ETV Bharat / bharat

First Post Office In India : అప్పట్లో ఆఖరి పోస్టాఫీస్​.. ఆర్మీ రాకతో ఫస్ట్​

author img

By

Published : Aug 11, 2023, 9:43 AM IST

Updated : Aug 11, 2023, 10:00 AM IST

First Post Office In India : భారత్​కు స్వాతంత్ర్యం రాకముందు నుంచే ఆ పోస్టాఫీస్​లో కార్యకలాపాలు జరుగుతున్నాయి. ఇండియా​-పాక్ సరిహద్దులో ఈ పోస్టాఫీస్ ఉండడం వల్ల ఉత్తరాలు డెలివరీ చేయడం, సేకరించడం పోస్ట్​మన్​లకు కష్టంగా ఉండేది. అయితే దేశ విభజన తర్వాత భారత సైన్యం రాకతో అక్కడి పరిస్థితి మారింది. ఒకప్పుడు దేశంలో చిట్టచివరి పోస్టాఫీస్​గా ఉన్న.. అది ప్రస్తుతం మొట్టమొదటి పోస్టాఫీస్​గా నిలిచింది.

first post office in india
first post office in india

First Post Office In India : ఒకప్పుడు దేశంలో చిట్టచివరి పోస్టాఫీస్‌ అది. అక్కడ ఉత్తరాలు పంపిణీ చేయడం, సేకరించడమూ ప్రమాదకరంగా ఉండేది. కానీ భారత ఆర్మీ రాకతో అక్కడి పరిస్థితి మారిపోయింది. అలాంటి పోస్టాఫీస్‌ ఇప్పుడు కొత్త గుర్తింపును పొందింది. అది భారత సైన్యం వల్లే సాధ్యమైంది. అదే జమ్ముకశ్మీర్‌.. కుప్వారా జిల్లాలోని కిషన్‌గంగా నది ఒడ్డున ఉన్న లైన్‌ ఆఫ్‌ కంట్రోల్‌(ఎల్​ఓసీ)- కెరాన్‌ పోస్టాఫీస్‌. ఆ పోస్టాఫీస్​ పిన్‌ కోడ్‌ నంబర్‌ 193224. ఇంతకీ ఆ పోస్టాఫీస్​కు ఏం గుర్తింపు వచ్చింది? ఆర్మీతో ఏం చేసిందో తెలుసుకుందామా మరి.

ఆర్మీ రాకతో పరిస్థితి మార్పు..
India First Post Office : కెరాన్ పోస్టాఫీస్‌ను దేశంలోని చివరిదిగా భావించేవారని బారాముల్లా డివిజన్ పోస్టాఫీస్ సూపరిండెంట్ అబ్దుల్ హమీద్ కుమార్ తెలిపారు. పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌కు పక్కనే ఉండటం వల్ల ఇక్కడ పరిస్థితులు ఎప్పుడూ ఉద్రిక్తంగా ఉండేవని చెప్పారు. తాము ఉత్తరాలను సరిగ్గా బట్వాడా చేయలేకపోయేవాళ్లమని.. కానీ ఇండియన్ ఆర్మీ రాకతో పరిస్థితి పూర్తిగా మారిపోయిందని అన్నారు. ఇప్పుడు ఎల్‌ఓసీ నుంచి దేశంలోనే మొదటి పోస్టాఫీస్‌గా కెరాన్ పోస్టాఫీసే నిలిచిందని అబ్దుల్ తెలిపారు.

స్వాతంత్ర్యానికి ముందు నుంచే..
ఇండియా-పాకిస్థాన్ విభజనకు ముందు నుంచే కెరాన్ పోస్టాఫీస్​లో కార్యకలాపాలు జరిగేవని స్థానికులు అంటున్నారు. 1965, 1971లో భారత్​-పాక్​ మధ్య ఉద్రిక్తతలు తలెత్తినప్పుడు.. అలాగే 1990లో పాక్‌ మద్దతుతో ఉగ్రవాదులు దాడులు చేసినప్పుడు కూడా ఇక్కడి నుంచి ఉత్తరాల పంపిణీ జరిగిందని చెబుతున్నారు. ప్రస్తుతం కెరాన్ పోస్టాఫీస్​లో ముగ్గురు పోస్ట్‌మన్‌లు ఉన్నారు. ఈ ప్రాంతంలో మొబైల్‌ నెట్‌వర్క్‌ ఉండదు. అందువల్ల డిజిటల్‌ సేవలు ఇక్కడ అందుబాటులో లేవని పోస్ట్‌మాస్టర్‌ షాకిర్‌ భట్‌ తెలిపారు.

"1992లో నేను కెరాన్ పోస్టాఫీస్​లో పోస్ట్‌మన్​గా జాయిన్ అయ్యాను. 1993లో ఈ ప్రాంతంలో సంభవించిన వరదల్లో పోస్టాఫీస్‌ పూర్తిగా కొట్టుకు పోయింది. అప్పటి నుంచి మా ఇంట్లోనే పోస్టాఫీస్​ను ఏర్పాటు చేశాం. ముగ్గురు పోస్ట్‌మన్‌లు స్థానికులతో పాటు, ఈ ప్రాంతంలో విధులు నిర్వహిస్తున్న సైనిక సిబ్బందికి ఉత్తరాలు డెలివరీ చేస్తున్నారు. గతంలో కంటే ఇప్పుడు పరిస్థితులు మెరుగయ్యాయి. ఈ ప్రాంతానికి అప్పుడప్పుడు పర్యటకులు వస్తున్నారు. ఈ పోస్టాఫీస్‌ పర్యటకులను ఆకట్టుకుంటుంది. ఒకప్పుడు చివరి పోస్టాఫీస్‌గా ఉన్నది కాస్తా ఇప్పుడు దేశంలోనే మొదటి పోస్టాఫీస్‌గా మారింది"

--షాకిర్‌ భట్‌, పోస్ట్​మన్​

త్వరలోనే లైన్‌ ఆఫ్‌ కంట్రోల్‌ ప్రాంతంలో ఆప్టికల్‌ ఫైబర్‌ కేబుల్‌ సేవలు అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు కుప్వారా డిప్యూటీ కమిషనర్‌ ఆయుషి సుదాన్‌ వెల్లడించారు. పర్యటకుల కోసం ఈ ప్రాంతంలో క్యాంపింగ్ సైట్‌ కూడా నిర్వహిస్తున్నామని తెలిపారు. ఆర్మీ సాయంతో స్థానికులకు క్యాంపింగ్ సైట్‌లో శిక్షణ ఇచ్చి.. పర్యాటకాన్ని ప్రోత్సహిస్తున్నట్లు ఆయుషి చెప్పారు.

ప్రపంచంలోనే ఎత్తైన పోస్టాఫీస్.. ఇప్పుడు సరికొత్త లుక్​తో...

దేవుడి కోసం పోస్టాఫీస్​.. ఏడాదికి 3 నెలలే ఓపెన్​.. శబరిమల ప్రత్యేకం!

First Post Office In India : ఒకప్పుడు దేశంలో చిట్టచివరి పోస్టాఫీస్‌ అది. అక్కడ ఉత్తరాలు పంపిణీ చేయడం, సేకరించడమూ ప్రమాదకరంగా ఉండేది. కానీ భారత ఆర్మీ రాకతో అక్కడి పరిస్థితి మారిపోయింది. అలాంటి పోస్టాఫీస్‌ ఇప్పుడు కొత్త గుర్తింపును పొందింది. అది భారత సైన్యం వల్లే సాధ్యమైంది. అదే జమ్ముకశ్మీర్‌.. కుప్వారా జిల్లాలోని కిషన్‌గంగా నది ఒడ్డున ఉన్న లైన్‌ ఆఫ్‌ కంట్రోల్‌(ఎల్​ఓసీ)- కెరాన్‌ పోస్టాఫీస్‌. ఆ పోస్టాఫీస్​ పిన్‌ కోడ్‌ నంబర్‌ 193224. ఇంతకీ ఆ పోస్టాఫీస్​కు ఏం గుర్తింపు వచ్చింది? ఆర్మీతో ఏం చేసిందో తెలుసుకుందామా మరి.

ఆర్మీ రాకతో పరిస్థితి మార్పు..
India First Post Office : కెరాన్ పోస్టాఫీస్‌ను దేశంలోని చివరిదిగా భావించేవారని బారాముల్లా డివిజన్ పోస్టాఫీస్ సూపరిండెంట్ అబ్దుల్ హమీద్ కుమార్ తెలిపారు. పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌కు పక్కనే ఉండటం వల్ల ఇక్కడ పరిస్థితులు ఎప్పుడూ ఉద్రిక్తంగా ఉండేవని చెప్పారు. తాము ఉత్తరాలను సరిగ్గా బట్వాడా చేయలేకపోయేవాళ్లమని.. కానీ ఇండియన్ ఆర్మీ రాకతో పరిస్థితి పూర్తిగా మారిపోయిందని అన్నారు. ఇప్పుడు ఎల్‌ఓసీ నుంచి దేశంలోనే మొదటి పోస్టాఫీస్‌గా కెరాన్ పోస్టాఫీసే నిలిచిందని అబ్దుల్ తెలిపారు.

స్వాతంత్ర్యానికి ముందు నుంచే..
ఇండియా-పాకిస్థాన్ విభజనకు ముందు నుంచే కెరాన్ పోస్టాఫీస్​లో కార్యకలాపాలు జరిగేవని స్థానికులు అంటున్నారు. 1965, 1971లో భారత్​-పాక్​ మధ్య ఉద్రిక్తతలు తలెత్తినప్పుడు.. అలాగే 1990లో పాక్‌ మద్దతుతో ఉగ్రవాదులు దాడులు చేసినప్పుడు కూడా ఇక్కడి నుంచి ఉత్తరాల పంపిణీ జరిగిందని చెబుతున్నారు. ప్రస్తుతం కెరాన్ పోస్టాఫీస్​లో ముగ్గురు పోస్ట్‌మన్‌లు ఉన్నారు. ఈ ప్రాంతంలో మొబైల్‌ నెట్‌వర్క్‌ ఉండదు. అందువల్ల డిజిటల్‌ సేవలు ఇక్కడ అందుబాటులో లేవని పోస్ట్‌మాస్టర్‌ షాకిర్‌ భట్‌ తెలిపారు.

"1992లో నేను కెరాన్ పోస్టాఫీస్​లో పోస్ట్‌మన్​గా జాయిన్ అయ్యాను. 1993లో ఈ ప్రాంతంలో సంభవించిన వరదల్లో పోస్టాఫీస్‌ పూర్తిగా కొట్టుకు పోయింది. అప్పటి నుంచి మా ఇంట్లోనే పోస్టాఫీస్​ను ఏర్పాటు చేశాం. ముగ్గురు పోస్ట్‌మన్‌లు స్థానికులతో పాటు, ఈ ప్రాంతంలో విధులు నిర్వహిస్తున్న సైనిక సిబ్బందికి ఉత్తరాలు డెలివరీ చేస్తున్నారు. గతంలో కంటే ఇప్పుడు పరిస్థితులు మెరుగయ్యాయి. ఈ ప్రాంతానికి అప్పుడప్పుడు పర్యటకులు వస్తున్నారు. ఈ పోస్టాఫీస్‌ పర్యటకులను ఆకట్టుకుంటుంది. ఒకప్పుడు చివరి పోస్టాఫీస్‌గా ఉన్నది కాస్తా ఇప్పుడు దేశంలోనే మొదటి పోస్టాఫీస్‌గా మారింది"

--షాకిర్‌ భట్‌, పోస్ట్​మన్​

త్వరలోనే లైన్‌ ఆఫ్‌ కంట్రోల్‌ ప్రాంతంలో ఆప్టికల్‌ ఫైబర్‌ కేబుల్‌ సేవలు అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు కుప్వారా డిప్యూటీ కమిషనర్‌ ఆయుషి సుదాన్‌ వెల్లడించారు. పర్యటకుల కోసం ఈ ప్రాంతంలో క్యాంపింగ్ సైట్‌ కూడా నిర్వహిస్తున్నామని తెలిపారు. ఆర్మీ సాయంతో స్థానికులకు క్యాంపింగ్ సైట్‌లో శిక్షణ ఇచ్చి.. పర్యాటకాన్ని ప్రోత్సహిస్తున్నట్లు ఆయుషి చెప్పారు.

ప్రపంచంలోనే ఎత్తైన పోస్టాఫీస్.. ఇప్పుడు సరికొత్త లుక్​తో...

దేవుడి కోసం పోస్టాఫీస్​.. ఏడాదికి 3 నెలలే ఓపెన్​.. శబరిమల ప్రత్యేకం!

Last Updated : Aug 11, 2023, 10:00 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.