ETV Bharat / bharat

రోగులకు సేవలందిస్తున్న యూత్‌ కాంగ్రెస్‌ నేతపై దర్యాప్తు

author img

By

Published : May 15, 2021, 7:36 AM IST

దిల్లీలో కరోనా రోగులకు విస్తృత సేవలందిస్తున్న యువజన కాంగ్రెస్​ అధ్యక్షుడు బి.వి.శ్రీనివాస్​ను పోలీసులు ప్రశ్నించారు. కొవిడ్​ మందుల పంపిణీపై వచ్చిన ఆరోపణల ఆధారంగానే ఆయన నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

BV Srinivas, Youth Congress leader
బీవీ శ్రీనివాస్​, యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు

కరోనా బాధితులకు దిల్లీలో విస్తృతంగా సేవలందిస్తున్న అఖిల భారత యువజన కాంగ్రెస్‌ అధ్యక్షుడు బి.వి.శ్రీనివాస్‌ను దిల్లీ పోలీసులు శుక్రవారం ప్రశ్నించారు. కొవిడ్‌ మందుల పంపిణీపై వచ్చిన ఆరోపణల ఆధారంగా పోలీసులు.. యూత్‌ కాంగ్రెస్‌ ప్రధాన కార్యాలయానికి వచ్చి ఆయన్ను ప్రశ్నించి వివరాలు తెలుసుకున్నారు.

కొవిడ్‌ చికిత్సకు సంబంధించిన మందులను కొన్ని రాజకీయపార్టీల నేతలు చట్టవిరుద్ధంగా పంపిణీ చేస్తున్నారని పేర్కొంటూ దిల్లీ హైకోర్టులో దాఖలైన కేసు ఆధారంగా శ్రీనివాస్‌ను ప్రశ్నించినట్లు పోలీసులు తెలిపారు. కొంతమంది రాజకీయ నాయకులు రెమ్‌డెసివిర్‌ ఇంజక్షన్లను పంపిణీ చేస్తున్నారన్న ఫిర్యాదులపై దర్యాప్తు చేయాలని మే 4న.. దిల్లీ హైకోర్టు ఉత్తర్వులిచ్చింది.

ఆ పిటిషన్‌లో ఎక్కడా శ్రీనివాస్‌ పేరు లేకపోయినా క్రైమ్‌బ్రాంచ్‌ పోలీసులు వచ్చారని.. ఆయన చెప్పిన సమాధానాలను నమోదు చేసుకున్నారని కాంగ్రెస్‌ కార్యకర్తలు పేర్కొన్నారు. పోలీసులకు భయపడి తాము ఇప్పటివరకు చేస్తున్న సేవను ఆపబోమని శ్రీనివాస్‌ ప్రకటించారు.

ఇదీ చదవండి: రాంలీలా మైదాన్‌: 15రోజుల్లోనే 500 పడకల ఆస్పత్రిగా..!

కరోనా బాధితులకు దిల్లీలో విస్తృతంగా సేవలందిస్తున్న అఖిల భారత యువజన కాంగ్రెస్‌ అధ్యక్షుడు బి.వి.శ్రీనివాస్‌ను దిల్లీ పోలీసులు శుక్రవారం ప్రశ్నించారు. కొవిడ్‌ మందుల పంపిణీపై వచ్చిన ఆరోపణల ఆధారంగా పోలీసులు.. యూత్‌ కాంగ్రెస్‌ ప్రధాన కార్యాలయానికి వచ్చి ఆయన్ను ప్రశ్నించి వివరాలు తెలుసుకున్నారు.

కొవిడ్‌ చికిత్సకు సంబంధించిన మందులను కొన్ని రాజకీయపార్టీల నేతలు చట్టవిరుద్ధంగా పంపిణీ చేస్తున్నారని పేర్కొంటూ దిల్లీ హైకోర్టులో దాఖలైన కేసు ఆధారంగా శ్రీనివాస్‌ను ప్రశ్నించినట్లు పోలీసులు తెలిపారు. కొంతమంది రాజకీయ నాయకులు రెమ్‌డెసివిర్‌ ఇంజక్షన్లను పంపిణీ చేస్తున్నారన్న ఫిర్యాదులపై దర్యాప్తు చేయాలని మే 4న.. దిల్లీ హైకోర్టు ఉత్తర్వులిచ్చింది.

ఆ పిటిషన్‌లో ఎక్కడా శ్రీనివాస్‌ పేరు లేకపోయినా క్రైమ్‌బ్రాంచ్‌ పోలీసులు వచ్చారని.. ఆయన చెప్పిన సమాధానాలను నమోదు చేసుకున్నారని కాంగ్రెస్‌ కార్యకర్తలు పేర్కొన్నారు. పోలీసులకు భయపడి తాము ఇప్పటివరకు చేస్తున్న సేవను ఆపబోమని శ్రీనివాస్‌ ప్రకటించారు.

ఇదీ చదవండి: రాంలీలా మైదాన్‌: 15రోజుల్లోనే 500 పడకల ఆస్పత్రిగా..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.