ETV Bharat / bharat

మైనర్​పై గ్యాంగ్ రేప్.. పిల్లలను బావిలోకి విసిరేసిన తండ్రి

author img

By

Published : Apr 25, 2022, 2:07 PM IST

8వ తరగతి చదువుతున్న బాలికకు ఫోన్ చేసి.. ఏకాంత ప్రదేశానికి రమ్మని పిలిచి అత్యాచారానికి పాల్పడ్డారు ముగ్గురు మృగాళ్లు. ఘటన జరిగిన గంటల్లోనే పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఉత్తర్​ప్రదేశ్​లో జరిగిన మరో ఘటనలో కన్నతండ్రే తన పిల్లలను బావిలోకి విసిరేసి చంపేశాడు.

gang-rape-with-minor-girl-in-ranchi
మైనర్​పై సామూహిక అత్యాచారం

Ranchi Rape Case: ఝార్ఖండ్ రాంచీలో దారుణం జరిగింది. 8వ తరగతి చదువుతున్న బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు ముగ్గురు కిరాతకులు. ఆమెకు ఫోన్ చేసి ఏకాంత ప్రదేశానికి రమ్మని పిలిచి ఈ ఘాతుకానికి ఒడిగట్టారు. చాహ్నో పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటనకు సంబంధించి పోలీసులు ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. అత్యాచారం జరిగిందని సమాచారం అందిన గంటల్లోనే వీరిని అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు.

పిల్లలను బావిలోకి విసిరిన తండ్రి: ఉత్తర్​ప్రదేశ్ జౌన్​పుర్ జిల్లాలో షాకింగ్ ఘటన జరిగింది. ఓ తండ్రి అత్యంత క్రూరంగా ప్రవర్తించి తన ఇద్దరు బిడ్డలను బావిలోకి విసిరేశాడు. దీంతో వారు చనిపోయారు. ఆదివారం మధ్యాహ్నం నైపురా గ్రామంలో ఈ అమానవీయ ఘటన జరిగింది. చనిపోయిన ఇద్దరిలో ఒకరు ఏడేళ్ల పాప కాగా.. మరొకరు ఐదేళ్ల బాలుడు. తండ్రి మానసిక స్థితి సరిగ్గా లేదని, అందుకే ఈ దారుణ చర్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. ఆదివారం సాయంత్రమే అతడ్ని అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు.

14 ఏళ్ల బాలిక మృతి: అత్యాచార యత్నం కేసు వాపస్​ తీసుకోవాలని నిందితులు బెదిరించారని ఒంటికి నిప్పంటించుకున్న బంగాల్ బాలిక మరణించింది. దాదాపు 11 రోజుల పాటు మృత్యువుతో పోరాడి సోమవారం కన్నుమూసింది. ఫిబ్రవరి 28న ఒంటరిగా ఉన్న సమయంలో తనపై ఓ వ్యక్తి అత్యాచారానికి ప్రయత్నించాడని కేసు పెట్టింది బాలిక. నిందితుడిని పోలీసులు అప్పుడే అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత బెయిల్​పై విడుదలయ్యాడు.

అనంతరం ఏప్రిల్​ 13న బాలిక ఇంటికి మరో వ్యక్తితో వెళ్లి కేసు వాపస్ తీసుకోవాలని బెదిరించాడు. లేదంటే కుటుంబసభ్యులను చెంపేస్తానని హెచ్చరించాడు. దీంతో ఆమె భయంతో ఆ మరునాడే ఒంటికి నిప్పంటించుకుంది. ఆస్పత్రిలో 11 రోజుల పాటు చికిత్స పొంది సోమవారం కన్నుమూసింది. జల్​పాయ్ గుడి జిల్లా మయినాగుడి పోలీస్​ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటనకు సంబంధించి ఇద్దరు నిందితులను పోలీసులు ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారు.

ఇదీ చదవండి: రెండురోజుల క్రితం గృహ ప్రవేశం- దంపతులు సజీవ దహనం

Ranchi Rape Case: ఝార్ఖండ్ రాంచీలో దారుణం జరిగింది. 8వ తరగతి చదువుతున్న బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు ముగ్గురు కిరాతకులు. ఆమెకు ఫోన్ చేసి ఏకాంత ప్రదేశానికి రమ్మని పిలిచి ఈ ఘాతుకానికి ఒడిగట్టారు. చాహ్నో పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటనకు సంబంధించి పోలీసులు ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. అత్యాచారం జరిగిందని సమాచారం అందిన గంటల్లోనే వీరిని అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు.

పిల్లలను బావిలోకి విసిరిన తండ్రి: ఉత్తర్​ప్రదేశ్ జౌన్​పుర్ జిల్లాలో షాకింగ్ ఘటన జరిగింది. ఓ తండ్రి అత్యంత క్రూరంగా ప్రవర్తించి తన ఇద్దరు బిడ్డలను బావిలోకి విసిరేశాడు. దీంతో వారు చనిపోయారు. ఆదివారం మధ్యాహ్నం నైపురా గ్రామంలో ఈ అమానవీయ ఘటన జరిగింది. చనిపోయిన ఇద్దరిలో ఒకరు ఏడేళ్ల పాప కాగా.. మరొకరు ఐదేళ్ల బాలుడు. తండ్రి మానసిక స్థితి సరిగ్గా లేదని, అందుకే ఈ దారుణ చర్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. ఆదివారం సాయంత్రమే అతడ్ని అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు.

14 ఏళ్ల బాలిక మృతి: అత్యాచార యత్నం కేసు వాపస్​ తీసుకోవాలని నిందితులు బెదిరించారని ఒంటికి నిప్పంటించుకున్న బంగాల్ బాలిక మరణించింది. దాదాపు 11 రోజుల పాటు మృత్యువుతో పోరాడి సోమవారం కన్నుమూసింది. ఫిబ్రవరి 28న ఒంటరిగా ఉన్న సమయంలో తనపై ఓ వ్యక్తి అత్యాచారానికి ప్రయత్నించాడని కేసు పెట్టింది బాలిక. నిందితుడిని పోలీసులు అప్పుడే అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత బెయిల్​పై విడుదలయ్యాడు.

అనంతరం ఏప్రిల్​ 13న బాలిక ఇంటికి మరో వ్యక్తితో వెళ్లి కేసు వాపస్ తీసుకోవాలని బెదిరించాడు. లేదంటే కుటుంబసభ్యులను చెంపేస్తానని హెచ్చరించాడు. దీంతో ఆమె భయంతో ఆ మరునాడే ఒంటికి నిప్పంటించుకుంది. ఆస్పత్రిలో 11 రోజుల పాటు చికిత్స పొంది సోమవారం కన్నుమూసింది. జల్​పాయ్ గుడి జిల్లా మయినాగుడి పోలీస్​ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటనకు సంబంధించి ఇద్దరు నిందితులను పోలీసులు ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారు.

ఇదీ చదవండి: రెండురోజుల క్రితం గృహ ప్రవేశం- దంపతులు సజీవ దహనం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.