ETV Bharat / bharat

Mimicry on Modi: సంజ్ఞలతో మోదీని అనుకరించిన శివసేన ఎమ్మెల్యే - మోదీపై శివసేన ఎమ్మెల్యే మిమిక్రీ

Mimicry of Modi: మహారాష్ట్ర అసెంబ్లీలో ప్రధాని నరేంద్ర మోదీని అనుకరిస్తూ.. శివసేన ఎమ్మెల్యే ఎమ్మెల్యే భాస్కర్‌ జాదవ్‌ సంజ్ఞలు చేయడం తీవ్ర దుమారం రేపింది. ఆయన చేష్టలు ప్రధానిని ఎగతాళి చేసేలా ఉన్నాయంటూ భాజపా నేతల ధ్వజమెత్తారు. దీంతో చివరకు క్షమాపణలు చెప్పారు ఆ శాసనసభ్యుడు.

Mimicry of Modi
Mimicry of Modi
author img

By

Published : Dec 23, 2021, 11:57 AM IST

సంజ్ఞలతో మోదీని అనుకరించిన శివసేన ఎమ్మెల్యే

Mimicry of Modi: ప్రధాని నరేంద్ర మోదీని అనుకరిస్తూ శివసేన ఎమ్మెల్యే భాస్కర్‌ జాదవ్‌ సంజ్ఞలు చేయడం మహారాష్ట్ర అసెంబ్లీలో బుధవారం తీవ్ర దుమారానికి తెరలేపింది. ఆయన చేష్టలు ప్రధానిని ఎగతాళి చేసేలా ఉన్నాయంటూ ప్రతిపక్ష నేత దేవేంద్ర ఫడణవీస్‌ సహా భాజపా నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.

సభా కార్యకలాపాలు స్తంభించడంతో.. చివరకు జాదవ్‌ క్షమాపణలు చెప్పాల్సి వచ్చింది. విద్యుత్తు సంబంధిత అంశాల్లో ఇచ్చిన హామీలను రాష్ట్ర ప్రభుత్వం నిలబెట్టుకోలేదని సభలో కమలదళ సభ్యులు తొలుత విమర్శలు గుప్పించారు. దానిపై విద్యుత్తు శాఖ మంత్రి నితిన్‌ రౌత్‌ స్పందిస్తూ... ప్రధాని మోదీ కూడా రైతులకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేదని పేర్కొన్నారు. ఆ సమయంలో మోదీని అనుకరిస్తూ జాదవ్‌ చేతి సంజ్ఞలు చేశారు. ఫలితంగా సభలో పెద్ద దుమారం చెలరేగింది.

ప్రధానిని ఎమ్మెల్యే అవమానించారంటూ ప్రతిపక్ష నేతలు మండిపడ్డారు. ఆయన క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేశారు. గందరగోళం మధ్య సభ రెండుసార్లు వాయిదా పడింది. తిరిగి సభ సమావేశమయ్యాక జాదవ్‌ మాట్లాడుతూ... తాను ప్రధానికి వ్యతిరేకంగా ఎలాంటి వ్యాఖ్యలూ చేయలేదన్నారు. 2014లో మోదీ ప్రధాని అభ్యర్థిగా ఉన్నప్పుడు చెప్పినవాటి గురించే మాట్లాడానని తెలిపారు. తన వ్యాఖ్యలు, సంజ్ఞలు ఎవరికైనా బాధ కలిగించి ఉంటే... వారికి క్షమాపణలు తెలియజేస్తున్నానని పేర్కొన్నారు.

ఠాక్రే ఆరోగ్యం పై ప్రధాని ఆరా

ఇటీవలే వెన్నుపూస శస్త్రచికిత్స చేయించుకున్న మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే ఆరోగ్య పరిస్థితిపై ప్రధాని మోదీ బుధవారం ఆరా తీశారు. పార్లమెంటు శీతాకాల సమావేశాలు ముగిసిన నేపథ్యంలో ఆయా పార్టీల సభాపక్ష నేతలతో లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా సమావేశం నిర్వహించారు. అందులో పాల్లొన్న మోదీ.. ఠాక్రే ఆరోగ్యం గురించి శివసేన నేతలను అడిగి తెలుసుకున్నారు. సీఎం కోలుకుంటున్నారని, ప్రస్తుతం జరుగుతున్న మహారాష్ట్ర అసెంబ్లీ సమావేశాలకు ఆయన హాజరవుతారని శివసేననేత వినాయక్‌ రౌత్‌ ప్రధానికి తెలియజేశారు.

ఇదీ చూడండి: జర్మనీ అబ్బాయి.. రష్యా అమ్మాయి.. భారత్​లో పెళ్లి

సంజ్ఞలతో మోదీని అనుకరించిన శివసేన ఎమ్మెల్యే

Mimicry of Modi: ప్రధాని నరేంద్ర మోదీని అనుకరిస్తూ శివసేన ఎమ్మెల్యే భాస్కర్‌ జాదవ్‌ సంజ్ఞలు చేయడం మహారాష్ట్ర అసెంబ్లీలో బుధవారం తీవ్ర దుమారానికి తెరలేపింది. ఆయన చేష్టలు ప్రధానిని ఎగతాళి చేసేలా ఉన్నాయంటూ ప్రతిపక్ష నేత దేవేంద్ర ఫడణవీస్‌ సహా భాజపా నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.

సభా కార్యకలాపాలు స్తంభించడంతో.. చివరకు జాదవ్‌ క్షమాపణలు చెప్పాల్సి వచ్చింది. విద్యుత్తు సంబంధిత అంశాల్లో ఇచ్చిన హామీలను రాష్ట్ర ప్రభుత్వం నిలబెట్టుకోలేదని సభలో కమలదళ సభ్యులు తొలుత విమర్శలు గుప్పించారు. దానిపై విద్యుత్తు శాఖ మంత్రి నితిన్‌ రౌత్‌ స్పందిస్తూ... ప్రధాని మోదీ కూడా రైతులకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేదని పేర్కొన్నారు. ఆ సమయంలో మోదీని అనుకరిస్తూ జాదవ్‌ చేతి సంజ్ఞలు చేశారు. ఫలితంగా సభలో పెద్ద దుమారం చెలరేగింది.

ప్రధానిని ఎమ్మెల్యే అవమానించారంటూ ప్రతిపక్ష నేతలు మండిపడ్డారు. ఆయన క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేశారు. గందరగోళం మధ్య సభ రెండుసార్లు వాయిదా పడింది. తిరిగి సభ సమావేశమయ్యాక జాదవ్‌ మాట్లాడుతూ... తాను ప్రధానికి వ్యతిరేకంగా ఎలాంటి వ్యాఖ్యలూ చేయలేదన్నారు. 2014లో మోదీ ప్రధాని అభ్యర్థిగా ఉన్నప్పుడు చెప్పినవాటి గురించే మాట్లాడానని తెలిపారు. తన వ్యాఖ్యలు, సంజ్ఞలు ఎవరికైనా బాధ కలిగించి ఉంటే... వారికి క్షమాపణలు తెలియజేస్తున్నానని పేర్కొన్నారు.

ఠాక్రే ఆరోగ్యం పై ప్రధాని ఆరా

ఇటీవలే వెన్నుపూస శస్త్రచికిత్స చేయించుకున్న మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే ఆరోగ్య పరిస్థితిపై ప్రధాని మోదీ బుధవారం ఆరా తీశారు. పార్లమెంటు శీతాకాల సమావేశాలు ముగిసిన నేపథ్యంలో ఆయా పార్టీల సభాపక్ష నేతలతో లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా సమావేశం నిర్వహించారు. అందులో పాల్లొన్న మోదీ.. ఠాక్రే ఆరోగ్యం గురించి శివసేన నేతలను అడిగి తెలుసుకున్నారు. సీఎం కోలుకుంటున్నారని, ప్రస్తుతం జరుగుతున్న మహారాష్ట్ర అసెంబ్లీ సమావేశాలకు ఆయన హాజరవుతారని శివసేననేత వినాయక్‌ రౌత్‌ ప్రధానికి తెలియజేశారు.

ఇదీ చూడండి: జర్మనీ అబ్బాయి.. రష్యా అమ్మాయి.. భారత్​లో పెళ్లి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.