ETV Bharat / bharat

'కిలేడీ' వలపు వల.. 'మిస్టర్​ రాజస్థాన్'​ విలవిల!

author img

By

Published : Mar 24, 2022, 7:00 PM IST

Honeytrap case: హనీట్రాప్​.. ఇటీవల ఎక్కువగా వినిపిస్తున్న మాట. అందంతో యువకులకు వలపు వల విసిరి, ఆ తర్వాత బెదిరించి డబ్బులు లాగుతున్న ఉదంతాలు చాలానే ఉన్నాయి. రాజస్థాన్​లో ఇలాంటి సంఘటనే వెలుగులోకి వచ్చింది. మాజీ మిస్టర్​ రాజస్థాన్​పై వలపు వల విసిరి.. రూ.20 లక్షలు డిమాండ్​ చేసిన ఓ యువతిని పోలీసులు అరెస్ట్​ చేశారు. బాధితుడి నుంచి ఇప్పటికే రూ.6 లక్షలు తీసుకున్నట్లు గుర్తించారు.

honeytrap
వలపు వల

Honeytrap case: మాజీ మిస్టర్​ రాజస్థాన్​పై వలపు వల విసిరి రూ.20 లక్షలు డిమాండ్​ చేసిన కిలేడీని జైపుర్​ పోలీసులు మంగళవారం అరెస్ట్​ చేశారు. హనీ ట్రాప్​ ముఠాలో ఇంకా ఎంత మంది ఉన్నారనే కోణంలో దర్యాప్తు చేపట్టారు. ఈ కేసుపై కీలక అంశాలను వెల్లడించారు సంజయ్​ సర్కిల్​ పోలీస్​ స్టేషన్​ అధికారి మోహమ్మద్​ శఫీక్​ ఖాన్​.

కేసు వివరాలు ఇలా: ఉత్తర్​ప్రదేశ్​లోని బులంద్​శహర్​కు చెందిన రాధా సైనీ అనే యువతి గతంలో మోడలింగ్​ చేసింది. ప్రస్తుతం రాజస్థాన్​ రాజధాని జైపుర్​లోని చిత్రకూట్​ ప్రాంతం డీసీఎం అపార్ట్​మెంట్స్​లో​ నివాసం ఉంటోంది. ఐదేళ్ల క్రితం మాజీ మిస్టర్​ రాజస్థాన్​ అయిన అనీస్​ అనే యువకుడితో పరిచయం పెంచుకుంది. ఆమె కపట ప్రేమను గుర్తించలేకపోయాడు అనీస్​. కొన్నాళ్లు ఇరువురు సహజీవనం చేశారు. ఆ తర్వాత అసలు రూపాన్ని బయటపెట్టింది. డబ్బులు ఇవ్వాలని బ్లాక్​మెయిల్​ చేయటం మొదలు పెట్టింది. ఇప్పటికే రూ.6 లక్షల వరకు దోచుకుంది. ఇటీవలే యువకుడికి మరో యువతితో వివాహం జరిగింది. అది తెలుసుకున్న నిందితురాలు.. మళ్లీ వేధించటం మొదలు పెట్టింది. తనకు రూ.20 లక్షలు ఇవ్వాలని డిమాండ్​ చేసింది. లేదంటే అత్యాచారం కేసు పెట్టి ఇబ్బందులకు గురిచేస్తానని బెదిరించింది.

దీంతో బాధితుడు సంజయ్​ సర్కిల్​ పోలీసులను ఆశ్రయించాడు. నిందితురాలిని పట్టుకునేందుకు పోలీసులు పక్కా స్కెచ్​ వేశారు. బాధితుడి దగ్గర నుంచి రూ.50వేల నగదు, రూ.19.50 లక్షల విలువైన మూడు చెక్కులు తీసుకుంటుండగా రెడ్​హ్యాండెడ్​గా పట్టుకున్నారు. కేసు నమోదు చేసి.. హనీ ట్రాప్​ ముఠాలో ఎంత మంది ఉన్నారనే కోణంలో దర్యాప్తు చేపట్టినట్లు సంజయ్​ సర్కిల్​ అధికారి మోహమ్మద్​ శఫీక్​ ఖాన్​ తెలిపారు. యువతి ఫోన్​ కాల్స్​ డేటాను పరిశీలిస్తున్నామని, దాని ద్వారా ఆమెతో సంబంధం ఉన్న వ్యక్తులను గుర్తించటం సులభమవుతుందని చెప్పారు.

Honeytrap case: మాజీ మిస్టర్​ రాజస్థాన్​పై వలపు వల విసిరి రూ.20 లక్షలు డిమాండ్​ చేసిన కిలేడీని జైపుర్​ పోలీసులు మంగళవారం అరెస్ట్​ చేశారు. హనీ ట్రాప్​ ముఠాలో ఇంకా ఎంత మంది ఉన్నారనే కోణంలో దర్యాప్తు చేపట్టారు. ఈ కేసుపై కీలక అంశాలను వెల్లడించారు సంజయ్​ సర్కిల్​ పోలీస్​ స్టేషన్​ అధికారి మోహమ్మద్​ శఫీక్​ ఖాన్​.

కేసు వివరాలు ఇలా: ఉత్తర్​ప్రదేశ్​లోని బులంద్​శహర్​కు చెందిన రాధా సైనీ అనే యువతి గతంలో మోడలింగ్​ చేసింది. ప్రస్తుతం రాజస్థాన్​ రాజధాని జైపుర్​లోని చిత్రకూట్​ ప్రాంతం డీసీఎం అపార్ట్​మెంట్స్​లో​ నివాసం ఉంటోంది. ఐదేళ్ల క్రితం మాజీ మిస్టర్​ రాజస్థాన్​ అయిన అనీస్​ అనే యువకుడితో పరిచయం పెంచుకుంది. ఆమె కపట ప్రేమను గుర్తించలేకపోయాడు అనీస్​. కొన్నాళ్లు ఇరువురు సహజీవనం చేశారు. ఆ తర్వాత అసలు రూపాన్ని బయటపెట్టింది. డబ్బులు ఇవ్వాలని బ్లాక్​మెయిల్​ చేయటం మొదలు పెట్టింది. ఇప్పటికే రూ.6 లక్షల వరకు దోచుకుంది. ఇటీవలే యువకుడికి మరో యువతితో వివాహం జరిగింది. అది తెలుసుకున్న నిందితురాలు.. మళ్లీ వేధించటం మొదలు పెట్టింది. తనకు రూ.20 లక్షలు ఇవ్వాలని డిమాండ్​ చేసింది. లేదంటే అత్యాచారం కేసు పెట్టి ఇబ్బందులకు గురిచేస్తానని బెదిరించింది.

దీంతో బాధితుడు సంజయ్​ సర్కిల్​ పోలీసులను ఆశ్రయించాడు. నిందితురాలిని పట్టుకునేందుకు పోలీసులు పక్కా స్కెచ్​ వేశారు. బాధితుడి దగ్గర నుంచి రూ.50వేల నగదు, రూ.19.50 లక్షల విలువైన మూడు చెక్కులు తీసుకుంటుండగా రెడ్​హ్యాండెడ్​గా పట్టుకున్నారు. కేసు నమోదు చేసి.. హనీ ట్రాప్​ ముఠాలో ఎంత మంది ఉన్నారనే కోణంలో దర్యాప్తు చేపట్టినట్లు సంజయ్​ సర్కిల్​ అధికారి మోహమ్మద్​ శఫీక్​ ఖాన్​ తెలిపారు. యువతి ఫోన్​ కాల్స్​ డేటాను పరిశీలిస్తున్నామని, దాని ద్వారా ఆమెతో సంబంధం ఉన్న వ్యక్తులను గుర్తించటం సులభమవుతుందని చెప్పారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.