబంధించిన అన్ని సమస్యలు పరిష్కరించే మార్గం కనుగొన్నాం. యమునా, సరస్వతి ఇతర నదులను అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు వేశాం. ప్రధాని మోదీపై మాకు పూర్తి నమ్మకం ఉంది. ఆయన అతీంద్రియ నేత. గంగా నదితో పాటు హిమాలయాలనూ కాపాడతారు."

-ఉమా భారతి, భాజపా నేత

కేబినెట్​లో కొనసాగాలని ప్రధాని మోదీ, అమిత్ షా తనను కోరారని ఉమా భారతి పేర్కొన్నారు. కానీ గంగా నది సమీపంలోని సాధువులను కలిసేందుకు ప్రస్తుతం సమయం వెచ్చిస్తున్నట్లు తెలిపారు. 2024 ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నట్లు స్పష్టం చేశారు.

ఇదీ చదవండి:జులైలో సీబీఎస్‌ఈ 'పది' ఫలితాలు

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఓ గొప్ప నాయకుడు అని కొనియాడారు భాజపా నేత, మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ఉమా భారతి. గంగానది, హిమాలయాలను మోదీ కాపాడతారని అన్నారు. బిహార్, ఉత్తర్​ప్రదేశ్ రాష్ట్రాల్లోని గంగానదిలో మృతదేహాలు తేలుతున్న నేపథ్యంలో ఉమాభారతి వ్యాఖ్యలకు ప్రాధాన్యం సంతరించుకుంది.

uma bharati tweet
ఉమా భారతి ట్వీట్
uma bharati
ఉమా భారతి ట్వీట్

"2014 జూన్ నుంచి 2016 జులై వరకు నా శరీరంలో ప్రవహించింది రక్తం కాదు.. గంగా నది. ఆ రోజుల్లో గంగానే నా సర్వస్వం. 2016 జులై-అక్టోబర్ మధ్యకాలంలో గంగా అభివృద్ధి పనులు చేపట్టాం. ఆ నదికి సంబంధించిన అన్ని సమస్యలు పరిష్కరించే మార్గం కనుగొన్నాం. యమునా, సరస్వతి ఇతర నదులను అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు వేశాం. ప్రధాని మోదీపై మాకు పూర్తి నమ్మకం ఉంది. ఆయన అతీంద్రియ నేత. గంగా నదితో పాటు హిమాలయాలనూ కాపాడతారు."

-ఉమా భారతి, భాజపా నేత

కేబినెట్​లో కొనసాగాలని ప్రధాని మోదీ, అమిత్ షా తనను కోరారని ఉమా భారతి పేర్కొన్నారు. కానీ గంగా నది సమీపంలోని సాధువులను కలిసేందుకు ప్రస్తుతం సమయం వెచ్చిస్తున్నట్లు తెలిపారు. 2024 ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నట్లు స్పష్టం చేశారు.

ఇదీ చదవండి:జులైలో సీబీఎస్‌ఈ 'పది' ఫలితాలు

Last Updated : May 19, 2021, 7:12 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.