ETV Bharat / bharat

డిప్యూటీ సీఎం కొడుకు కారు ఢీకొని రైతు మృతి

author img

By

Published : Jul 6, 2021, 2:12 PM IST

Updated : Jul 6, 2021, 2:32 PM IST

కర్ణాటక డిప్యూటీ సీఎం కొడుకు కారు ఓ రైతు బైక్​ను ఢీ కొట్టింది. దీంతో తలకు బలమైన గాయాలు తగిలి ఆ రైతు చనిపోయాడు.

Farmer dies after Karnataka Deputy CM's son's car hits bike
రైతు ప్రాణం తీసిన కారు

కర్ణాటక ఉపముఖ్యమంత్రి లక్ష్మణ్​ సవాడి కుమారుడు చిదానంద సవాడీ కారు ఢీకొని కుదలెప్ప బోలి అనే రైతు మరణించారు. ఈ ఘటన బాగల్​కోట్​ జిల్లాలోని హునగుండ తాలూకాలో జరిగింది. సోమవారం సాయంత్రం పొలం నుంచి తిరుగు పయనమైన రైతు బైక్​ను సవాడి కారు ఢీకొట్టింది. దీంతో కుదలెప్పకు తలకు తీవ్రగాయాలయ్యాయి.

Farmer dies after Karnataka Deputy CM's son's car hits bike
రైతు ప్రాణం తీసిన కారు

ఈ క్రమంలో రైతును స్థానిక ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే ఆయన చనిపోయినట్లు వైద్యులు నిర్ధరించారు.

ఘటనా స్థలం నుంచి ఉపముఖ్యమంత్రి కుమారుడు తప్పించుకునే ప్రయత్నం చేసినట్లు స్థానికుల చెప్పారు. డిప్యూటీ సీఎం కొడుకును స్థానికులు అడ్డుకోవడం వల్ల గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో హనుగుండా పోలీసులు అక్కడికి చేరుకొని.. పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. రాజకీయంగా ఇబ్బందులు ఎదురుకాకుండా ఉండేందుకు... ఎవరు గుర్తుపట్టకుండా కారు నెంబర్​ ప్లేట్​ను నిందితుడు ధ్వంసం చేసినట్లు స్థానికులు తెలిపారు. కేసు నమోదు కాకుండా ఉండేలా మృతుని బంధువులను సవాడి బెదిరించారని ఆరోపించారు.

ప్రమాదం జరిగిన సమయంలో కారులో మొత్తం 12 మంది ఉన్నట్లు తెలుస్తోంది. స్నేహితులతో కలిసి పర్యటక ప్రాంతాలకు వెళ్లి వస్తున్నట్లు సవాడి చెప్పారు.

నేను ఎవరినీ బెదిరించలేదు..

మృతుని కుటుంబ సభ్యలను బెదిరించారన్న ఆరోపణలపై చిదానంద సవాడి స్పందిచారు. చనిపోయిన రైతు కుటుంబ సభ్యులను తాను బెదిరించలేదని అన్నారు. ప్రమాదం జరిగిన సమయంలో తాను అసలు కారులోనే లేనని సవాడి చెప్పడం గమనార్హం.

"నేను, నా మిత్రులు కలిసి పర్యాటక ప్రాంతమైన అంజనాద్రి కొండల దగ్గరికి వెళ్లి వస్తున్నాం. నేను నా కారులో లేను. నా మిత్రుల కారులో ఉన్నాను. వారికి మాకు కనీసం 30కిమీ దూరం ఉంటుంది. నా డ్రైవర్​ ఫోన్​ చేసి జరిగిన దాని గురించి చెప్పారు. నేను వెంటనే అంబులెన్స్​కు కాల్​ చేసి.. అతనిని ఆసుపత్రికి తరలించాను. ఆ సమయంలో వారి కుటుంబ సభ్యులు ఎవరూ లేరు. ఆ ప్రమాదం నా వల్ల జరిగింది కాదు. డ్రైవర్​ తప్పిదం."

- చిదానంద సవాడి, కర్ణాటక ఉపముఖ్యమంత్రి కుమారుడు

చనిపోయిన రైతు కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నట్లు చిదానంద సవాడి తెలిపారు.

ఇదీ చూడండి: మిజోరాం గవర్నర్​గా హరిబాబు- దత్తాత్రేయ బదిలీ

కర్ణాటక ఉపముఖ్యమంత్రి లక్ష్మణ్​ సవాడి కుమారుడు చిదానంద సవాడీ కారు ఢీకొని కుదలెప్ప బోలి అనే రైతు మరణించారు. ఈ ఘటన బాగల్​కోట్​ జిల్లాలోని హునగుండ తాలూకాలో జరిగింది. సోమవారం సాయంత్రం పొలం నుంచి తిరుగు పయనమైన రైతు బైక్​ను సవాడి కారు ఢీకొట్టింది. దీంతో కుదలెప్పకు తలకు తీవ్రగాయాలయ్యాయి.

Farmer dies after Karnataka Deputy CM's son's car hits bike
రైతు ప్రాణం తీసిన కారు

ఈ క్రమంలో రైతును స్థానిక ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే ఆయన చనిపోయినట్లు వైద్యులు నిర్ధరించారు.

ఘటనా స్థలం నుంచి ఉపముఖ్యమంత్రి కుమారుడు తప్పించుకునే ప్రయత్నం చేసినట్లు స్థానికుల చెప్పారు. డిప్యూటీ సీఎం కొడుకును స్థానికులు అడ్డుకోవడం వల్ల గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో హనుగుండా పోలీసులు అక్కడికి చేరుకొని.. పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. రాజకీయంగా ఇబ్బందులు ఎదురుకాకుండా ఉండేందుకు... ఎవరు గుర్తుపట్టకుండా కారు నెంబర్​ ప్లేట్​ను నిందితుడు ధ్వంసం చేసినట్లు స్థానికులు తెలిపారు. కేసు నమోదు కాకుండా ఉండేలా మృతుని బంధువులను సవాడి బెదిరించారని ఆరోపించారు.

ప్రమాదం జరిగిన సమయంలో కారులో మొత్తం 12 మంది ఉన్నట్లు తెలుస్తోంది. స్నేహితులతో కలిసి పర్యటక ప్రాంతాలకు వెళ్లి వస్తున్నట్లు సవాడి చెప్పారు.

నేను ఎవరినీ బెదిరించలేదు..

మృతుని కుటుంబ సభ్యలను బెదిరించారన్న ఆరోపణలపై చిదానంద సవాడి స్పందిచారు. చనిపోయిన రైతు కుటుంబ సభ్యులను తాను బెదిరించలేదని అన్నారు. ప్రమాదం జరిగిన సమయంలో తాను అసలు కారులోనే లేనని సవాడి చెప్పడం గమనార్హం.

"నేను, నా మిత్రులు కలిసి పర్యాటక ప్రాంతమైన అంజనాద్రి కొండల దగ్గరికి వెళ్లి వస్తున్నాం. నేను నా కారులో లేను. నా మిత్రుల కారులో ఉన్నాను. వారికి మాకు కనీసం 30కిమీ దూరం ఉంటుంది. నా డ్రైవర్​ ఫోన్​ చేసి జరిగిన దాని గురించి చెప్పారు. నేను వెంటనే అంబులెన్స్​కు కాల్​ చేసి.. అతనిని ఆసుపత్రికి తరలించాను. ఆ సమయంలో వారి కుటుంబ సభ్యులు ఎవరూ లేరు. ఆ ప్రమాదం నా వల్ల జరిగింది కాదు. డ్రైవర్​ తప్పిదం."

- చిదానంద సవాడి, కర్ణాటక ఉపముఖ్యమంత్రి కుమారుడు

చనిపోయిన రైతు కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నట్లు చిదానంద సవాడి తెలిపారు.

ఇదీ చూడండి: మిజోరాం గవర్నర్​గా హరిబాబు- దత్తాత్రేయ బదిలీ

Last Updated : Jul 6, 2021, 2:32 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.