ETV Bharat / bharat

మార్చి నాటికి మరో ఆరు రఫేల్​ జెట్లు

author img

By

Published : Feb 8, 2021, 7:29 PM IST

మార్చిలోగా మరో 6 రఫేల్​ యుద్ధ విమానాలు దేశానికి వస్తాయని రక్షణ మంత్రి రాజ్​నాథ్​ సింగ్​ తెలిపారు. మొత్తం 17 రఫేల్​ జెట్​లను దేశం కలిగి ఉంటుందని చెప్పారు.

India to have 17 Rafale jets by March; entire fleet by 2022: Rajnath Singh
మార్చినాటికి మరో ఆరు రఫెల్​ యుద్ధవిమానాల రాక

మార్చిలోగా 17 రఫేల్​ యుద్ధవిమానాలను దేశం కలిగి ఉంటుందని రక్షణ మంత్రి రాజ్​నాథ్​ సింగ్​ తెలిపారు. 2022 ఏప్రిల్​ నాటికి.. కొనుగోలు చేసిన అన్ని రఫేల్​ జెట్​లు దేశానికి వస్తాయని చెప్పారు. రాజ్యసభలో ప్రతిపక్షాలు అడిగిన ప్రశ్నకు ఈ మేరకు సమధానం ఇచ్చారు.

కొత్త విమానాలను ఇండియన్​ ఎయిర్​ ఫోర్స్​లోకి ప్రవేశపెట్టే ముందు వేడుక నిర్వహిస్తామని రాజ్​నాథ్​ ప్రకటించారు.

రూ.59,000 కోట్లతో 36 రఫేల్​ యుద్ధ విమానాల కొనుగోలుకు 2016లో ఫ్రాన్స్​తో ఒప్పందం కుదుర్చుకుంది భారత్.

ఆయుధ సామగ్రి కొనుగోలుకు ఆమోదం..

తూర్పు లద్ధాఖ్​​లో ప్రతిష్టంభనల నేపథ్యంలో సాయుధ బలగాలకు అవసరమైన ఆయుధ సామగ్రిని తక్షణం కొనుగోలు చేయనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. భూభాగ, వాతావరణానికి సంబంధించిన సామగ్రిని సాయుధ బలగాలకు సమకూర్చనున్నట్లు రక్షణ శాఖ సహాయ మంత్రి శ్రీపాద్​ నాయక్​ వెల్లడించారు. సాయుధ బలగాల కుటుంబాలకు ఎలాంటి ప్రత్యేక వెసులుబాట్లను కల్పించట్లేదని తెలిపారు. సైనికులకు అందించే ఆహార నాణ్యతపై ఎలాంటి ఫిర్యాదులు ఇప్పటివరకు రాలేదని విపక్షాలకు అడిగిన ప్రశ్నలకు సమాధానంగా చెప్పారు.

ఇదీ చదవండి:5,133 సార్లు పాక్​ దాడులు- 46 మంది జవాన్లు మృతి

మార్చిలోగా 17 రఫేల్​ యుద్ధవిమానాలను దేశం కలిగి ఉంటుందని రక్షణ మంత్రి రాజ్​నాథ్​ సింగ్​ తెలిపారు. 2022 ఏప్రిల్​ నాటికి.. కొనుగోలు చేసిన అన్ని రఫేల్​ జెట్​లు దేశానికి వస్తాయని చెప్పారు. రాజ్యసభలో ప్రతిపక్షాలు అడిగిన ప్రశ్నకు ఈ మేరకు సమధానం ఇచ్చారు.

కొత్త విమానాలను ఇండియన్​ ఎయిర్​ ఫోర్స్​లోకి ప్రవేశపెట్టే ముందు వేడుక నిర్వహిస్తామని రాజ్​నాథ్​ ప్రకటించారు.

రూ.59,000 కోట్లతో 36 రఫేల్​ యుద్ధ విమానాల కొనుగోలుకు 2016లో ఫ్రాన్స్​తో ఒప్పందం కుదుర్చుకుంది భారత్.

ఆయుధ సామగ్రి కొనుగోలుకు ఆమోదం..

తూర్పు లద్ధాఖ్​​లో ప్రతిష్టంభనల నేపథ్యంలో సాయుధ బలగాలకు అవసరమైన ఆయుధ సామగ్రిని తక్షణం కొనుగోలు చేయనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. భూభాగ, వాతావరణానికి సంబంధించిన సామగ్రిని సాయుధ బలగాలకు సమకూర్చనున్నట్లు రక్షణ శాఖ సహాయ మంత్రి శ్రీపాద్​ నాయక్​ వెల్లడించారు. సాయుధ బలగాల కుటుంబాలకు ఎలాంటి ప్రత్యేక వెసులుబాట్లను కల్పించట్లేదని తెలిపారు. సైనికులకు అందించే ఆహార నాణ్యతపై ఎలాంటి ఫిర్యాదులు ఇప్పటివరకు రాలేదని విపక్షాలకు అడిగిన ప్రశ్నలకు సమాధానంగా చెప్పారు.

ఇదీ చదవండి:5,133 సార్లు పాక్​ దాడులు- 46 మంది జవాన్లు మృతి

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.