ETV Bharat / bharat

కొవాగ్జిన్, కొవిషీల్డ్ ఉత్పత్తిపై హైకోర్టు ప్రశ్నలు

author img

By

Published : Mar 4, 2021, 3:19 PM IST

Updated : Mar 4, 2021, 6:32 PM IST

కొవిడ్-19 టీకా ఉత్పత్తి సామర్థ్యం ఎంతో చెప్పాలని భారత్​ బయోటెక్​, సీరం ఇన్​స్టిట్యూట్​ను ఆదేశించింది దిల్లీ హైకోర్టు. పూర్తి సామర్థ్యం మేరకు టీకా ఉత్పత్తి చేస్తున్నట్లు కనిపించడం లేదని అభిప్రాయపడింది. అలాగే.. ప్రస్తుతం టీకా పంపిణీ ఏ ప్రాతిపాదికన చేస్తున్నారో ప్రమాణ పత్రం దాఖలు చేయాలని కేంద్రానికి సూచించింది.

HC asks Serum Institute, Bharat Biotech
భారత్​ బయోటెక్​, సీరం​లకు దిల్లీ హైకోర్టు ఆదేశాలు

కరోనా టీకా పంపిణీ ఏ ప్రాతిపదికన చేస్తున్నారో తెలుపుతూ ప్రమాణ పత్రం దాఖలు చేయాలని కేంద్రాన్ని ఆదేశించింది దిల్లీ హైకోర్టు. ప్రస్తుతం అవలంభిస్తున్న 60 ఏళ్లు పైబడిన వారికి, అనారోగ్య సమస్యలు కలిగిన 45 ఏళ్లు మించిన వారికి అందిస్తున్న విధానంపై పూర్తి వివరాలు సమర్పించాలని సూచించింది. అలాగే.. కొవిషీల్డ్​, కొవాగ్జిన్​ తయారీ సంస్థలైన భారత్​ బయోటెక్​, సీరం ఇన్​స్టిట్యూట్​ ఆఫ్ ఇండియాలు టీకాలు అందించేందుకు మరింత సామర్థ్యం కలిగి ఉన్నప్పటికీ.. పూర్తి సామర్థ్యంతో ఉత్పత్తి చేస్తున్నట్లు కనిపించటం లేదని అసంతృప్తి వ్యక్తం చేసింది.

కోర్టుల్లో పనిచేసే వారందరినీ ఫ్రంట్​లైన్​ వర్కర్లుగా భావించి వయసు, ఆరోగ్య సమస్యలతో సంబంధం లేకుండా టీకా వేయాలని.. బార్​ కౌన్సిల్​ ఆఫ్​ దిల్లీ పిటిషన్​ దాఖలు చేసింది. ఈ వ్యాజ్యంపై విచారణ చేపట్టింది జస్టిస్​ విపిన్​ సంఘీ, జస్టిస్​ రేఖాపల్లీతో కూడిన ధర్మాసనం.

"మనం పూర్తిస్థాయిలో వినియోగించుకోవటం లేదు. ఇతర దేశాలకు విరాళమివ్వటం లేదా విక్రయించటం చేస్తున్నాం. కానీ మన ప్రజలకు టీకా అందించటం లేదు. కాబట్టి బాధ్యత, అత్యవసర భావన కలిగి ఉండాలి. టీకాల సరఫరా సామర్థ్యాన్ని తెలుపుతూ కేంద్రం అఫిడవిట్​ దాఖలు చేయాలి. ప్రస్తుతం ఎంతవరకు ఉపయోగిస్తున్నారనేది తెలపాలి. టీకా పంపిణీకి అనుసరిస్తున్న విధానాలపై పూర్తి వివరాలు అందించాలి. "

- ధర్మాసనం.

హైకోర్టు ప్రశ్నలు

కరోనా వ్యాక్సిన్ ఉత్పత్తి సామర్థ్యం రోజు/వారం/ నెలల ప్రాతిపదికన తెలియజేస్తూ ప్రత్యేక ప్రమాణ పత్రం దాఖలు చేయాలని భారత్​ బయోటెక్​, సీరం ఇన్​స్టిట్యూట్​లను ఆదేశించింది దిల్లీ హైకోర్టు. ప్రస్తుతం ఎంత మేర తయారు చేస్తున్నాం. ఇంకా ఎంత సామర్థ్యం ఉందనేది వివరించాలని సూచించింది. ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచగలమా లేదా చెప్పాలని స్పష్టం చేసింది.

దిల్లీ ప్రభుత్వానికి ఆదేశాలు..

దిల్లీ కోర్టు కాంప్లెక్స్​లో వైద్య సౌకర్యాలను పరిశీలించి, టీకా పంపిణీ కేంద్రాలు ఏర్పాటుకు ఉన్న అవకాశాలపై నివేదిక ఇవ్వాలని దిల్లీ ప్రభుత్వాన్ని ఆదేశించింది హైకోర్టు. అలాగే.. టీకే తీసుకునేందుకు ఎంత మంది నమోదు చేసుకున్నారో తెలపాలని దిల్లీ హైకోర్టు బార్​ అసోసియేషన్​, బీసీడీలకు సూచించింది.

ఈ సందర్భంగా.. టీకా తీసుకునే వారు ఎంత మంది ఉన్నారు, మొత్తం జ్యుడీషియరీ ఈ పరిధిలోకి రాదా? అని ధర్మాసనాన్ని అడిగారు భారత్​ బయోటెక్​ తరఫు న్యాయవాది. ప్రస్తుతం టీకా పంపణీ ప్రక్రియ నిపుణుల బృందం తీసుకున్న నిర్ణయం మేరకు అనుసరిస్తున్నట్లు కేంద్రం తరఫున హాజరైన అదనపు సొలిసిటర్​ జనరల్​ చేతన్​ శర్మ, న్యాయవాది అనిల్​ సోని కోర్టుకు తెలిపారు. ఇలాంటి పిటిషనే సుప్రీం కోర్టులో సోమవారం విచారణకు ఉందని తెలిపారు​.

మార్చి 9 వరకు గడువు..

ఈ మేరకు కేంద్రం, దిల్లీ ప్రభుత్వంతో పాటు భారత్​ బయోటెక్​, సీరం ఇన్​స్టిట్యూట్​లు అఫిడవిట్​లు దాఖలు చేసేందుకు మార్చి 9 వరకు గడువు ఇచ్చింది దిల్లీ హైకోర్టు. తదుపరి విచారణను మార్చి 10కి వాయిదా వేసింది.

ఇదీ చూడండి: 'వృద్ధుల చికిత్సకు ఆస్పత్రులు ప్రాధాన్యం ఇవ్వాల్సిందే'

కరోనా టీకా పంపిణీ ఏ ప్రాతిపదికన చేస్తున్నారో తెలుపుతూ ప్రమాణ పత్రం దాఖలు చేయాలని కేంద్రాన్ని ఆదేశించింది దిల్లీ హైకోర్టు. ప్రస్తుతం అవలంభిస్తున్న 60 ఏళ్లు పైబడిన వారికి, అనారోగ్య సమస్యలు కలిగిన 45 ఏళ్లు మించిన వారికి అందిస్తున్న విధానంపై పూర్తి వివరాలు సమర్పించాలని సూచించింది. అలాగే.. కొవిషీల్డ్​, కొవాగ్జిన్​ తయారీ సంస్థలైన భారత్​ బయోటెక్​, సీరం ఇన్​స్టిట్యూట్​ ఆఫ్ ఇండియాలు టీకాలు అందించేందుకు మరింత సామర్థ్యం కలిగి ఉన్నప్పటికీ.. పూర్తి సామర్థ్యంతో ఉత్పత్తి చేస్తున్నట్లు కనిపించటం లేదని అసంతృప్తి వ్యక్తం చేసింది.

కోర్టుల్లో పనిచేసే వారందరినీ ఫ్రంట్​లైన్​ వర్కర్లుగా భావించి వయసు, ఆరోగ్య సమస్యలతో సంబంధం లేకుండా టీకా వేయాలని.. బార్​ కౌన్సిల్​ ఆఫ్​ దిల్లీ పిటిషన్​ దాఖలు చేసింది. ఈ వ్యాజ్యంపై విచారణ చేపట్టింది జస్టిస్​ విపిన్​ సంఘీ, జస్టిస్​ రేఖాపల్లీతో కూడిన ధర్మాసనం.

"మనం పూర్తిస్థాయిలో వినియోగించుకోవటం లేదు. ఇతర దేశాలకు విరాళమివ్వటం లేదా విక్రయించటం చేస్తున్నాం. కానీ మన ప్రజలకు టీకా అందించటం లేదు. కాబట్టి బాధ్యత, అత్యవసర భావన కలిగి ఉండాలి. టీకాల సరఫరా సామర్థ్యాన్ని తెలుపుతూ కేంద్రం అఫిడవిట్​ దాఖలు చేయాలి. ప్రస్తుతం ఎంతవరకు ఉపయోగిస్తున్నారనేది తెలపాలి. టీకా పంపిణీకి అనుసరిస్తున్న విధానాలపై పూర్తి వివరాలు అందించాలి. "

- ధర్మాసనం.

హైకోర్టు ప్రశ్నలు

కరోనా వ్యాక్సిన్ ఉత్పత్తి సామర్థ్యం రోజు/వారం/ నెలల ప్రాతిపదికన తెలియజేస్తూ ప్రత్యేక ప్రమాణ పత్రం దాఖలు చేయాలని భారత్​ బయోటెక్​, సీరం ఇన్​స్టిట్యూట్​లను ఆదేశించింది దిల్లీ హైకోర్టు. ప్రస్తుతం ఎంత మేర తయారు చేస్తున్నాం. ఇంకా ఎంత సామర్థ్యం ఉందనేది వివరించాలని సూచించింది. ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచగలమా లేదా చెప్పాలని స్పష్టం చేసింది.

దిల్లీ ప్రభుత్వానికి ఆదేశాలు..

దిల్లీ కోర్టు కాంప్లెక్స్​లో వైద్య సౌకర్యాలను పరిశీలించి, టీకా పంపిణీ కేంద్రాలు ఏర్పాటుకు ఉన్న అవకాశాలపై నివేదిక ఇవ్వాలని దిల్లీ ప్రభుత్వాన్ని ఆదేశించింది హైకోర్టు. అలాగే.. టీకే తీసుకునేందుకు ఎంత మంది నమోదు చేసుకున్నారో తెలపాలని దిల్లీ హైకోర్టు బార్​ అసోసియేషన్​, బీసీడీలకు సూచించింది.

ఈ సందర్భంగా.. టీకా తీసుకునే వారు ఎంత మంది ఉన్నారు, మొత్తం జ్యుడీషియరీ ఈ పరిధిలోకి రాదా? అని ధర్మాసనాన్ని అడిగారు భారత్​ బయోటెక్​ తరఫు న్యాయవాది. ప్రస్తుతం టీకా పంపణీ ప్రక్రియ నిపుణుల బృందం తీసుకున్న నిర్ణయం మేరకు అనుసరిస్తున్నట్లు కేంద్రం తరఫున హాజరైన అదనపు సొలిసిటర్​ జనరల్​ చేతన్​ శర్మ, న్యాయవాది అనిల్​ సోని కోర్టుకు తెలిపారు. ఇలాంటి పిటిషనే సుప్రీం కోర్టులో సోమవారం విచారణకు ఉందని తెలిపారు​.

మార్చి 9 వరకు గడువు..

ఈ మేరకు కేంద్రం, దిల్లీ ప్రభుత్వంతో పాటు భారత్​ బయోటెక్​, సీరం ఇన్​స్టిట్యూట్​లు అఫిడవిట్​లు దాఖలు చేసేందుకు మార్చి 9 వరకు గడువు ఇచ్చింది దిల్లీ హైకోర్టు. తదుపరి విచారణను మార్చి 10కి వాయిదా వేసింది.

ఇదీ చూడండి: 'వృద్ధుల చికిత్సకు ఆస్పత్రులు ప్రాధాన్యం ఇవ్వాల్సిందే'

Last Updated : Mar 4, 2021, 6:32 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.