ETV Bharat / bharat

కరోనా టీకా తీసుకున్న దేశ ప్రథమ ఓటరు

దేశ ప్రథమ ఓటరు శ్యామ్​ శరణ్​ నేగి, భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా మంగళవారం కొవిడ్​ టీకా వేయించుకున్నారు. వ్యాక్సిన్​ తీసుకోవడంపై సంతోషం వ్యక్తం చేశారు. దేశ ప్రజలందరూ టీకా తీసుకోవాలని సూచించారు.

author img

By

Published : Mar 9, 2021, 7:09 PM IST

First voter of the country got the coronavirus vaccine
కరోనా టీకా తీసుకున్న దేశ ప్రథమ ఓటరు శ్యామ్​ శరణ్​

దేశంలో పలువురు ప్రముఖులు మంగళవారం కరోనా టీకా తీసుకున్నారు. భారత దేశ ప్రథమ ఓటరు శ్యామ్ శరణ్ నేగి.. టీకా తీసుకున్నారు. హిమాచల్​ ప్రదేశ్​లోని కిన్నోర్​ ఆరోగ్య విభాగ వైద్యులు.. నేగిని భుజాలపై తీసుకెళ్లి, టీకా తొలి డోసు వేశారు. వ్యాక్సిన్​ తీసుకోవడంపై సంతోషం వ్యక్తం చేశారు నేగి. ఈ నేపథ్యంలో దేశ ప్రజలందరూ టీకా వేయించుకోవాలని సూచించారు.

First voter of the country got the coronavirus vaccine
కరోనా టీకా అందుకున్న శ్యామ్​ శరణ్​ నేగి

టీకా తీసుకున్న నడ్డా

భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా.. దిల్లీలో కరోనా టీకా తొలి డోసు వేయించుకున్నారు.

కరోనాపై పోరులో ప్రపంచానికి భారత్​ నాయకత్వం వహించే స్థాయికి ఎదిగిందన్నారు. ప్రధాని మోదీ నాయకత్వంలో ఇది సాధ్యమైందని పేర్కొన్నారు. ప్రపంచంలోనే భారీ వ్యాక్సినేషన్​ కార్యక్రమం భారత్​లో జరుగుతుందని చెప్పారు.

First voter of the country got the coronavirus vaccine
టీకా వేయించుకున్న జేపీ నడ్డా

భాజపా సీనియర్​ నేత ఎల్​కే అడ్వాణీతో పాటు డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్​ కూడా కరోనా టీకా వేయించుకున్నారు.

First voter of the country got the coronavirus vaccine
ఎయిమ్స్​లో టీకా వేయించుకున్న అడ్వాణీ
First voter of the country got the coronavirus vaccine
టీకా తీసుకున్న స్టాలిన్​

ఇదీ చూడండి: 'కొవాగ్జిన్​ సేఫ్​.. దుష్ప్రభావాలు లేవు'

దేశంలో పలువురు ప్రముఖులు మంగళవారం కరోనా టీకా తీసుకున్నారు. భారత దేశ ప్రథమ ఓటరు శ్యామ్ శరణ్ నేగి.. టీకా తీసుకున్నారు. హిమాచల్​ ప్రదేశ్​లోని కిన్నోర్​ ఆరోగ్య విభాగ వైద్యులు.. నేగిని భుజాలపై తీసుకెళ్లి, టీకా తొలి డోసు వేశారు. వ్యాక్సిన్​ తీసుకోవడంపై సంతోషం వ్యక్తం చేశారు నేగి. ఈ నేపథ్యంలో దేశ ప్రజలందరూ టీకా వేయించుకోవాలని సూచించారు.

First voter of the country got the coronavirus vaccine
కరోనా టీకా అందుకున్న శ్యామ్​ శరణ్​ నేగి

టీకా తీసుకున్న నడ్డా

భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా.. దిల్లీలో కరోనా టీకా తొలి డోసు వేయించుకున్నారు.

కరోనాపై పోరులో ప్రపంచానికి భారత్​ నాయకత్వం వహించే స్థాయికి ఎదిగిందన్నారు. ప్రధాని మోదీ నాయకత్వంలో ఇది సాధ్యమైందని పేర్కొన్నారు. ప్రపంచంలోనే భారీ వ్యాక్సినేషన్​ కార్యక్రమం భారత్​లో జరుగుతుందని చెప్పారు.

First voter of the country got the coronavirus vaccine
టీకా వేయించుకున్న జేపీ నడ్డా

భాజపా సీనియర్​ నేత ఎల్​కే అడ్వాణీతో పాటు డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్​ కూడా కరోనా టీకా వేయించుకున్నారు.

First voter of the country got the coronavirus vaccine
ఎయిమ్స్​లో టీకా వేయించుకున్న అడ్వాణీ
First voter of the country got the coronavirus vaccine
టీకా తీసుకున్న స్టాలిన్​

ఇదీ చూడండి: 'కొవాగ్జిన్​ సేఫ్​.. దుష్ప్రభావాలు లేవు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.