ETV Bharat / bharat

భారత్​లో భారీగా పెరిగిన చిరుతల సంఖ్య

author img

By

Published : Dec 21, 2020, 5:50 PM IST

దేశంలో చిరుత పులుల సంఖ్య క్రమంగా పెరుగుతోందని కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. 2014తో పోల్చితే 60 శాతానికి పైగా వృద్ధి రేటు నమోదైనట్లు తెలిపింది.

India's leopard population increased to an estimated 12,000 in 2018 from 8,000 in 2014
భారత్​లో 12,852 కు చేరిన చిరుతపులులు

దేశంలో చిరుత పులుల సంఖ్య గణనీయంగా పెరిగింది. 2014తో పోల్చితే 60శాతం వరకు పెరిగినట్లు కేంద్ర అటవీ పర్యావరణ శాఖ మంత్రి ప్రకాశ్‌ జావడేకర్ తెలిపారు. ఈ మేరకు చిరుత పులుల గణన నివేదిక 2018ని అటవీశాఖ అధికారుల సమక్షంలో దిల్లీలో విడుదల చేశారు. 2018లో చేపట్టిన గణన ప్రకారం దేశంలో 12 వేల 852 చిరుత పులులు ఉన్నట్లు కేంద్రం ప్రకటించింది.

వన్యప్రాణుల సంరక్షణకు కేంద్రం తీసుకుంటున్న చర్యలు... చిరుత పులుల సంఖ్య పెరగడానికి దోహదపడ్డాయని జావడేకర్‌ సంతోషం వ్యక్తం చేశారు.

దేశంలో చిరుత పులుల సంఖ్య గణనీయంగా పెరిగింది. 2014తో పోల్చితే 60శాతం వరకు పెరిగినట్లు కేంద్ర అటవీ పర్యావరణ శాఖ మంత్రి ప్రకాశ్‌ జావడేకర్ తెలిపారు. ఈ మేరకు చిరుత పులుల గణన నివేదిక 2018ని అటవీశాఖ అధికారుల సమక్షంలో దిల్లీలో విడుదల చేశారు. 2018లో చేపట్టిన గణన ప్రకారం దేశంలో 12 వేల 852 చిరుత పులులు ఉన్నట్లు కేంద్రం ప్రకటించింది.

వన్యప్రాణుల సంరక్షణకు కేంద్రం తీసుకుంటున్న చర్యలు... చిరుత పులుల సంఖ్య పెరగడానికి దోహదపడ్డాయని జావడేకర్‌ సంతోషం వ్యక్తం చేశారు.

ఇదీ చూడండి: వన భారతం: ఐదేళ్లలో పులుల సంఖ్య రెట్టింపు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.