కర్ణాటకలో వినూత్న కార్యక్రమాలు చేపడుతూ నిత్యం వార్తల్లో ఉండే మానవ బంధుత్వ వేదిక మరోసారి తన ప్రత్యేకతను చాటుకుంది. వ్యాసరచన పోటీల్లో గెలుపొందిన వారిని హెలికాప్టర్లో ఎక్కించి ఆ రైడ్నే వారికి బహుమతిగా ఇచ్చింది. సావిత్రి బాయి పూలే జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన రాష్ట్ర స్థాయి వ్యాసరచన, ఉపన్యాస పోటీల విజేతలకు ఈ హెలికాప్టర్ రైడింగ్ను బహుమతిగా ఇచ్చారు. మానవ బంధుత్వ వేదిక ఆధ్వర్యంలో గోకాకా పట్టణంలోని వాల్మీకి స్టేడియంలో ఈ కార్యక్రమం జరిగింది.
వైష్ణవి కడోల్కర్(బెల్గాం), జ్యోతి గుడ్డీన్(శిరగుప్పి), సుధా కర్లీ(రాయచూర్), సిమ్రాన్ భగవన్(యాదవాడ), వి.మానస(చామరాజనగర్)లు వ్యాసరచన పోటీ విజేతలు.. వీరంతా హెలికాప్టర్ రైడ్లో పాల్గొన్నారు.

ఉపన్యాస(స్పీచ్) పోటీ విజేతలు.. పూజ(తీర్థహళ్లి), ముషారఫ్ సయ్య(ఘటప్రభ), ప్రియాంక భరణి(కలబురిగి), పవిత్ర పట్టరావత(మేళవంకి), శ్వేత జుగాలే(ధార్వాడ్), శ్యామల బరమా(కలఖంబా)


ఈ రైడ్ను చూసేందుకు వచ్చిన ప్రజలు, గెలుపొందిన విజేతల మోముల్లో సంతోషంతో స్టేడియం ప్రాంగణమంతా కోలాహలంగా మారింది.
ఇదీ చదవండి: మ్యారేజ్ బ్యూరో ప్రారంభించిన కుడుంబశ్రీ