ETV Bharat / bharat

దేశ రక్షణకు మోదీ సర్కార్ 'హైవే స్కెచ్​'!

సైనిక కార్యకలాపాలకు వీలుగా.. రహదారులు, రైళ్లు, ఉపగ్రహాలను రెండు విధాలుగా వినియోగించుకునేందుకు కేంద్రం యోచిస్తున్నట్టు తెలస్తోంది. యుద్ధం సమయంలో ఇది దేశానికి ఉపయోగపడుతుందని భావిస్తోంది. భారత త్రిదళాధిపతి బిపిన్​ రావత్​ వ్యాఖ్యలు ఇందుకు బలం చేకూరుస్తున్నాయి.

author img

By

Published : Apr 13, 2021, 7:15 PM IST

India eyes dual use infra on air, roads, rail to support combat
సైన్యానికి అనుకూలంగా దేశంలో మౌలికవసతుల వృద్ధి!

రహదారులపై మిలిటరీ విమానాల అత్యవసర ల్యాండింగ్​.. రైళ్లలో సైన్యానికి చెందిన భారీ పరికరాల తరలింపు.. ఇలాంటివి అమెరికా వంటి దేశాల్లో చూసే ఉంటాం. ఆయా దేశాల్లో.. పౌర సేవలు- సైనిక అవసరాలకు అనువుగా మౌలిక వసతులను తీర్చిదిద్దారు. భారత్​లోనూ ఇలాంటి చర్యలు చేపట్టాలని ప్రభుత్వం భావించినా.. అది ఓ ఆలోచనగానే మిగిలిపోయింది. పరీక్షలు చేసినా, సరైన ఫలితాలు దక్కినా ఈ ఆలోచన కార్యరూపం దాల్చలేదు. అయితే.. ఈ విషయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం ఇప్పుడు తీవ్రంగా పరిగణించినట్టు కనిపిస్తోంది. సైన్యానికి ఉపయోగపడే విధంగా.. మౌలిక వసతులను రెండు విధాలుగా(పౌర సేవలు- మిలిటరీ) వినియోగించాలని కసరత్తులు చేస్తున్నట్టు తెలుస్తోంది. మరి ఈసారైనా ఇది సాధ్యపడుతుందా?

గతంలోనే...

ఈ ప్రక్రియకు పునాది 2015లోనే పడింది. 2015 మే 21న, మిరాజ్​ 2000 ఎయిర్​క్రాఫ్ట్​ యమునా ఎక్స్​ప్రెస్​ వేపై ల్యాండ్​ అయ్యింది. హైవేలపై యుద్ధ విమానాలు ల్యాండింగ్​- టేకాఫ్​ అయ్యే వేసులుబాటు ఉందా? లేదా? అన్న విషయాన్ని అప్పుడు పరీక్షించారు. యుద్ధం సమయంలో హైవేలను ఉపయోగించుకునేందుకు ఈ చర్యలు చేపట్టారు.

ఆ తర్వాత కూడా ఇదే విధంగా ప్రయత్నాలు జరిగాయి. 2017 నవంబర్​లో.. మూడు మిరాజ్​ 2000 విమానాలు, మూడు సుఖోయ్​ యుద్ధ విమానాలు.. ఎక్స్​ప్రెస్​ వేపై ల్యాండ్​ అయ్యాయి.

ఇదీ చూడండి:- 'రక్షణ'లో ఆత్మనిర్భరం.. భారత్​కు సాధ్యమేనా?

2017 అక్టోబర్​ 24న.. ఐఏఎఫ్​కు చెందిన ఓ భారీ విమానం ఆగ్రా-లఖ్​నవూ ఎక్స్​ప్రెస్​ వై మీద టచ్​డౌన్​ చేసింది. ఆ సమయంలో అందులో మూడు జాగ్వార్లు, 12- మల్టీ రోల్​ ఎయిర్​ సుపీరియారిటీ మిరాజ్​-2000 విమానాలు, ఓ సుఖోయ్​-30, ఓ సీ-130జే సూపర్​ హెర్కులెస్​ ఎయిర్​లిఫ్టర్​లు ఉన్నాయి. సైనిక సన్నద్ధతలో భాగంగా ఈ విధంగా శిక్షణ ఇచ్చారు.

యుద్ధం సమయంలో.. సైన్యానికి చెందిన విమానాలను సాధారణ విమానాశ్రయాల్లో దింపడం కష్టమవుతుంది. ప్రత్యర్థి లక్ష్యం ఎప్పుడూ అలాంటి రద్దీ విమానాశ్రయాలపైనే ఉంటుంది. అందుకే ఇలాంటి ఎయిర్​స్ట్రిప్స్​తో ఎంతో ఉపయోగం ఉంటుందని సైన్యం భావిస్తోంది.

పొరుగు దేశాలు...

నిజానికి.. మౌలిక వసతులను సైన్యం ఉపయోగించుకునే విషయంపై భారత్​ కొంత వెనుకబడి ఉంది. చైనా, పాకస్థాన్​ ఎన్నో ఏళ్ల ముందే.. తమ యుద్ధ విమానాలను హైవేపై దింపాయి. ముఖ్యంగా.. ఇస్లామాబాద్​- లాహోర్​ హైవేపై పాక్​ 17ఏళ్ల ముందే ఈ పరీక్షలు నిర్వహించింది.

ఇదీ చూడండి:- చైనా-ఇరాన్‌ ఒప్పందంతో భారత్‌కు ఇక్కట్లే

భారత్​ కూడా...!

మౌలిక వసతులను రెండు విధాలుగా ఉపయోగించుకునే అంశంపై త్రిదళాధిపతి జనరల్​ బిపిన్​ రావత్​ ఇటీవలే స్పందించారు. ఈ వ్యవహారంపై కేంద్రం దృష్టి సారించినట్టు.. వివేకానంద ఇండియా ఫౌండేషన్​లో చేసిన ప్రసంగంలో సంకేతాలిచ్చారు.

"మౌలిక వసతులను పౌర సేవలు-మిలిటరీకి కలిపి ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉంది. సాధారణ-మిలిటరీ విమానాశ్రయాలను అనుసంధానించే విషయాన్ని పరిశీలించాలి. దీని వల్ల ఏవియేషన్​ విభాగం శక్తిమంతంగా మారుతుంది. యుద్ధం సమయంలో ఉపయోగపడుతుంది. అదే విధంగా.. రిమోట్​ సెన్సింగ్​, సమాచారం, నేవిగేషన్​లో సైనిక అవసరాలకు తగ్గట్టుగా ఉపగ్రహాలను తీర్చిదిద్దాలి. సైన్యానికి చెందిన భారీ పరికరాలు, ఏఎఫ్​వీ(ఆర్మడ్​ ఫైటింగ్​ వెహికిల్స్​)ను రవాణా చేసే విధంగా రైళ్ల(సరకు రవాణా)ను రూపొందించాలి."

--- బిపిన్​ రావత్​, త్రిదళాధిపతి.

సాయుధ దళాల అవసరాలు, వినియోగానికి తగ్గట్టుగా.. సరిహద్దు రాష్ట్రాల్లో.. రోడ్లు, వంతెనలు, సొరంగాల్లో విద్యుత్​కు చెందిన మౌలిక వసతులను నిర్మించాలని రావత్​ పేర్కొన్నారు.

సీడీఎస్​ స్థాయి వ్యక్తి ఈ విధంగా వ్యాఖ్యానించడం సర్వత్రా ప్రాధాన్యం సంతరించుకుంది. ప్రభుత్వానికి కూడా ఇవే ఆలోచనలు ఉన్నట్టు ఆయన మాటల ద్వారా తెలుస్తోందని రాజకీయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

(సంజీవ్ బారువా-సీనియర్ పాత్రికేయులు)​

రహదారులపై మిలిటరీ విమానాల అత్యవసర ల్యాండింగ్​.. రైళ్లలో సైన్యానికి చెందిన భారీ పరికరాల తరలింపు.. ఇలాంటివి అమెరికా వంటి దేశాల్లో చూసే ఉంటాం. ఆయా దేశాల్లో.. పౌర సేవలు- సైనిక అవసరాలకు అనువుగా మౌలిక వసతులను తీర్చిదిద్దారు. భారత్​లోనూ ఇలాంటి చర్యలు చేపట్టాలని ప్రభుత్వం భావించినా.. అది ఓ ఆలోచనగానే మిగిలిపోయింది. పరీక్షలు చేసినా, సరైన ఫలితాలు దక్కినా ఈ ఆలోచన కార్యరూపం దాల్చలేదు. అయితే.. ఈ విషయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం ఇప్పుడు తీవ్రంగా పరిగణించినట్టు కనిపిస్తోంది. సైన్యానికి ఉపయోగపడే విధంగా.. మౌలిక వసతులను రెండు విధాలుగా(పౌర సేవలు- మిలిటరీ) వినియోగించాలని కసరత్తులు చేస్తున్నట్టు తెలుస్తోంది. మరి ఈసారైనా ఇది సాధ్యపడుతుందా?

గతంలోనే...

ఈ ప్రక్రియకు పునాది 2015లోనే పడింది. 2015 మే 21న, మిరాజ్​ 2000 ఎయిర్​క్రాఫ్ట్​ యమునా ఎక్స్​ప్రెస్​ వేపై ల్యాండ్​ అయ్యింది. హైవేలపై యుద్ధ విమానాలు ల్యాండింగ్​- టేకాఫ్​ అయ్యే వేసులుబాటు ఉందా? లేదా? అన్న విషయాన్ని అప్పుడు పరీక్షించారు. యుద్ధం సమయంలో హైవేలను ఉపయోగించుకునేందుకు ఈ చర్యలు చేపట్టారు.

ఆ తర్వాత కూడా ఇదే విధంగా ప్రయత్నాలు జరిగాయి. 2017 నవంబర్​లో.. మూడు మిరాజ్​ 2000 విమానాలు, మూడు సుఖోయ్​ యుద్ధ విమానాలు.. ఎక్స్​ప్రెస్​ వేపై ల్యాండ్​ అయ్యాయి.

ఇదీ చూడండి:- 'రక్షణ'లో ఆత్మనిర్భరం.. భారత్​కు సాధ్యమేనా?

2017 అక్టోబర్​ 24న.. ఐఏఎఫ్​కు చెందిన ఓ భారీ విమానం ఆగ్రా-లఖ్​నవూ ఎక్స్​ప్రెస్​ వై మీద టచ్​డౌన్​ చేసింది. ఆ సమయంలో అందులో మూడు జాగ్వార్లు, 12- మల్టీ రోల్​ ఎయిర్​ సుపీరియారిటీ మిరాజ్​-2000 విమానాలు, ఓ సుఖోయ్​-30, ఓ సీ-130జే సూపర్​ హెర్కులెస్​ ఎయిర్​లిఫ్టర్​లు ఉన్నాయి. సైనిక సన్నద్ధతలో భాగంగా ఈ విధంగా శిక్షణ ఇచ్చారు.

యుద్ధం సమయంలో.. సైన్యానికి చెందిన విమానాలను సాధారణ విమానాశ్రయాల్లో దింపడం కష్టమవుతుంది. ప్రత్యర్థి లక్ష్యం ఎప్పుడూ అలాంటి రద్దీ విమానాశ్రయాలపైనే ఉంటుంది. అందుకే ఇలాంటి ఎయిర్​స్ట్రిప్స్​తో ఎంతో ఉపయోగం ఉంటుందని సైన్యం భావిస్తోంది.

పొరుగు దేశాలు...

నిజానికి.. మౌలిక వసతులను సైన్యం ఉపయోగించుకునే విషయంపై భారత్​ కొంత వెనుకబడి ఉంది. చైనా, పాకస్థాన్​ ఎన్నో ఏళ్ల ముందే.. తమ యుద్ధ విమానాలను హైవేపై దింపాయి. ముఖ్యంగా.. ఇస్లామాబాద్​- లాహోర్​ హైవేపై పాక్​ 17ఏళ్ల ముందే ఈ పరీక్షలు నిర్వహించింది.

ఇదీ చూడండి:- చైనా-ఇరాన్‌ ఒప్పందంతో భారత్‌కు ఇక్కట్లే

భారత్​ కూడా...!

మౌలిక వసతులను రెండు విధాలుగా ఉపయోగించుకునే అంశంపై త్రిదళాధిపతి జనరల్​ బిపిన్​ రావత్​ ఇటీవలే స్పందించారు. ఈ వ్యవహారంపై కేంద్రం దృష్టి సారించినట్టు.. వివేకానంద ఇండియా ఫౌండేషన్​లో చేసిన ప్రసంగంలో సంకేతాలిచ్చారు.

"మౌలిక వసతులను పౌర సేవలు-మిలిటరీకి కలిపి ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉంది. సాధారణ-మిలిటరీ విమానాశ్రయాలను అనుసంధానించే విషయాన్ని పరిశీలించాలి. దీని వల్ల ఏవియేషన్​ విభాగం శక్తిమంతంగా మారుతుంది. యుద్ధం సమయంలో ఉపయోగపడుతుంది. అదే విధంగా.. రిమోట్​ సెన్సింగ్​, సమాచారం, నేవిగేషన్​లో సైనిక అవసరాలకు తగ్గట్టుగా ఉపగ్రహాలను తీర్చిదిద్దాలి. సైన్యానికి చెందిన భారీ పరికరాలు, ఏఎఫ్​వీ(ఆర్మడ్​ ఫైటింగ్​ వెహికిల్స్​)ను రవాణా చేసే విధంగా రైళ్ల(సరకు రవాణా)ను రూపొందించాలి."

--- బిపిన్​ రావత్​, త్రిదళాధిపతి.

సాయుధ దళాల అవసరాలు, వినియోగానికి తగ్గట్టుగా.. సరిహద్దు రాష్ట్రాల్లో.. రోడ్లు, వంతెనలు, సొరంగాల్లో విద్యుత్​కు చెందిన మౌలిక వసతులను నిర్మించాలని రావత్​ పేర్కొన్నారు.

సీడీఎస్​ స్థాయి వ్యక్తి ఈ విధంగా వ్యాఖ్యానించడం సర్వత్రా ప్రాధాన్యం సంతరించుకుంది. ప్రభుత్వానికి కూడా ఇవే ఆలోచనలు ఉన్నట్టు ఆయన మాటల ద్వారా తెలుస్తోందని రాజకీయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

(సంజీవ్ బారువా-సీనియర్ పాత్రికేయులు)​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.