ETV Bharat / bharat

ట్రక్కు-మినీ బస్సు ఢీ.. 10 మంది దుర్మరణం

author img

By

Published : Jan 30, 2021, 9:39 AM IST

Updated : Jan 30, 2021, 10:48 AM IST

many-people-died-in-road-accident-in-moradabad
ట్రక్కు-మినీ బస్సు ఢీ

09:34 January 30

ట్రక్కు-మినీ బస్సు ఢీ.. 10 మంది దుర్మరణం

ట్రక్కు-మినీ బస్సు ఢీ

ఉత్తర్​ప్రదేశ్​ మురాదాబాద్​- ఆగ్రా రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ట్రక్కు-మినీ బస్సు ఢీకొన్న ఘటనలో 10మంది  మృతి చెందారు.  మరో 10మంది తీవ్రంగా గాయపడ్డారు.  ప్రమాదంలో వాహనాలు నుజ్జునుజ్జయ్యాయి. మృతదేహాలు రోడ్డుపై చెల్లా చెదురుగా పడిపోయాయి. స్థానికులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.

ప్రమాదంలో మొత్తం మూడు వాహనాలు ఢీకొన్నాయని ప్రత్యక్ష సాక్షులు చెప్పినట్లు అధికారులు తెలిపారు. డ్రైవర్​ ఓవర్​టేకింగ్​ చేసేందుకు ప్రయత్నించడమే ఘటనకు కారణమని పేర్కొన్నారు.

పరిహారం..

ఘటనపై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.2లక్షలు, గాయపడిన వారికి రూ.50వేలు పరిహారం ప్రకటించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని అధికారులను ఆదేశించారు.

09:34 January 30

ట్రక్కు-మినీ బస్సు ఢీ.. 10 మంది దుర్మరణం

ట్రక్కు-మినీ బస్సు ఢీ

ఉత్తర్​ప్రదేశ్​ మురాదాబాద్​- ఆగ్రా రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ట్రక్కు-మినీ బస్సు ఢీకొన్న ఘటనలో 10మంది  మృతి చెందారు.  మరో 10మంది తీవ్రంగా గాయపడ్డారు.  ప్రమాదంలో వాహనాలు నుజ్జునుజ్జయ్యాయి. మృతదేహాలు రోడ్డుపై చెల్లా చెదురుగా పడిపోయాయి. స్థానికులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.

ప్రమాదంలో మొత్తం మూడు వాహనాలు ఢీకొన్నాయని ప్రత్యక్ష సాక్షులు చెప్పినట్లు అధికారులు తెలిపారు. డ్రైవర్​ ఓవర్​టేకింగ్​ చేసేందుకు ప్రయత్నించడమే ఘటనకు కారణమని పేర్కొన్నారు.

పరిహారం..

ఘటనపై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.2లక్షలు, గాయపడిన వారికి రూ.50వేలు పరిహారం ప్రకటించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని అధికారులను ఆదేశించారు.

Last Updated : Jan 30, 2021, 10:48 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.