ETV Bharat / bharat

తాగిన మత్తులో తల్లి.. విగతజీవిగా శిశువు! - ధమతరిలో శిశువు మృతి

ఓ తల్లి మద్యానికి బానిసవడం.. తన శిశువుకు యమపాశమైంది. ఆకలి బాధను తట్టుకోలేక ఆ శిశువు మరణించింది. ఈ విషాద ఘటన ఛత్తీస్​గఢ్​లో జరిగింది. దీనిపై పోలీసులు విచారణ చేపట్టారు.

Infant allegedly starved to death in Chhattisgarh
తాగిన మత్తులో తల్లి..విగతజీవిగా శిశువు!
author img

By

Published : Mar 29, 2021, 2:42 PM IST

ఛత్తీస్​గఢ్​ ధమతరీలో ఓ విషాద ఘటన జరిగింది. తల్లి ఒడిలో ఆడుకోవాల్సిన ఓ శిశువు.. ఆ తల్లి పక్కనే విగతజీవిగా కనిపించింది. తాగిన మత్తులో తల్లి ఉండగా.. ఆకలి బాధతో ఆ పసికందు మృతిచెందిందని స్థానికులు చెబుతున్నారు.

ఇదీ జరిగింది..

సుందర్​గంజ్​లో నివాసం ఉంటున్న రాజ్​వీర్ కౌర్​.. తాగిన మత్తులో రోడ్డుపై పడిపోయి ఉందని స్థానికులు.. పోలీసులకు తెలిపారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు.. తల్లి పక్కనే విగతజీవిగా పడి ఉన్న శిశువును గుర్తించారు. ఆకలితో శిశువు మరణించి ఉంటుందని పోలీసులు అధికారి ఒకరు స్పష్టం చేశారు. శిశువు మృతదేహాన్ని పోస్ట్​మార్టమ్​కు తరలించినట్లు పేర్కొన్నారు.

ఈ ఘటనకు సంబంధించి కౌర్​పై విచారణ జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు. అయితే.. స్థానికులు మాత్రం ఆమె మద్యానికి బానిసై శిశువును పట్టించుకోలేదని చెబుతున్నారు.

ఇదీ చదవండి:నందిగ్రామ్​లో మమత భారీ రోడ్ ​షో

ఛత్తీస్​గఢ్​ ధమతరీలో ఓ విషాద ఘటన జరిగింది. తల్లి ఒడిలో ఆడుకోవాల్సిన ఓ శిశువు.. ఆ తల్లి పక్కనే విగతజీవిగా కనిపించింది. తాగిన మత్తులో తల్లి ఉండగా.. ఆకలి బాధతో ఆ పసికందు మృతిచెందిందని స్థానికులు చెబుతున్నారు.

ఇదీ జరిగింది..

సుందర్​గంజ్​లో నివాసం ఉంటున్న రాజ్​వీర్ కౌర్​.. తాగిన మత్తులో రోడ్డుపై పడిపోయి ఉందని స్థానికులు.. పోలీసులకు తెలిపారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు.. తల్లి పక్కనే విగతజీవిగా పడి ఉన్న శిశువును గుర్తించారు. ఆకలితో శిశువు మరణించి ఉంటుందని పోలీసులు అధికారి ఒకరు స్పష్టం చేశారు. శిశువు మృతదేహాన్ని పోస్ట్​మార్టమ్​కు తరలించినట్లు పేర్కొన్నారు.

ఈ ఘటనకు సంబంధించి కౌర్​పై విచారణ జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు. అయితే.. స్థానికులు మాత్రం ఆమె మద్యానికి బానిసై శిశువును పట్టించుకోలేదని చెబుతున్నారు.

ఇదీ చదవండి:నందిగ్రామ్​లో మమత భారీ రోడ్ ​షో

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.