కరోనా కట్టడి కోసం 14 రోజులపాటు లాక్డౌన్ విధించింది ఒడిశా ప్రభుత్వం. అయితే.. లాక్డౌన్ సమయంలో నగరాల్లోని వీధి జంతువులకు ఆహారాన్ని అందించేందుకు రూ. 60 లక్షలు మంజూరు చేశారు ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్. ఈ మేరకు ముఖ్యమంత్రి సహాయ నిధి(సీఎంఆర్ఎఫ్) నుంచి నిధులను మంజూరు చేసినట్లు సీఎం కార్యాలయం పేర్కొంది.
![odisha cm plays with dogs](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/od-bbsr-04-money-for-animal-7209787_09052021141354_0905f_1620549834_884_0905newsroom_1620562303_349.jpeg)
![odisha cm with dog](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/od-bbsr-04-money-for-animal-7209787_09052021141354_0905f_1620549834_899_0905newsroom_1620562303_156.jpeg)
స్వచ్ఛంద సంస్థల ద్వారా
రాష్ట్రంలోని 48 మున్సిపాలిటీలు, 61 నోటిఫైడ్ ఏరియా కౌన్సిల్స్లోని వీధి కుక్కలు, ఇతర వీధి జంతువులకు స్వచ్ఛంద సంస్థల ద్వారా ఆహారాన్ని అందించనున్నట్లు వెల్లడించింది.
![navin patnaik fecilitates army dog](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/od-bbsr-04-money-for-animal-7209787_09052021141354_0905f_1620549834_1057_0905newsroom_1620562303_774.jpeg)
భువనేశ్వర్ మున్సిపల్ కార్పొరేషన్లు రోజుకు రూ. 20వేలు వీధి జంతువుల సంరక్షణ కోసం ఖర్చుచేయాలని ప్రకటనలో తెలిపింది రాష్ట్ర ప్రభుత్వం. నోటిఫైడ్ ఏరియా కౌన్సిల్స్.. రూ. 2 వేలు ఖర్చు చేయాలని పేర్కొంది.
ఇదీ చదవండి : 'స్వీయ జాగ్రత్తలు పాటిస్తే మూడో దశ ముప్పు తక్కువే'