మానవ అక్రమ రవాణా కేసులో శ్రీలంకకు చెందిన 38 మందిని మంగళూరు పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిని విచారించి కోర్టులో హాజరు పరుస్తామని మంగళూరు సిటీ కమిషనర్ శశికుమార్ తెలిపారు. 39 మందిని శ్రీలంక నుంచి కెనడాకు తరలిస్తున్నట్లు విచారణలో తేలిందని శశికుమార్ తెలిపారు. వీరి వద్ద రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు తీసుకుని ఇతర ప్రాంతాలకు పంపిస్తున్నట్లు వెల్లడైందన్నారు.
మొదట 39 మంది శ్రీలంక దేశస్థులు.. తమిళనాడులోని తూత్తుకుడికి పడవలో వచ్చారని.. ఎన్నికల దృష్ట్యా పోలీసులు గాలింపు చర్యలు చేపట్టడం వల్ల మంగళూరు వచ్చారని పేర్కొన్నారు. ప్రస్తుతం 38 మందిని అరెస్ట్ చేశామని.. మరో నిందితుడి కోసం గాలిస్తున్నామని తెలిపారు.
ఇదీ చదవండి : సీఆర్పీఎఫ్ సిబ్బందిపై ఉగ్రవాదుల కాల్పులు!