ETV Bharat / bharat

'ఆ షరతుకు అంగీకరిస్తేనే రైతులతో చర్చలు' - పార్లమెంట్​ ఘోరవ్​పై తోమర్ స్పందన

ప్రభుత్వ షరతును అంగీకరిస్తే రైతు సంఘాల నేతలతో చర్చలు జరిపేందుకు ఎలాంటి అభ్యంతరం లేదని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ స్పష్టం చేశారు. భారతీయ కిసాన్​ యూనియన్ నేత రాకేశ్ టికాయిత్ పార్లమెంట్​ముట్టడికి పిలుపునిచ్చిన నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చేశారు.

Narendra singh thomar on talks with farmers
'ఆ షరతు అంగీకరిస్తే రైతు సంఘాలతో చర్చకు రెడీ'
author img

By

Published : Feb 24, 2021, 5:31 PM IST

సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమిస్తోన్న రైతులతో చర్చలకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని పునరుద్ఘాటించారు కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్. ఏడాదిన్నర పాటు సాగు చట్టాల అమలును నిలిపివేస్తామన్న ప్రభుత్వ నిర్ణయంపై కర్షక నేతలు సానుకూలంగా స్పందిస్తేనే ఈ చర్చలు జరుగుతాయని స్పష్టం చేశారు.

"అన్నదాతలతో ప్రభుత్వం మర్యాదపూర్వకంగా చర్చలు జరుపుతోంది. ఇప్పటికీ... రైతు నేతలు స్పందిస్తే వారితో చర్చలు జరిపేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది."

-తోమర్, కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి.

సాగు చట్టాలను రద్దు చేయకపోతే... 40 లక్షల ట్రాక్టర్లతో పార్లమెంట్​ను చుట్టుముడతామని భారతీయ కిసాన్ యూనియన్ నేత రాకేశ్ టికాయిత్ హెచ్చరించారు. 'పార్లమెంట్​ ఘోరావ్​' పిలుపుపై తోమర్​ ఈ విధంగా స్పందించారు.

ఇప్పటికే కేంద్రం, కర్షక నేతల మధ్య 11 దఫాల చర్చలు జరిగాయి. గణతంత్ర దినోత్సవం సందర్భంగా చోటుచేసుకున్న ఎర్రకోట ఘటన అనంతరం ఇరువురి మధ్య ఎలాంటి చర్చలు జరగడంలేదు.

ఇదీ చదవండి:'అల్లర్ల సృష్టిలో మోదీ నం.1- చివరకు ట్రంప్​ పరిస్థితే!'

సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమిస్తోన్న రైతులతో చర్చలకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని పునరుద్ఘాటించారు కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్. ఏడాదిన్నర పాటు సాగు చట్టాల అమలును నిలిపివేస్తామన్న ప్రభుత్వ నిర్ణయంపై కర్షక నేతలు సానుకూలంగా స్పందిస్తేనే ఈ చర్చలు జరుగుతాయని స్పష్టం చేశారు.

"అన్నదాతలతో ప్రభుత్వం మర్యాదపూర్వకంగా చర్చలు జరుపుతోంది. ఇప్పటికీ... రైతు నేతలు స్పందిస్తే వారితో చర్చలు జరిపేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది."

-తోమర్, కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి.

సాగు చట్టాలను రద్దు చేయకపోతే... 40 లక్షల ట్రాక్టర్లతో పార్లమెంట్​ను చుట్టుముడతామని భారతీయ కిసాన్ యూనియన్ నేత రాకేశ్ టికాయిత్ హెచ్చరించారు. 'పార్లమెంట్​ ఘోరావ్​' పిలుపుపై తోమర్​ ఈ విధంగా స్పందించారు.

ఇప్పటికే కేంద్రం, కర్షక నేతల మధ్య 11 దఫాల చర్చలు జరిగాయి. గణతంత్ర దినోత్సవం సందర్భంగా చోటుచేసుకున్న ఎర్రకోట ఘటన అనంతరం ఇరువురి మధ్య ఎలాంటి చర్చలు జరగడంలేదు.

ఇదీ చదవండి:'అల్లర్ల సృష్టిలో మోదీ నం.1- చివరకు ట్రంప్​ పరిస్థితే!'

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.