ETV Bharat / bharat

'భారత్​-రష్యా బంధం ఇతర దేశాలకు అతీతం'

author img

By

Published : Apr 8, 2021, 9:10 PM IST

రష్యా-భారత్​ మధ్య ఉన్న సంబంధాలు ఇతర దేశాల వల్ల ప్రభావితం కావని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్​ బాగ్చి స్పష్టం చేశారు. ఇరుదేశాల బంధం వాటి సొంత యోగ్యతపైనే ఆధారపడి ఉంటుందని అన్నారు.

India-Russia
భారత్​-రష్యా

రష్యా-భారత్​ మధ్య ఉన్న సంబంధాలు ఇతర దేశాల వల్ల ప్రభావితం కావని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్​ బాగ్చి అన్నారు. ఇరుదేశాల బంధం వాటి సొంత యోగ్యతపై ఆధారపడి ఉంటుందని తెలిపారు.

రెండు రోజుల పర్యటన నిమిత్తం భారత్​కు వచ్చిన రష్యా విదేశాంగ శాఖ మంత్రి సెర్గెయ్​ లావ్​రోవ్​తో.. బాగ్చి సమావేశమయ్యారు.

"రష్యాతో మనకున్న ప్రత్యేక భాగస్వామ్యాన్ని మెరుగు పరుచుకోవడానికి ఈ పర్యటన ఒక మంచి అవకాశం. త్వరలో జరిగే భారత్​-రష్యా వార్షిక సదస్సు, ద్వైపాక్షిక భాగస్వామ్యం గురించి చర్చించడానికి ఈ పర్యటన చాలా ఉపయోగపడుతుంది."

-అరిందమ్​ బాగ్చి, భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి

కాగా, పాకిస్థాన్​కు రక్షణ సామాగ్రిని రష్యా సరఫరా చేస్తున్న విషయం గురించి మాత్రం బాగ్చి మాట్లాడలేదు.

జైశంకర్​తో సెర్గెయ్ భేటీ

భారత విదేశాంగ మంత్రి జైశంకర్​తోనూ సెర్గెయ్​ భేటీ అయ్యారు. ద్వైపాక్షిక అంశాలపై ఇరువురు నేతలు కీలక చర్చలు జరిపారు.

"ఇరు దేశాల మధ్య ఉన్న ద్వైపాక్షిక భాగస్వామ్యం దృఢంగా, ముందు చూపుతో ఉంది. న్యూక్లియర్​ స్పేస్​, రక్షణ రంగంలో దీర్ఘకాలిక భాగస్వామ్యానికి సంబంధించి చర్చలు జరిగాయి. ఉత్తర-దక్షిణ రవాణా కారిడార్​, చెన్నై-వ్లాదివోస్త్కోక్​ జలరవాణా కారిడార్​ గురించి చర్చించాం."

-ఎస్​ జైశంకర్​, భారత విదేశాంగ మంత్రి

రష్యా నుంచి ఎస్​-400 క్షిపణి వ్యవస్థను భారత కొనుగోలు విషయంలో అమెరికా వైఖరిపై సెర్గెయ్​ పరోక్ష వ్యాఖ్యలు చేశారు. ఏ దేశంపైనైనా అమెరికా ఒత్తిడి చేయాలని చూస్తే రష్యా నుంచి తగిన ప్రతిస్పందన వస్తుందని స్పష్టం చేశారు.

ఇదీ చదవండి: బంగ్లాదేశ్​ పర్యటనలో భారత ఆర్మీ చీఫ్​

రష్యా-భారత్​ మధ్య ఉన్న సంబంధాలు ఇతర దేశాల వల్ల ప్రభావితం కావని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్​ బాగ్చి అన్నారు. ఇరుదేశాల బంధం వాటి సొంత యోగ్యతపై ఆధారపడి ఉంటుందని తెలిపారు.

రెండు రోజుల పర్యటన నిమిత్తం భారత్​కు వచ్చిన రష్యా విదేశాంగ శాఖ మంత్రి సెర్గెయ్​ లావ్​రోవ్​తో.. బాగ్చి సమావేశమయ్యారు.

"రష్యాతో మనకున్న ప్రత్యేక భాగస్వామ్యాన్ని మెరుగు పరుచుకోవడానికి ఈ పర్యటన ఒక మంచి అవకాశం. త్వరలో జరిగే భారత్​-రష్యా వార్షిక సదస్సు, ద్వైపాక్షిక భాగస్వామ్యం గురించి చర్చించడానికి ఈ పర్యటన చాలా ఉపయోగపడుతుంది."

-అరిందమ్​ బాగ్చి, భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి

కాగా, పాకిస్థాన్​కు రక్షణ సామాగ్రిని రష్యా సరఫరా చేస్తున్న విషయం గురించి మాత్రం బాగ్చి మాట్లాడలేదు.

జైశంకర్​తో సెర్గెయ్ భేటీ

భారత విదేశాంగ మంత్రి జైశంకర్​తోనూ సెర్గెయ్​ భేటీ అయ్యారు. ద్వైపాక్షిక అంశాలపై ఇరువురు నేతలు కీలక చర్చలు జరిపారు.

"ఇరు దేశాల మధ్య ఉన్న ద్వైపాక్షిక భాగస్వామ్యం దృఢంగా, ముందు చూపుతో ఉంది. న్యూక్లియర్​ స్పేస్​, రక్షణ రంగంలో దీర్ఘకాలిక భాగస్వామ్యానికి సంబంధించి చర్చలు జరిగాయి. ఉత్తర-దక్షిణ రవాణా కారిడార్​, చెన్నై-వ్లాదివోస్త్కోక్​ జలరవాణా కారిడార్​ గురించి చర్చించాం."

-ఎస్​ జైశంకర్​, భారత విదేశాంగ మంత్రి

రష్యా నుంచి ఎస్​-400 క్షిపణి వ్యవస్థను భారత కొనుగోలు విషయంలో అమెరికా వైఖరిపై సెర్గెయ్​ పరోక్ష వ్యాఖ్యలు చేశారు. ఏ దేశంపైనైనా అమెరికా ఒత్తిడి చేయాలని చూస్తే రష్యా నుంచి తగిన ప్రతిస్పందన వస్తుందని స్పష్టం చేశారు.

ఇదీ చదవండి: బంగ్లాదేశ్​ పర్యటనలో భారత ఆర్మీ చీఫ్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.