ETV Bharat / bharat

ఇమ్యూనిటీ టీకా​ పంపిణీ కోసం 'ఐఎమ్​ఐ​ 3.0'

author img

By

Published : Feb 20, 2021, 7:54 AM IST

చిన్నారులు, గర్భిణీలకు రోగ నిరోధక టీకాలను అందించే విషయమై కీలక నిర్ణయం తీసుకుంది కేంద్రం. కరోనా కారణంగా ఇమ్యూనిటీ వ్యాక్సిన్​కు దూరమైన వారికి.. సత్వరమే టీకా అందించేందుకు ఏర్పాట్లు ముమ్మరం చేసింది. ఇందుకోసం 'ఇంటెన్సిఫైడ్​ మిషన్​ ఇంద్రధనుష్​ 3.0'ను ప్రారంభించింది.

Harsh Vardhan launches Intensified Mission Indradhanush 3.0
ఇమ్యూనిటీ టీకా​ పంపిణీ కోసం 'ఐఎమ్​ఐ​ 3.0'

కరోనా మహమ్మారి కారణంగా మిషన్‌ ఇంద్రధనుష్‌ ద్వారా కేంద్రం అందించే రోగ నిరోధక టీకాలకు దూరమైన చిన్నారులు, గర్భిణీలకు తిరిగి వ్యాక్సిన్‌ అందించేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. టీకాలు పొందని చిన్నారులు, గర్బిణీలకు రెండు రౌండ్లలో వ్యాక్సిన్​ అందించనున్నట్టు ఆరోగ్యశాఖ తెలిపింది. ఈ మేరకు ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్‌ 'ఇంటెన్సిఫైడ్‌ మిషన్‌ ఇంద్రధనుష్‌(ఐఎమ్​ఐ) 3.0' కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.

15 రోజుల వ్యవధిలో..

ఐఎమ్​ఐ ద్వారా ముందుగానే గుర్తించిన దేశంలోని వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 250 జిల్లాల్లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. ఫిబ్రవరి 22, మార్చి 22 తేదీల్లో రెండు విడతల్లో టీకాల పంపిణీ ప్రక్రియ జరగనున్నట్లు అధికారులు తెలిపారు. సంబంధిత జిల్లాల్లో టీకాలు తీసుకోని చిన్నారులు, గర్భిణీలను గుర్తించి 15 రోజుల వ్యవధిలో రెండు వ్యాక్సిన్​లు ఇవ్వనున్నారు.

గతంలో..

2014లో మిషన్​ ఇంద్రధనుష్​ను ప్రారంభించింది కేంద్రం. గతంలో నిర్వహించిన తొలి రెండు దశల కార్యక్రమంలో భాగంగా.. దేశంలోని 690 జిల్లాల్లో టీకాలు పంపిణీ చేశారు. దీని ద్వారా ఆయా జిల్లాల్లోని 3.76 కోట్ల మంది చిన్నారులు, 94.6 లక్షల మంది గర్భిణీలకు వ్యాక్సిన్​లు సరఫరా చేసింది కేంద్రం.

ఇదీ చదవండి: 'మంగళ్​యాన్​-2 సైతం ఒక ఆర్బిటరే​'

కరోనా మహమ్మారి కారణంగా మిషన్‌ ఇంద్రధనుష్‌ ద్వారా కేంద్రం అందించే రోగ నిరోధక టీకాలకు దూరమైన చిన్నారులు, గర్భిణీలకు తిరిగి వ్యాక్సిన్‌ అందించేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. టీకాలు పొందని చిన్నారులు, గర్బిణీలకు రెండు రౌండ్లలో వ్యాక్సిన్​ అందించనున్నట్టు ఆరోగ్యశాఖ తెలిపింది. ఈ మేరకు ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్‌ 'ఇంటెన్సిఫైడ్‌ మిషన్‌ ఇంద్రధనుష్‌(ఐఎమ్​ఐ) 3.0' కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.

15 రోజుల వ్యవధిలో..

ఐఎమ్​ఐ ద్వారా ముందుగానే గుర్తించిన దేశంలోని వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 250 జిల్లాల్లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. ఫిబ్రవరి 22, మార్చి 22 తేదీల్లో రెండు విడతల్లో టీకాల పంపిణీ ప్రక్రియ జరగనున్నట్లు అధికారులు తెలిపారు. సంబంధిత జిల్లాల్లో టీకాలు తీసుకోని చిన్నారులు, గర్భిణీలను గుర్తించి 15 రోజుల వ్యవధిలో రెండు వ్యాక్సిన్​లు ఇవ్వనున్నారు.

గతంలో..

2014లో మిషన్​ ఇంద్రధనుష్​ను ప్రారంభించింది కేంద్రం. గతంలో నిర్వహించిన తొలి రెండు దశల కార్యక్రమంలో భాగంగా.. దేశంలోని 690 జిల్లాల్లో టీకాలు పంపిణీ చేశారు. దీని ద్వారా ఆయా జిల్లాల్లోని 3.76 కోట్ల మంది చిన్నారులు, 94.6 లక్షల మంది గర్భిణీలకు వ్యాక్సిన్​లు సరఫరా చేసింది కేంద్రం.

ఇదీ చదవండి: 'మంగళ్​యాన్​-2 సైతం ఒక ఆర్బిటరే​'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.