ETV Bharat / bharat

'జైలు పర్యటకం'తో చారిత్రక ఘట్టాలను వీక్షించే వీలు

author img

By

Published : Jan 27, 2021, 3:04 PM IST

మహాత్మ గాంధీ, అంబేద్కర్​, నేతాజీ.. వంటి మహా నేతల ఆనవాళ్లను చూడాలన్న కోరిక అందరికీ ఉంటుంది. కానీ, సాధారణ పౌరులకు అలాంటి అవకాశం దక్కడం అంటే కష్టమే! అయితే.. మహారాష్ట్ర ప్రభుత్వం దాన్ని సులభతరం చేసింది. 'జైలు పర్యాటకం' పేరుతో ఓ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టి, అందరికీ ఆ స్మృతులను వీక్షించే అవకాశం కల్పిస్తోంది.

jail tourism
జైలు పర్యాటకం.. మహానేతల గుర్తులను చూసే అవకాశం

మహారాష్ట్రలో జైలు పర్యాటకం కార్యక్రమం మంగళవారం ప్రారంభమైంది. మహారాష్ట్రలోనే అతిపెద్దదైన, చారిత్రక నేపథ్యం ఉన్న ఎరవాడ జైలులో ఈ విశిష్ఠ కార్యక్రమాన్ని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్​ ఠాక్రే.. ప్రారంభించారు. వీడియో కాన్ఫరెన్సు ద్వారా ఆయన ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

jail tourism
జైలు పర్యాటకం కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్న మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్​ ఠాక్రే
jail tourism
చారిత్రక నేపథ్యం ఉన్న పుణెలోని ఎరవాడ జైలు

150 ఏళ్ల నాటి గుర్తులు..

మహారాష్ట్రలోని పుణెలో 150 ఏళ్ల క్రితం.. 'ఎరవాడ జైలు'ను నిర్మించారు. బ్రిటిష్​ పాలనలో గాంధీ, నెహ్రూ, తిలక్​, పటేల్​, నేతాజీ వంటి నేతలెందరినో ఇక్కడ నిర్బంధించారు. వారి గుర్తులెన్నో ఇక్కడ నేటికీ పదిలంగా ఉన్నాయి. సందర్శకులు వాటినిప్పుడు చూసే అవకాశం వచ్చింది. మహాత్మాగాంధీకి, అంబేద్కర్​కు మధ్య చరిత్రాత్మక 'పూనా ప్యాక్ట్'​ ఒప్పందం ఈ కారాగార ప్రాంగణంలోనే జరిగింది. ఇక్కడి చెట్లకిందే వారు ఆ ఒప్పందపై సంతకాలు చేశారు. ముంబయిలో 26/11 దాడుల్లో మారణహోమం సృష్టించిన ఉగ్రవాది కసబ్​ను కూడా ఈ జైల్లోనే ఉరి తీశారు. ఆ ఉరికంబాన్నీ సందర్శకులు చూడొచ్చు.

jail tourism
జైలు పర్యాటకం ప్రారంభ కార్యక్రమానికి మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్​ పవార్​
jail tourism
ఎరవాడ జైలులో మహాత్మగాంధీ గుర్తులు
jail tourism
ఎరవాడ జైలు
jail tourism
ఎరవాడ జైలులో నెహ్రూ గుర్తులు

ఇలాంటి చారిత్రక సంఘటనలకు సాక్ష్యంగా నిలిచిన జైలును ఇప్పుడు వీక్షించే అవకాశం మహారాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చింది.

ఇదీ చూడండి:'అమ్మ' స్మారకాన్ని ఆవిష్కరించిన పళనిస్వామి

మహారాష్ట్రలో జైలు పర్యాటకం కార్యక్రమం మంగళవారం ప్రారంభమైంది. మహారాష్ట్రలోనే అతిపెద్దదైన, చారిత్రక నేపథ్యం ఉన్న ఎరవాడ జైలులో ఈ విశిష్ఠ కార్యక్రమాన్ని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్​ ఠాక్రే.. ప్రారంభించారు. వీడియో కాన్ఫరెన్సు ద్వారా ఆయన ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

jail tourism
జైలు పర్యాటకం కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్న మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్​ ఠాక్రే
jail tourism
చారిత్రక నేపథ్యం ఉన్న పుణెలోని ఎరవాడ జైలు

150 ఏళ్ల నాటి గుర్తులు..

మహారాష్ట్రలోని పుణెలో 150 ఏళ్ల క్రితం.. 'ఎరవాడ జైలు'ను నిర్మించారు. బ్రిటిష్​ పాలనలో గాంధీ, నెహ్రూ, తిలక్​, పటేల్​, నేతాజీ వంటి నేతలెందరినో ఇక్కడ నిర్బంధించారు. వారి గుర్తులెన్నో ఇక్కడ నేటికీ పదిలంగా ఉన్నాయి. సందర్శకులు వాటినిప్పుడు చూసే అవకాశం వచ్చింది. మహాత్మాగాంధీకి, అంబేద్కర్​కు మధ్య చరిత్రాత్మక 'పూనా ప్యాక్ట్'​ ఒప్పందం ఈ కారాగార ప్రాంగణంలోనే జరిగింది. ఇక్కడి చెట్లకిందే వారు ఆ ఒప్పందపై సంతకాలు చేశారు. ముంబయిలో 26/11 దాడుల్లో మారణహోమం సృష్టించిన ఉగ్రవాది కసబ్​ను కూడా ఈ జైల్లోనే ఉరి తీశారు. ఆ ఉరికంబాన్నీ సందర్శకులు చూడొచ్చు.

jail tourism
జైలు పర్యాటకం ప్రారంభ కార్యక్రమానికి మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్​ పవార్​
jail tourism
ఎరవాడ జైలులో మహాత్మగాంధీ గుర్తులు
jail tourism
ఎరవాడ జైలు
jail tourism
ఎరవాడ జైలులో నెహ్రూ గుర్తులు

ఇలాంటి చారిత్రక సంఘటనలకు సాక్ష్యంగా నిలిచిన జైలును ఇప్పుడు వీక్షించే అవకాశం మహారాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చింది.

ఇదీ చూడండి:'అమ్మ' స్మారకాన్ని ఆవిష్కరించిన పళనిస్వామి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.