ETV Bharat / bharat

కరోనా ఆంక్షలు.. ఏ రాష్ట్రాల్లో ఎలా?

author img

By

Published : May 16, 2021, 4:35 AM IST

Updated : May 16, 2021, 6:30 AM IST

దేశంలో కరోనా రెండో దశ విజృంభణ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో వైరస్​ వ్యాప్తి కట్టడికి వివిధ రాష్ట్రాలు కఠిన చర్యలు చేపడుతున్నాయి. బంగాల్​లో ఆదివారం నుంచి మే 30 వరకు సంపూర్ణ లాక్​డౌన్​ విధించారు. ఇంకా ఏయే రాష్ట్రాల్లో ఎలాంటి ఆంక్షలు అమల్లో ఉన్నాయంటే..

Lockdown in states
కరోనా ఆంక్షలు

కరోనా కట్టడికి సంపూర్ణ లాక్​డౌన్​ విధించిన రాష్ట్రాల జాబితాలో బంగాల్​ చేరింది. పలు రాష్ట్రాల్లో ఇప్పటికే విధించిన ఆంక్షలు సానుకూల ఫలితాలనిస్తున్న తరుణంలో.. వాటినే కొనసాగించాలని యోచిస్తున్నాయి. ఉత్తర్​ప్రదేశ్​, ఛత్తీస్​గఢ్ వంటి రాష్ట్రాల్లో ఆంక్షలను పొడిగించారు.

లాక్‌డౌన్‌ ఎక్కడెక్కడ?

  • బంగాల్​లో మే 16 నుంచి మే 30 వరకు సంపూర్ణ లాక్​డౌన్​ విధించారు.
  • దిల్లీలో ఇప్పటికే అమలవుతున్న లాక్‌డౌన్‌ను ఈ నెల 17 వరకు పొడిగించారు.
  • తమిళనాడు, పుదుచ్చేరి, రాజస్థాన్​లో మే 10 నుంచి మే 24 వరకు లాక్​డౌన్ విధించారు.
  • హరియాణాలో ఈ నెల 17 వరకు లాక్​డౌన్​ను పొడిగించారు. అంతకుముందు 9 జిల్లాల్లో వారాంతపు కర్ఫ్యూను అమలు చేశారు.
  • కేరళలో మే 23 వరకు లాక్​డౌన్​ కొనసాగనుంది. మిజోరంలో ఐజ్వాల్​ సహా ఇతర జిల్లాల్లో విధించిన లాక్​డౌన్​ మే 24 వరకు కొనసాగనుంది.
  • ఒడిశాలో మే 19 వరకు లాక్​డౌన్​ను పొడిగించారు.
  • కర్ణాటకలో మే 24 వరకు లాక్​డౌన్​ విధించారు.
  • తెలంగాణలో మే 12 నుంచి 10 రోజుల పాటు లాక్​డౌన్​ విధించారు.
  • నాగాలాండ్‌లో మే 14 నుంచి మే 21వరకు వారం పాటు పూర్తి లాక్​డౌన్​ విధించారు.
  • బిహార్​లో మే 15న లాక్​డౌన్​ ముగియాల్సి ఉండగా.. మే 25 వరకు పొడిగిస్తున్నట్లు ఆ రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది.
  • సిక్కింలో మే 17 నుంచి మే 24 వరకు లాక్​డౌన్​ విధించారు.

ఇదీ చూడండి: ఆ రాష్ట్రంలో ప్రభుత్వ అధీనంలోకి ప్రైవేటు ఆస్పత్రులు

లాక్‌డౌన్‌ తరహా..

  • మహారాష్ట్రలో ఏప్రిల్‌ 5న ప్రారంభించిన నిబంధనలను జూన్​ 1 వరకు పొడిగించారు.
  • ఉత్తర్​ప్రదేశ్​లో మే 24 ఉదయం 7 గంటల వరకు పాక్షిక కర్ఫ్యూను పొడిగించారు.
  • ఝార్ఖండ్​లో మే 27 వరకు లాక్​డౌన్​ తరహా ఆంక్షలు

కర్ఫ్యూలు..

  • గోవా ప్రభుత్వం ఈనెల 9 నుంచి 24 వరకు కర్ఫ్యూ అమలు చేస్తోంది.
  • మధ్యప్రదేశ్‌లో ఈనెల 17 వరకు జనతా కర్ఫ్యూ విధించారు. అత్యవసర సేవలకు మాత్రమే అనుమతిస్తున్నారు.
  • గుజరాత్‌లో రాత్రివేళ కర్ఫ్యూ అమల్లో ఉండగా పగటిపూట ఆంక్షలు 36 నగరాల్లో ఈనెల 18 వరకు అమలు చేస్తున్నారు.
  • అసోంలో కర్ఫ్యూ రాత్రి 8 నుంచి అమలు చేస్తుండగా ఇకపై మధ్యాహ్నం 2 గంటల ఉదయం 5 గంటల వరకు ప్రజల కదలికలపై నిషేధం విధించారు.
  • అరుణాచల్‌ప్రదేశ్‌ ప్రభుత్వం సాయంత్రం 6.30 నుంచి ఉదయం 5 వరకు రాత్రి ఈ నెల మొత్తం అమలు చేస్తోంది.
  • మణిపుర్‌లోని 7 జిల్లాల్లో ఈనెల 8 నుంచి 17 వరకు కర్ఫ్యూ.
  • ఉత్తరాఖండ్‌ ప్రభుత్వం మే 18 వరకు కర్ఫ్యూ విధించింది.
  • హిమాచల్‌ప్రదేశ్‌ ప్రభుత్వం మే 26 వరకు కర్ప్యూ పొడిగించింది.
  • జమ్ముకశ్మీర్‌ అధికార యంత్రాంగం ఈనెల 24 వరకు నిబంధనలను అమలు చేస్తోంది.
  • ఆంధ్రప్రదేశ్​లో మే 18 వరకు కర్ఫ్యూ కొనసాగనుంది.

వారాంతాల్లో..

  • చండీగఢ్‌లో మే 18 వరకు వారాంతపు లాక్‌డౌన్‌లు కొనసాగనున్నాయి.
  • ఛత్తీస్‌గఢ్‌లోనూ వారాంతపు లాక్‌డౌన్‌ విధించారు. స్థానికంగా అమలు చేసే లాక్‌డౌన్‌లను ఈనెల 31 వరకు పొడిగించుకోవచ్చని జిల్లా కలెక్టర్లకు ప్రభుత్వం ఆదేశాలిచ్చింది.
  • ఇదీ చూడండి: 'జులై నాటికి 51.6 కోట్ల టీకా డోసుల పంపిణీ'

కరోనా కట్టడికి సంపూర్ణ లాక్​డౌన్​ విధించిన రాష్ట్రాల జాబితాలో బంగాల్​ చేరింది. పలు రాష్ట్రాల్లో ఇప్పటికే విధించిన ఆంక్షలు సానుకూల ఫలితాలనిస్తున్న తరుణంలో.. వాటినే కొనసాగించాలని యోచిస్తున్నాయి. ఉత్తర్​ప్రదేశ్​, ఛత్తీస్​గఢ్ వంటి రాష్ట్రాల్లో ఆంక్షలను పొడిగించారు.

లాక్‌డౌన్‌ ఎక్కడెక్కడ?

  • బంగాల్​లో మే 16 నుంచి మే 30 వరకు సంపూర్ణ లాక్​డౌన్​ విధించారు.
  • దిల్లీలో ఇప్పటికే అమలవుతున్న లాక్‌డౌన్‌ను ఈ నెల 17 వరకు పొడిగించారు.
  • తమిళనాడు, పుదుచ్చేరి, రాజస్థాన్​లో మే 10 నుంచి మే 24 వరకు లాక్​డౌన్ విధించారు.
  • హరియాణాలో ఈ నెల 17 వరకు లాక్​డౌన్​ను పొడిగించారు. అంతకుముందు 9 జిల్లాల్లో వారాంతపు కర్ఫ్యూను అమలు చేశారు.
  • కేరళలో మే 23 వరకు లాక్​డౌన్​ కొనసాగనుంది. మిజోరంలో ఐజ్వాల్​ సహా ఇతర జిల్లాల్లో విధించిన లాక్​డౌన్​ మే 24 వరకు కొనసాగనుంది.
  • ఒడిశాలో మే 19 వరకు లాక్​డౌన్​ను పొడిగించారు.
  • కర్ణాటకలో మే 24 వరకు లాక్​డౌన్​ విధించారు.
  • తెలంగాణలో మే 12 నుంచి 10 రోజుల పాటు లాక్​డౌన్​ విధించారు.
  • నాగాలాండ్‌లో మే 14 నుంచి మే 21వరకు వారం పాటు పూర్తి లాక్​డౌన్​ విధించారు.
  • బిహార్​లో మే 15న లాక్​డౌన్​ ముగియాల్సి ఉండగా.. మే 25 వరకు పొడిగిస్తున్నట్లు ఆ రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది.
  • సిక్కింలో మే 17 నుంచి మే 24 వరకు లాక్​డౌన్​ విధించారు.

ఇదీ చూడండి: ఆ రాష్ట్రంలో ప్రభుత్వ అధీనంలోకి ప్రైవేటు ఆస్పత్రులు

లాక్‌డౌన్‌ తరహా..

  • మహారాష్ట్రలో ఏప్రిల్‌ 5న ప్రారంభించిన నిబంధనలను జూన్​ 1 వరకు పొడిగించారు.
  • ఉత్తర్​ప్రదేశ్​లో మే 24 ఉదయం 7 గంటల వరకు పాక్షిక కర్ఫ్యూను పొడిగించారు.
  • ఝార్ఖండ్​లో మే 27 వరకు లాక్​డౌన్​ తరహా ఆంక్షలు

కర్ఫ్యూలు..

  • గోవా ప్రభుత్వం ఈనెల 9 నుంచి 24 వరకు కర్ఫ్యూ అమలు చేస్తోంది.
  • మధ్యప్రదేశ్‌లో ఈనెల 17 వరకు జనతా కర్ఫ్యూ విధించారు. అత్యవసర సేవలకు మాత్రమే అనుమతిస్తున్నారు.
  • గుజరాత్‌లో రాత్రివేళ కర్ఫ్యూ అమల్లో ఉండగా పగటిపూట ఆంక్షలు 36 నగరాల్లో ఈనెల 18 వరకు అమలు చేస్తున్నారు.
  • అసోంలో కర్ఫ్యూ రాత్రి 8 నుంచి అమలు చేస్తుండగా ఇకపై మధ్యాహ్నం 2 గంటల ఉదయం 5 గంటల వరకు ప్రజల కదలికలపై నిషేధం విధించారు.
  • అరుణాచల్‌ప్రదేశ్‌ ప్రభుత్వం సాయంత్రం 6.30 నుంచి ఉదయం 5 వరకు రాత్రి ఈ నెల మొత్తం అమలు చేస్తోంది.
  • మణిపుర్‌లోని 7 జిల్లాల్లో ఈనెల 8 నుంచి 17 వరకు కర్ఫ్యూ.
  • ఉత్తరాఖండ్‌ ప్రభుత్వం మే 18 వరకు కర్ఫ్యూ విధించింది.
  • హిమాచల్‌ప్రదేశ్‌ ప్రభుత్వం మే 26 వరకు కర్ప్యూ పొడిగించింది.
  • జమ్ముకశ్మీర్‌ అధికార యంత్రాంగం ఈనెల 24 వరకు నిబంధనలను అమలు చేస్తోంది.
  • ఆంధ్రప్రదేశ్​లో మే 18 వరకు కర్ఫ్యూ కొనసాగనుంది.

వారాంతాల్లో..

  • చండీగఢ్‌లో మే 18 వరకు వారాంతపు లాక్‌డౌన్‌లు కొనసాగనున్నాయి.
  • ఛత్తీస్‌గఢ్‌లోనూ వారాంతపు లాక్‌డౌన్‌ విధించారు. స్థానికంగా అమలు చేసే లాక్‌డౌన్‌లను ఈనెల 31 వరకు పొడిగించుకోవచ్చని జిల్లా కలెక్టర్లకు ప్రభుత్వం ఆదేశాలిచ్చింది.
  • ఇదీ చూడండి: 'జులై నాటికి 51.6 కోట్ల టీకా డోసుల పంపిణీ'
Last Updated : May 16, 2021, 6:30 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.