ETV Bharat / bharat

ఈ నెల​ 9న భారత్-చైనా సైనికాధికారుల భేటీ!

author img

By

Published : Apr 7, 2021, 5:04 AM IST

ఏప్రిల్ 9న భారత్, చైనా సైనికాధికారులు మరోసారి సమావేశం కానున్నట్లు తెలుస్తోంది. లద్దాఖ్​లోని మిగిలిన ప్రాంతాల్లో బలగాల ఉపసంహరణపై చర్చలు జరపనున్నట్లు సమాచారం.

India, China military talks likely on April 9
ఏప్రిల్​ 9న భారత్, చైనా సైనికాధికారుల భేటీ!

లద్దాఖ్​లోని గోగ్రా, హాట్​స్ప్రింగ్స్​, దెప్సాంగ్ మైదానాల్లో ప్రతిష్టంభణకు తెరదించేందుకు భారత్, చైనా మరోసారి భేటీ కానున్నాయి. కార్ప్స్​ కమాండర్​ స్థాయిలో ఏప్రిల్ 9న ఈ చర్చలు జరిగే అవకాశముందని ఆర్మీ అధికారులు తెలిపారు.

పాంగాంగ్​ సరస్సు వద్ద బలగాల ఉపసంహరణ విజయవంతంగా ముగిసిన నేపథ్యంలో గోగ్రా పర్వతాలు, దెప్సాంగ్​లలోనూ ఆ దిశగా ప్రయత్నాలు చేస్తున్నారు అధికారులు. ఇరు దేశాలు దౌత్య స్థాయి చర్చలు జరిపిన వెంటనే ఈ భేటీ జరిగే అవకాశం ఉంది.

ఏడాది కాలంగా సరిహద్దులో నెలకొన్న ప్రతిష్టంభన.. సైనిక, రాజకీయ స్థాయిల్లో సమగ్ర చర్చల ద్వారా కొలిక్కి వస్తోంది. ఇప్పటివరకు ఇరు దేశాలు మధ్య కార్ప్స్​ కమాండర్​ స్థాయిలో పది సార్లు భేటీ కాగా.. పాంగాంగ్​ సరస్సు నుంచి బలగాల ఉపసంహరణ గత నెలలోనే పూర్తయింది.

ఇదీ చూడండి: 2వేల మంది పోలీసులు మాపై దాడి: మావోయిస్టులు

లద్దాఖ్​లోని గోగ్రా, హాట్​స్ప్రింగ్స్​, దెప్సాంగ్ మైదానాల్లో ప్రతిష్టంభణకు తెరదించేందుకు భారత్, చైనా మరోసారి భేటీ కానున్నాయి. కార్ప్స్​ కమాండర్​ స్థాయిలో ఏప్రిల్ 9న ఈ చర్చలు జరిగే అవకాశముందని ఆర్మీ అధికారులు తెలిపారు.

పాంగాంగ్​ సరస్సు వద్ద బలగాల ఉపసంహరణ విజయవంతంగా ముగిసిన నేపథ్యంలో గోగ్రా పర్వతాలు, దెప్సాంగ్​లలోనూ ఆ దిశగా ప్రయత్నాలు చేస్తున్నారు అధికారులు. ఇరు దేశాలు దౌత్య స్థాయి చర్చలు జరిపిన వెంటనే ఈ భేటీ జరిగే అవకాశం ఉంది.

ఏడాది కాలంగా సరిహద్దులో నెలకొన్న ప్రతిష్టంభన.. సైనిక, రాజకీయ స్థాయిల్లో సమగ్ర చర్చల ద్వారా కొలిక్కి వస్తోంది. ఇప్పటివరకు ఇరు దేశాలు మధ్య కార్ప్స్​ కమాండర్​ స్థాయిలో పది సార్లు భేటీ కాగా.. పాంగాంగ్​ సరస్సు నుంచి బలగాల ఉపసంహరణ గత నెలలోనే పూర్తయింది.

ఇదీ చూడండి: 2వేల మంది పోలీసులు మాపై దాడి: మావోయిస్టులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.