ETV Bharat / bharat

హైకోర్టు న్యాయమూర్తి అంటూ పోలీసులకు ఫోన్​.. రూ.5 లక్షల డిమాండ్​.. చివరకు..

author img

By

Published : Dec 17, 2022, 5:34 PM IST

హైకోర్టు న్యాయమూర్తినంటూ పోలీసు అధికారినే నమ్మించాడు ఓ వ్యక్తి. కేసును రద్దు చేస్తానని చెప్పి స్టేషన్​కు వచ్చి రూ.5 లక్షలు డిమాండ్ చేశాడు. అడిగిన మొత్తాన్ని ఇవ్వకపోతే ఉద్యోగం నుంచి తొలగించేలా చేస్తానని బెదిరించాడు. కానీ చివరకు ఏమైందంటే?

Man posing as High Court judge arrested
Man posing as High Court judge arrested

దిల్లీకు చెందిన ఓ వ్యక్తి తాను హైకోర్టు న్యాయమూర్తినని నమ్మించి పోలీసు అధికారిని మోసం చేయాలనుకున్నాడు. ఓ కేసును రద్దు చేస్తానని చెప్పి డబ్బులు కూడా డిమాండ్​ చేశాడు. అడిగిన సొమ్ము ఇవ్వకపోతే ఉద్యోగం పోయేలా చేస్తానని బెదిరించాడు. చివరికు కటకటాల పాలయ్యాడు.
అసలేం జరిగిందంటే?
పోలీసుల వివరాల ప్రకారం.. డిసెంబర్ 16న నరేంద్ర కుమార్ అగర్వాల్ అనే ఓ వ్యక్తి.. సమయపుర్ బద్లీ సబ్‌డివిజన్‌ ఏసీపీ అనురాగ్ ద్వివేదికి వాట్సాప్​లో మెసేజ్​ పంపాడు. తాను హైకోర్టు న్యాయమూర్తినని, వెంటనే తనకు ఫోన్ చేయాల్సిందిగా మెసేజ్‌ చేశాడు. అయితే పోలీసు అధికారులు సదరు వ్యక్తికి కాల్ చేయగా ఓ కేసు విషయమై తాను పోలీస్​స్టేషన్​కు వస్తున్నట్లు తెలిపాడు.

60-65 సంవత్సరాల మధ్య వయసు ఉన్న ఆ వ్యక్తి స్టేషన్​కు వచ్చి తాను హైకోర్టు న్యాయమూర్తిగా పరిచయం చేసుకున్నాడు. పోలీస్​స్టేషన్ పరిధిలో జరుగుతున్న నేరాలకు సంబంధించి దాఖలైన పిటిషన్‌పై వ్యక్తిగత పరిశీలన నిమిత్తం అక్కడికి వచ్చినట్లు తెలిపాడు. కేసును రద్దు చేసేందుకు రూ.5 లక్షలు చెల్లించాలని స్టేషన్​​ ఆఫీసర్​ను డిమాండ్​ చేశాడు. తాను అడిగిన మొత్తం ఇవ్వకుంటే ఉద్యోగం నుంచి తొలగించేలా చేస్తానని బెదిరించాడు.

అయితే అతడిపై స్టేషన్​ ఆఫీసర్​కు అనుమానం వచ్చి తమదైన శైలిలో విచారించారు. అప్పుడు అసలు విషయం బయటపడింది. ఆ వ్యక్తి నకిలీ హైకోర్టు న్యాయమూర్తిగా నటిస్తూ డబ్బులు వసూలు చేస్తున్నట్లు తేలింది. ఇదివరకే పలుచోట్ల ఈ విధంగా అతడు మోసాలకు పాల్పడ్డట్లు గుర్తించారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు.

https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/dl-nrd-01-fakejudgearrest-dl10002_17122022085309_1712f_1671247389_956.jpg
పోలీసుల అదుపులో నరేంద్ర కుమార్​ అగర్వాల్​

దిల్లీకు చెందిన ఓ వ్యక్తి తాను హైకోర్టు న్యాయమూర్తినని నమ్మించి పోలీసు అధికారిని మోసం చేయాలనుకున్నాడు. ఓ కేసును రద్దు చేస్తానని చెప్పి డబ్బులు కూడా డిమాండ్​ చేశాడు. అడిగిన సొమ్ము ఇవ్వకపోతే ఉద్యోగం పోయేలా చేస్తానని బెదిరించాడు. చివరికు కటకటాల పాలయ్యాడు.
అసలేం జరిగిందంటే?
పోలీసుల వివరాల ప్రకారం.. డిసెంబర్ 16న నరేంద్ర కుమార్ అగర్వాల్ అనే ఓ వ్యక్తి.. సమయపుర్ బద్లీ సబ్‌డివిజన్‌ ఏసీపీ అనురాగ్ ద్వివేదికి వాట్సాప్​లో మెసేజ్​ పంపాడు. తాను హైకోర్టు న్యాయమూర్తినని, వెంటనే తనకు ఫోన్ చేయాల్సిందిగా మెసేజ్‌ చేశాడు. అయితే పోలీసు అధికారులు సదరు వ్యక్తికి కాల్ చేయగా ఓ కేసు విషయమై తాను పోలీస్​స్టేషన్​కు వస్తున్నట్లు తెలిపాడు.

60-65 సంవత్సరాల మధ్య వయసు ఉన్న ఆ వ్యక్తి స్టేషన్​కు వచ్చి తాను హైకోర్టు న్యాయమూర్తిగా పరిచయం చేసుకున్నాడు. పోలీస్​స్టేషన్ పరిధిలో జరుగుతున్న నేరాలకు సంబంధించి దాఖలైన పిటిషన్‌పై వ్యక్తిగత పరిశీలన నిమిత్తం అక్కడికి వచ్చినట్లు తెలిపాడు. కేసును రద్దు చేసేందుకు రూ.5 లక్షలు చెల్లించాలని స్టేషన్​​ ఆఫీసర్​ను డిమాండ్​ చేశాడు. తాను అడిగిన మొత్తం ఇవ్వకుంటే ఉద్యోగం నుంచి తొలగించేలా చేస్తానని బెదిరించాడు.

అయితే అతడిపై స్టేషన్​ ఆఫీసర్​కు అనుమానం వచ్చి తమదైన శైలిలో విచారించారు. అప్పుడు అసలు విషయం బయటపడింది. ఆ వ్యక్తి నకిలీ హైకోర్టు న్యాయమూర్తిగా నటిస్తూ డబ్బులు వసూలు చేస్తున్నట్లు తేలింది. ఇదివరకే పలుచోట్ల ఈ విధంగా అతడు మోసాలకు పాల్పడ్డట్లు గుర్తించారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు.

https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/dl-nrd-01-fakejudgearrest-dl10002_17122022085309_1712f_1671247389_956.jpg
పోలీసుల అదుపులో నరేంద్ర కుమార్​ అగర్వాల్​
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.