ETV Bharat / bharat

అసెంబ్లీ ఎన్నికలు: జోరుగా పోలింగ్​- ఓటేసిన ప్రముఖులు

author img

By

Published : Apr 6, 2021, 6:46 AM IST

Updated : Apr 6, 2021, 5:41 PM IST

Live Updates: elections in 4 states and 1 UT
లైవ్​ అప్​డేట్స్​: 5 రాష్ట్రాల్లో పోలింగ్​కు సర్వం సిద్ధం

17:37 April 06

సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్​ వివరాలు..

  • బంగాల్​- 77.66 శాతం
  • కేరళ- 69.41 శాతం
  • తమిళనాడు- 60.78 శాతం
  • పుదుచ్చేరి- 76.57 శాతం
  • అసోం- 78.94 శాతం

15:24 April 06

మధ్యాహ్నం 3 గంటల వరకు పోలింగ్ వివరాలు 

  • కేరళ- 60.30 శాతం
  • అసోం- 68.31 శాతం
  • పుదుచ్చేరి- 66.57 శాతం
  • తమిళనాడు- 53.35 శాతం
  • బంగాల్​- 68.04 శాతం

13:46 April 06

జోరుగా పోలింగ్​..

బంగాల్​ మూడో దశ అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఓటింగ్​ భారీగా జరుగుతోంది. పెద్ద ఎత్తున ప్రజలు ఓటేసేందుకు తరలివస్తున్నారు. 

  • మధ్యాహ్నం ఒంటిగంట వరకు బంగాల్​లో 54 శాతం పోలింగ్​ నమోదైంది.
  • తమిళనాడులో 40, పుదుచ్చేరి 54 శాతం మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు.
  • కేరళలో 47.28 శాతం, అసోంలో 53 శాతం ఓటింగ్​ జరిగింది.

13:43 April 06

ఓటేసిన మమ్మూట్టీ 

ప్రముఖ మలయాళ నటుడు మమ్మూట్టీ ఓటేశారు. ఎర్నాకుళంలోని పొన్నురున్ని పోలింగ్​ కేంద్రంలో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. 

12:26 April 06

ఓటేసిన వైకో..

ఎండీఎంకే అధినేత వైకో.. తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. కలింగపట్టీలోని పోలింగ్​ కేంద్రంలో ఓటేశారు వైకో 

12:03 April 06

  • WB: Clash erupts b/w TMC & BJP supporters in Arambag, as voting in assembly elections is underway

    In Arandi-I area here, we've minority, SC voters who love Mamata Banerjee. Goons of BJP threatened & tortured women voters last night: Sujata Mondal, TMC candidate from Arambagh pic.twitter.com/EqUVoAzBiA

    — ANI (@ANI) April 6, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

టీఎంసీ, భాజపా కార్యకర్తల మధ్య ఘర్షణ

బంగాల్​లోని ఆరంబాగ్​లో తృణమూల్ కాంగ్రెస్​, భాజపా కార్యకర్తలు ఘర్షణకు దిగారు. మమతా బెనర్జీకి ఓటు వేయద్దంటూ.. భాజపా కార్యకర్తలు మహిళలు బెదిరిస్తున్నారని తృణమూల్ అభ్యర్థి సుజాత మోండల్​ ఆరోపించారు. 

11:37 April 06

ఐదు రాష్ట్రాల పోలింగ్ శాతం 

బంగాల్​లో ఉదయం 11 గంటల వరకు 34.71 శాతం పోలింగ్ నమోదైనట్లు ఈసీ తెలిపింది. కేరళలో 29.03, తమిళనాడులో 29.29, పుదుచ్చేరిలో 20.07, అసోంలో 33.18 శాతం పోలింగ్​ నమోదైంది. 

11:19 April 06

ఓటేసిన భాజపా నేత  హిమంతా బిశ్వ శర్మ

అసోం మంత్రి, భాజపా నాయకుడు హిమంతా బిశ్వ శర్మ ఓటేశారు. గువాహటిలోని అమీన్​గావ్​ పోలింగ్ స్టేషన్​లో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. 

10:47 April 06

ఓటేసిన పళనిస్వామి

తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి ఓటేశారు. ఎడప్పాడిలోని సిలువంపాయంలో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. 

10:36 April 06

  • We have found people from DMK distributing money to voters. We have complained to the Election Commission. DMK would want to win by hook or by crook: Khushbu Sundar, BJP candidate from Thousand Lights Assembly constituency, Chennai#TamilNaduElections pic.twitter.com/RQp6DczJoZ

    — ANI (@ANI) April 6, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

డీఎంకేపై ఈసీకు ఖుష్బూ ఫిర్యాదు 

ఓటర్లకు డీఎంకే కార్యకర్తలు డబ్బులు పంచుతున్నారని భాజపా అభ్యర్థి ఖుష్బూ సుందర్ ఆరోపించారు. ఈ విషయాన్ని తాము ఈసీ దృష్టికి తీసుకెళ్లామన్నారు. 

10:26 April 06

ఓటేసేందుకు సైకిల్​పై వచ్చిన విజయ్​

తమిళ ప్రముఖ నటుడు విజయ్ ఓటేసేందుకు సైకిల్​పై వచ్చాడు. చెన్నై నీలంకరైలోని వేల్స్​ ఇంటర్నేషనల్ స్కూల్​లో విజయ్​.. తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. 

10:16 April 06

ఓటేసిన గవర్నర్​ తమిళసై 

తెలంగాణ గవర్నర్, పుదుచ్చేరి లెఫ్టినెంట్​ గవర్నర్ తమిళిసై ఓటేశారు. చెన్నై విరుంబాక్కంలోని పోలింగ్​ కేంద్రంలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. 

10:01 April 06

ప్రముఖ తమిళనటుడు విజయ్​.. తన ఓటు హక్కును వినియోగించుకునేందుకు చెన్నై నీలంకరాయ్​లోని పోలింగ్​ కేంద్రానికి వచ్చారు.

09:59 April 06

పోటెత్తిన ఓటర్లు..

బంగాల్​, అసోంలో ఉదయం 9.30 గంటల వరకు 14 శాతం పోలింగ్​ నమోదైంది. కేరళలో 17 శాతానికిపైగా ఓటింగ్​ జరిగింది. 

09:44 April 06

  • Tamil Nadu: DMK chief MK Stalin, along with his wife Durga Stalin and their son & party leader Udhayanidhi Stalin, visited the memorial of former CM & his father M Karunanidhi in Chennai earlier today. pic.twitter.com/azbNOmWVqh

    — ANI (@ANI) April 6, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

కరుణానిధి స్మారకం వద్ద స్టాలిన్ నివాళి

డీఎంకే అధినేత స్టాలిన్. తన ఓటుహక్కును వినియోగించుకున్నారు. అంతకు ముందు కుటుంబసమేతంగా మాజీ సీఎం. కరుణానిధి స్మారకం దగ్గర స్టాలిన్ నివాళి అర్పించారు. 

09:35 April 06

ఓటేసిన పన్నీర్​సెల్వం..

తమిళనాడు డిప్యూటీ సీఎం ఓ. పన్నీర్​సెల్వం.. తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. పెరియకుళమ్​లోని పోలింగ్​ కేంద్రంలో ఆయన ఓటేశారు. ఎన్​డీఏ అభ్యర్థులు విజయం సాధించనున్నారని పన్నీర్​ సెల్వం తెలిపారు. అన్నాడీఎంకే మూడోసారి అధికారంలోకి రాబోతోందని స్పష్టం చేశారు. 

09:27 April 06

బంగాల్​లోని దగిరా బదుల్​దంగా పోలింగ్ కేంద్రాల్లో ప్రజలు ఓటు వేయకుండా తృణమూల్ కార్యకర్తలు అడ్డుకుంటున్నారని.. భాజపా నేత దీపక్ హల్దార్​ తెలిపారు. ఈ విషయాన్ని ఈసీ దృష్టికి తీసుకెళ్లానన్నారు. 

09:24 April 06

 పుదుచ్చేరి మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నాయకులు వీ. నారాయణస్వామి ఓటేశారు.  

08:16 April 06

స్టాలిన్​ ఓటు..

డీఎంకే అధినేత స్టాలిన్​.. తమిళనాడు తేయ్​నంపేట్​లో ఓటేశారు. కుమారుడు ఉదయనిధి స్టాలిన్​, కుటుంబతో కలిసి ఓటుహక్కును వినియోగించుకున్నారు.

08:09 April 06

ఎల్​డీఎఫ్​ మద్దతుదారుడు ఇలా..

కేరళలో మరోమారు అధికారాన్ని దక్కించుకునేందుకు ఎల్​డీఎఫ్​ చూస్తోంది. తాజాగా.. ఓ మద్దతుదారుడు.. ఇలా ఎల్​డీఎఫ్​పై ప్రేమను చాటుకున్నాడు.

07:33 April 06

  • Tamil Nadu: Makkal Needhi Maiam chief Kamal Haasan, his daughters Shruti Haasan & Akshara Haasan stand in a queue as they await their turn to cast vote. Visuals from Chennai High School, Teynampet in Chennai.#TamilNaduElections pic.twitter.com/7zjjcGUjVV

    — ANI (@ANI) April 6, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

కమల్​ ఓటు...

ప్రముఖ నటుడు, మక్కల్​ నీది మయ్యం అధినేత కమల్​ హాసన్​.. చెన్నైలోని ఓ పోలింగ్​ కేంద్రంలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. కమల్​తో పాటు ఆయన కుమార్తెలు శృతి హాసన్​, అక్షర హాసన్​లు కూడా ఓటేశారు.

07:22 April 06

రజనీ ఓటు..

ప్రముఖ సినీ నటుడు, సూపర్​స్టార్​ రజనీకాంత్​.. తమిళనాడు చెన్నెలోని ఓ పోలింగ్​ బూత్​ వద్ద తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.

వాస్తవానికి తమిళ పోరులో రజనీ కూడా బరిలో దిగాల్సి ఉంది. కానీ ఆరోగ్య కారణాలతో చివరి నిమిషంలో ఆయన రాజకీయల నుంచి తప్పుకున్నారు.

07:09 April 06

మెట్రోమ్యాన్​ ఓటు...

మెట్రోమ్యాన్​ శ్రీధరన్​.. కేరళ పొన్నానిలోని ఓ పోలింగ్​ బూత్​లో తన ఓటుహక్కును వినియోగించుకున్నారు.

07:07 April 06

  • Elections are taking place in Assam, Kerala, Puducherry, Tamil Nadu and West Bengal. I request the people in these places to vote in record numbers, particularly the young voters.

    — Narendra Modi (@narendramodi) April 6, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

మోదీ ట్వీట్​..

4 రాష్ట్రాలు- ఒక కేంద్ర పాలిత ప్రాంతంలో ఎన్నికలు జరగుతున్న వేళ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ట్వీట్​ చేశారు. ప్రజలు భారీ సంఖ్యల్లో వచ్చి.. రికార్డు స్థాయిలో తమ ఓటుహక్కును వినియోగించుకోవాలని కోరారు.

07:02 April 06

మెట్రోమ్యాన్​...

మెట్రోమ్యాన్​గా పేరొందిన శ్రీధరన్​.. కేరళ పొన్నాని నియోజకవర్గంలోని ఓ పోలింగ్​కు వెళ్లారు. అక్కడ తన ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.

ఇటీవలే భాజపాలో చేరిన శ్రీధరన్​.. భాజపా టికెట్​పై పాలక్కడ్​ నుంచి ఎన్నికల బరిలో దిగారు.

06:58 April 06

పోలింగ్​ షురూ...

దేశంలోని 4 రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలో ఓటింగ్​ ప్రారంభమైంది. కరోనా నిబంధనలు- కట్టుదిట్ట భద్రత మధ్య ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇందుకోసం ఈసీ అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది.

కేరళ, తమిళనాడు, బంగాల్(మూడో దశ)​, అసోం(మూడో దశ), పుదుచ్చేరిలకు ఎన్నికలు జరుగుతున్నాయి.

06:51 April 06

అసోంలో..

పోలింగ్​ ప్రారంభానికి ముందే.. అసోంలోని పలు పోలింగ్​ కేంద్రాలు ఓటర్లతో కిటకిటలాడుతున్నాయి. తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

అసోంలో ఇప్పటికే రెండు విడతల్లో పోలింగ్​ జరగ్గా.. రెండింటిలోనూ 75శాతానికిపైగా పోలింగ్​ నమోదైంది.

06:49 April 06

ఏర్పాట్లు ఇలా...

ఎన్నికలు జరుగుతున్న ప్రాంతాల్లో ఎన్నికల సంఘం ఏర్పాట్లను ముమ్మరం చేసింది.

ఉదయం 7 గంటలకు పోలింగ్​ ప్రారంభం కానుండగా.. సాయంత్రం 6 గంటల వరకు ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.  

06:33 April 06

లైవ్​:9:30 గంటల వరకు బంగాల్, అసోంలో 14 శాతం పోలింగ్​

దేశంలో ఓట్ల పండగకు సమయం ఆసన్నమైంది. మరికొద్దిసేపట్లో.. తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి అసెంబ్లీలతో పాటు బంగాల్​(మూడో దశ), అసోం(మూడో దశ)కు ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకోసం ఎన్నికల కమిషన్(ఈసీ)​ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.

తమిళనాడులో 234, కేరళలో 140, పుదుచ్చేరిలో 30 స్థానాలకు ఓటింగ్​ జరగనుండగా.. బంగాల్​లో 31, అసోంలో 40 సీట్లకు పోలింగ్​ నిర్వహించనున్నారు.

17:37 April 06

సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్​ వివరాలు..

  • బంగాల్​- 77.66 శాతం
  • కేరళ- 69.41 శాతం
  • తమిళనాడు- 60.78 శాతం
  • పుదుచ్చేరి- 76.57 శాతం
  • అసోం- 78.94 శాతం

15:24 April 06

మధ్యాహ్నం 3 గంటల వరకు పోలింగ్ వివరాలు 

  • కేరళ- 60.30 శాతం
  • అసోం- 68.31 శాతం
  • పుదుచ్చేరి- 66.57 శాతం
  • తమిళనాడు- 53.35 శాతం
  • బంగాల్​- 68.04 శాతం

13:46 April 06

జోరుగా పోలింగ్​..

బంగాల్​ మూడో దశ అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఓటింగ్​ భారీగా జరుగుతోంది. పెద్ద ఎత్తున ప్రజలు ఓటేసేందుకు తరలివస్తున్నారు. 

  • మధ్యాహ్నం ఒంటిగంట వరకు బంగాల్​లో 54 శాతం పోలింగ్​ నమోదైంది.
  • తమిళనాడులో 40, పుదుచ్చేరి 54 శాతం మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు.
  • కేరళలో 47.28 శాతం, అసోంలో 53 శాతం ఓటింగ్​ జరిగింది.

13:43 April 06

ఓటేసిన మమ్మూట్టీ 

ప్రముఖ మలయాళ నటుడు మమ్మూట్టీ ఓటేశారు. ఎర్నాకుళంలోని పొన్నురున్ని పోలింగ్​ కేంద్రంలో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. 

12:26 April 06

ఓటేసిన వైకో..

ఎండీఎంకే అధినేత వైకో.. తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. కలింగపట్టీలోని పోలింగ్​ కేంద్రంలో ఓటేశారు వైకో 

12:03 April 06

  • WB: Clash erupts b/w TMC & BJP supporters in Arambag, as voting in assembly elections is underway

    In Arandi-I area here, we've minority, SC voters who love Mamata Banerjee. Goons of BJP threatened & tortured women voters last night: Sujata Mondal, TMC candidate from Arambagh pic.twitter.com/EqUVoAzBiA

    — ANI (@ANI) April 6, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

టీఎంసీ, భాజపా కార్యకర్తల మధ్య ఘర్షణ

బంగాల్​లోని ఆరంబాగ్​లో తృణమూల్ కాంగ్రెస్​, భాజపా కార్యకర్తలు ఘర్షణకు దిగారు. మమతా బెనర్జీకి ఓటు వేయద్దంటూ.. భాజపా కార్యకర్తలు మహిళలు బెదిరిస్తున్నారని తృణమూల్ అభ్యర్థి సుజాత మోండల్​ ఆరోపించారు. 

11:37 April 06

ఐదు రాష్ట్రాల పోలింగ్ శాతం 

బంగాల్​లో ఉదయం 11 గంటల వరకు 34.71 శాతం పోలింగ్ నమోదైనట్లు ఈసీ తెలిపింది. కేరళలో 29.03, తమిళనాడులో 29.29, పుదుచ్చేరిలో 20.07, అసోంలో 33.18 శాతం పోలింగ్​ నమోదైంది. 

11:19 April 06

ఓటేసిన భాజపా నేత  హిమంతా బిశ్వ శర్మ

అసోం మంత్రి, భాజపా నాయకుడు హిమంతా బిశ్వ శర్మ ఓటేశారు. గువాహటిలోని అమీన్​గావ్​ పోలింగ్ స్టేషన్​లో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. 

10:47 April 06

ఓటేసిన పళనిస్వామి

తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి ఓటేశారు. ఎడప్పాడిలోని సిలువంపాయంలో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. 

10:36 April 06

  • We have found people from DMK distributing money to voters. We have complained to the Election Commission. DMK would want to win by hook or by crook: Khushbu Sundar, BJP candidate from Thousand Lights Assembly constituency, Chennai#TamilNaduElections pic.twitter.com/RQp6DczJoZ

    — ANI (@ANI) April 6, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

డీఎంకేపై ఈసీకు ఖుష్బూ ఫిర్యాదు 

ఓటర్లకు డీఎంకే కార్యకర్తలు డబ్బులు పంచుతున్నారని భాజపా అభ్యర్థి ఖుష్బూ సుందర్ ఆరోపించారు. ఈ విషయాన్ని తాము ఈసీ దృష్టికి తీసుకెళ్లామన్నారు. 

10:26 April 06

ఓటేసేందుకు సైకిల్​పై వచ్చిన విజయ్​

తమిళ ప్రముఖ నటుడు విజయ్ ఓటేసేందుకు సైకిల్​పై వచ్చాడు. చెన్నై నీలంకరైలోని వేల్స్​ ఇంటర్నేషనల్ స్కూల్​లో విజయ్​.. తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. 

10:16 April 06

ఓటేసిన గవర్నర్​ తమిళసై 

తెలంగాణ గవర్నర్, పుదుచ్చేరి లెఫ్టినెంట్​ గవర్నర్ తమిళిసై ఓటేశారు. చెన్నై విరుంబాక్కంలోని పోలింగ్​ కేంద్రంలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. 

10:01 April 06

ప్రముఖ తమిళనటుడు విజయ్​.. తన ఓటు హక్కును వినియోగించుకునేందుకు చెన్నై నీలంకరాయ్​లోని పోలింగ్​ కేంద్రానికి వచ్చారు.

09:59 April 06

పోటెత్తిన ఓటర్లు..

బంగాల్​, అసోంలో ఉదయం 9.30 గంటల వరకు 14 శాతం పోలింగ్​ నమోదైంది. కేరళలో 17 శాతానికిపైగా ఓటింగ్​ జరిగింది. 

09:44 April 06

  • Tamil Nadu: DMK chief MK Stalin, along with his wife Durga Stalin and their son & party leader Udhayanidhi Stalin, visited the memorial of former CM & his father M Karunanidhi in Chennai earlier today. pic.twitter.com/azbNOmWVqh

    — ANI (@ANI) April 6, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

కరుణానిధి స్మారకం వద్ద స్టాలిన్ నివాళి

డీఎంకే అధినేత స్టాలిన్. తన ఓటుహక్కును వినియోగించుకున్నారు. అంతకు ముందు కుటుంబసమేతంగా మాజీ సీఎం. కరుణానిధి స్మారకం దగ్గర స్టాలిన్ నివాళి అర్పించారు. 

09:35 April 06

ఓటేసిన పన్నీర్​సెల్వం..

తమిళనాడు డిప్యూటీ సీఎం ఓ. పన్నీర్​సెల్వం.. తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. పెరియకుళమ్​లోని పోలింగ్​ కేంద్రంలో ఆయన ఓటేశారు. ఎన్​డీఏ అభ్యర్థులు విజయం సాధించనున్నారని పన్నీర్​ సెల్వం తెలిపారు. అన్నాడీఎంకే మూడోసారి అధికారంలోకి రాబోతోందని స్పష్టం చేశారు. 

09:27 April 06

బంగాల్​లోని దగిరా బదుల్​దంగా పోలింగ్ కేంద్రాల్లో ప్రజలు ఓటు వేయకుండా తృణమూల్ కార్యకర్తలు అడ్డుకుంటున్నారని.. భాజపా నేత దీపక్ హల్దార్​ తెలిపారు. ఈ విషయాన్ని ఈసీ దృష్టికి తీసుకెళ్లానన్నారు. 

09:24 April 06

 పుదుచ్చేరి మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నాయకులు వీ. నారాయణస్వామి ఓటేశారు.  

08:16 April 06

స్టాలిన్​ ఓటు..

డీఎంకే అధినేత స్టాలిన్​.. తమిళనాడు తేయ్​నంపేట్​లో ఓటేశారు. కుమారుడు ఉదయనిధి స్టాలిన్​, కుటుంబతో కలిసి ఓటుహక్కును వినియోగించుకున్నారు.

08:09 April 06

ఎల్​డీఎఫ్​ మద్దతుదారుడు ఇలా..

కేరళలో మరోమారు అధికారాన్ని దక్కించుకునేందుకు ఎల్​డీఎఫ్​ చూస్తోంది. తాజాగా.. ఓ మద్దతుదారుడు.. ఇలా ఎల్​డీఎఫ్​పై ప్రేమను చాటుకున్నాడు.

07:33 April 06

  • Tamil Nadu: Makkal Needhi Maiam chief Kamal Haasan, his daughters Shruti Haasan & Akshara Haasan stand in a queue as they await their turn to cast vote. Visuals from Chennai High School, Teynampet in Chennai.#TamilNaduElections pic.twitter.com/7zjjcGUjVV

    — ANI (@ANI) April 6, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

కమల్​ ఓటు...

ప్రముఖ నటుడు, మక్కల్​ నీది మయ్యం అధినేత కమల్​ హాసన్​.. చెన్నైలోని ఓ పోలింగ్​ కేంద్రంలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. కమల్​తో పాటు ఆయన కుమార్తెలు శృతి హాసన్​, అక్షర హాసన్​లు కూడా ఓటేశారు.

07:22 April 06

రజనీ ఓటు..

ప్రముఖ సినీ నటుడు, సూపర్​స్టార్​ రజనీకాంత్​.. తమిళనాడు చెన్నెలోని ఓ పోలింగ్​ బూత్​ వద్ద తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.

వాస్తవానికి తమిళ పోరులో రజనీ కూడా బరిలో దిగాల్సి ఉంది. కానీ ఆరోగ్య కారణాలతో చివరి నిమిషంలో ఆయన రాజకీయల నుంచి తప్పుకున్నారు.

07:09 April 06

మెట్రోమ్యాన్​ ఓటు...

మెట్రోమ్యాన్​ శ్రీధరన్​.. కేరళ పొన్నానిలోని ఓ పోలింగ్​ బూత్​లో తన ఓటుహక్కును వినియోగించుకున్నారు.

07:07 April 06

  • Elections are taking place in Assam, Kerala, Puducherry, Tamil Nadu and West Bengal. I request the people in these places to vote in record numbers, particularly the young voters.

    — Narendra Modi (@narendramodi) April 6, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

మోదీ ట్వీట్​..

4 రాష్ట్రాలు- ఒక కేంద్ర పాలిత ప్రాంతంలో ఎన్నికలు జరగుతున్న వేళ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ట్వీట్​ చేశారు. ప్రజలు భారీ సంఖ్యల్లో వచ్చి.. రికార్డు స్థాయిలో తమ ఓటుహక్కును వినియోగించుకోవాలని కోరారు.

07:02 April 06

మెట్రోమ్యాన్​...

మెట్రోమ్యాన్​గా పేరొందిన శ్రీధరన్​.. కేరళ పొన్నాని నియోజకవర్గంలోని ఓ పోలింగ్​కు వెళ్లారు. అక్కడ తన ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.

ఇటీవలే భాజపాలో చేరిన శ్రీధరన్​.. భాజపా టికెట్​పై పాలక్కడ్​ నుంచి ఎన్నికల బరిలో దిగారు.

06:58 April 06

పోలింగ్​ షురూ...

దేశంలోని 4 రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలో ఓటింగ్​ ప్రారంభమైంది. కరోనా నిబంధనలు- కట్టుదిట్ట భద్రత మధ్య ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇందుకోసం ఈసీ అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది.

కేరళ, తమిళనాడు, బంగాల్(మూడో దశ)​, అసోం(మూడో దశ), పుదుచ్చేరిలకు ఎన్నికలు జరుగుతున్నాయి.

06:51 April 06

అసోంలో..

పోలింగ్​ ప్రారంభానికి ముందే.. అసోంలోని పలు పోలింగ్​ కేంద్రాలు ఓటర్లతో కిటకిటలాడుతున్నాయి. తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

అసోంలో ఇప్పటికే రెండు విడతల్లో పోలింగ్​ జరగ్గా.. రెండింటిలోనూ 75శాతానికిపైగా పోలింగ్​ నమోదైంది.

06:49 April 06

ఏర్పాట్లు ఇలా...

ఎన్నికలు జరుగుతున్న ప్రాంతాల్లో ఎన్నికల సంఘం ఏర్పాట్లను ముమ్మరం చేసింది.

ఉదయం 7 గంటలకు పోలింగ్​ ప్రారంభం కానుండగా.. సాయంత్రం 6 గంటల వరకు ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.  

06:33 April 06

లైవ్​:9:30 గంటల వరకు బంగాల్, అసోంలో 14 శాతం పోలింగ్​

దేశంలో ఓట్ల పండగకు సమయం ఆసన్నమైంది. మరికొద్దిసేపట్లో.. తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి అసెంబ్లీలతో పాటు బంగాల్​(మూడో దశ), అసోం(మూడో దశ)కు ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకోసం ఎన్నికల కమిషన్(ఈసీ)​ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.

తమిళనాడులో 234, కేరళలో 140, పుదుచ్చేరిలో 30 స్థానాలకు ఓటింగ్​ జరగనుండగా.. బంగాల్​లో 31, అసోంలో 40 సీట్లకు పోలింగ్​ నిర్వహించనున్నారు.

Last Updated : Apr 6, 2021, 5:41 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.