ETV Bharat / bharat

కరోనా వేళ 25 లక్షల కేసులు విచారించిన కోర్టులు! - Court hearings during Coronavirus

కరోనా విస్తరిస్తున్న సమయంలో దేశంలోని హైకోర్టులు, జిల్లా కోర్టులు డిజిటల్​ వేదికగా మొత్తం 25 లక్షల కేసులను విచారించాయని కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్​ ప్రసాద్​ తెలిపారు. సుప్రీంకోర్టు దాదాపు 10 వేల కేసులను విచారించినట్లు ఆయన పేర్కొన్నారు.

High courts, district courts conducted 25 lakh digital hearings during COVID-19: Prasad
కరోనా వేళ 25 లక్షల కేసులు విచారించిన కోర్టులు!
author img

By

Published : Nov 26, 2020, 5:25 AM IST

కొవిడ్​ వేళ అందరూ ఇంటికే పరిమితమడం వల్ల... దాదాపు అన్ని పనులు ఆగిపోయాయి. ప్రపంచమంతా ఇంటర్నెట్​, ఫోన్​లతో గడిపేసింది. అయితే దేశంలోని న్యాయస్థానాలు మాత్రం నిరంతరాయంగా పని చేశాయి. కరోనా కాలంలో హైకోర్టులు, జిల్లా కోర్టులు ఆన్​లైన్​ వేదికగా మొత్తం 25 లక్షల కేసులను విచారించగా... సుప్రీంకోర్టు దాదాపు 10 వేల కేసులపై విచారణ జరిపింది. ఓ వర్చువల్​ సమావేశంలో న్యాయశాఖ మంత్రి రవిశంకర్​ ప్రసాద్​ ఈ విషయాన్ని వెల్లడించారు.

దేశవ్యాప్తంగా 25 హైకోర్టులు, 19 వేల జిల్లాకోర్టులు ఉండగా... కరోనా​ సమయంలో 25 లక్షల కేసులు విచారించాయన్న న్యాయశాఖ మంత్రి... వాటిల్లో ఎక్కువగా ట్రాఫిక్​ ఉల్లంఘన కేసులే ఉన్నట్లు తెలిపారు. తద్వారా రూ. 115 కోట్ల జరిమాన ప్రభుత్వానికి అందింది.

కొవిడ్​ వేళ అందరూ ఇంటికే పరిమితమడం వల్ల... దాదాపు అన్ని పనులు ఆగిపోయాయి. ప్రపంచమంతా ఇంటర్నెట్​, ఫోన్​లతో గడిపేసింది. అయితే దేశంలోని న్యాయస్థానాలు మాత్రం నిరంతరాయంగా పని చేశాయి. కరోనా కాలంలో హైకోర్టులు, జిల్లా కోర్టులు ఆన్​లైన్​ వేదికగా మొత్తం 25 లక్షల కేసులను విచారించగా... సుప్రీంకోర్టు దాదాపు 10 వేల కేసులపై విచారణ జరిపింది. ఓ వర్చువల్​ సమావేశంలో న్యాయశాఖ మంత్రి రవిశంకర్​ ప్రసాద్​ ఈ విషయాన్ని వెల్లడించారు.

దేశవ్యాప్తంగా 25 హైకోర్టులు, 19 వేల జిల్లాకోర్టులు ఉండగా... కరోనా​ సమయంలో 25 లక్షల కేసులు విచారించాయన్న న్యాయశాఖ మంత్రి... వాటిల్లో ఎక్కువగా ట్రాఫిక్​ ఉల్లంఘన కేసులే ఉన్నట్లు తెలిపారు. తద్వారా రూ. 115 కోట్ల జరిమాన ప్రభుత్వానికి అందింది.

ఇదీ చూడండి: జైల్లో నుంచే ఎన్నికల్లో గెలుస్తా: బంగాల్​ సీఎం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.