ETV Bharat / bharat

కొవిడ్​ సెంటర్లో నకిలీ రోగులు.. రూ.10 వేలకు ఆశపడి...

author img

By

Published : Nov 17, 2021, 6:25 PM IST

కరోనా వచ్చింది ఒకరికి.. చికిత్స పొందుతున్న వారు మరొకరు. రూ. 10వేలు ఆశచూపి నకిలీ రోగులను పెట్టి అసలువారు చికిత్స పొందకుండా పరారయ్యారు. మహారాష్ట్రలోని ఔరంగాబాద్​లో శుక్రవారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

fake covid patients in hospital
కొవిడ్​ సెంటర్లో నకిలీ పేషెంట్లు.. వైద్యుల కళ్లుగప్పి..

కొవిడ్​ పాజిటివ్​ వచ్చిన ఇద్దరు వ్యక్తులు ఆసుపత్రిలో చేరారు. డాక్టర్లు కూడా చికిత్సను ప్రారంభించారు. కానీ వ్యాధి సోకి ఆసుపత్రిలో చేరిన వారు, చికిత్స పొందుతున్న వారు వేర్వేరు వ్యక్తులు. మూడురోజులు గడిచిన తర్వాత కానీ అక్కడి డాక్టర్లకు ఈ విషయం తెలియలేదు. అసలువారు పరారు కాగా.. వారి స్థానంలో ఈ నకిలీ పేషెంట్లను వచ్చారు. ఈ ఘటన మహారాష్ట్రలోని ఔరంగాబాద్​లో మెల్​ట్రాన్​​​ కొవిడ్​ సెంటర్​లో జరిగింది.

ఇదీ జరిగింది..

సిద్ధార్థ్​, ఉద్యానాథ్​ అనే ఇద్దరు యువకులకు ఇటీవల కరోనా పాజిటివ్​ అని తేలింది. దీంతో వారు శుక్రవారం.. మెల్​ట్రాన్​​ కొవిడ్​ సెంటర్​ను ఆశ్రయించారు. అయితే వీరిలో ఎలాంటి లక్షణాలు లేకపోయినా.. ప్రాథమిక చికిత్స అందించాల్సి ఉంటుందని అక్కడి వైద్యులు యువకులకు స్పష్టం చేశారు. ఇందుకోసం ఆసుపత్రిలో చేరాల్సి ఉంటుందని చెప్పగా అందుకు వారు అంగీకరించారు.

కానీ ఆ యువకులు వారి స్థానంలో మరో ఇద్దరిని ఆసుపత్రిలో చేర్పించి పరారయ్యారు. మరోవైపు ఈ విషయం తెలియని వైద్యులు అసలు వారి స్థానంలో వచ్చిన యువకులకు చికిత్సను ప్రారంభించారు. అయితే ఆ యువకులు ఎలాంటి మందులు తీసుకోలేదు. ఆదివారం.. ఆసుపత్రి హెడ్​ను కలిసి తమను వీలైనంత త్వరగా డిశ్చార్జ్​ చేయాలని విజ్ఞప్తి చేయగా.. అందుకు ఆమె నిరాకరించారు.

మరుసటిరోజు కూడా వారు ఇదే వైఖరి ప్రదర్శించడం వల్ల అనుమానం వ్యక్తం చేసిన వైద్యులు.. యువకులను ప్రశ్నించగా అసలు విషయం బయటపడింది. తాము అసలు పేషెంట్లమే కాదని.. రూ.10వేలు ఇస్తామంటే కరోనా రోగులుగా ఆసుపత్రిలో చేరామని చెప్పుకొచ్చారు. దీనిపై ఆసుపత్రి యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేసింది. సిద్ధార్థ్​, ఉద్యానాథ్​, వారి స్థానంలో ఆసుపత్రిలో చేరిన ఇద్దరు సహా వీరికి సహకరించిన మరో ఇద్దరి పేర్లను ఫిర్యాదులో పేర్కొంది.

ఇదీ చూడండి : దేశంలోనే తొలి 'పాడ్​ హోటల్​' ప్రారంభం.. ఎక్కడంటే?

కొవిడ్​ పాజిటివ్​ వచ్చిన ఇద్దరు వ్యక్తులు ఆసుపత్రిలో చేరారు. డాక్టర్లు కూడా చికిత్సను ప్రారంభించారు. కానీ వ్యాధి సోకి ఆసుపత్రిలో చేరిన వారు, చికిత్స పొందుతున్న వారు వేర్వేరు వ్యక్తులు. మూడురోజులు గడిచిన తర్వాత కానీ అక్కడి డాక్టర్లకు ఈ విషయం తెలియలేదు. అసలువారు పరారు కాగా.. వారి స్థానంలో ఈ నకిలీ పేషెంట్లను వచ్చారు. ఈ ఘటన మహారాష్ట్రలోని ఔరంగాబాద్​లో మెల్​ట్రాన్​​​ కొవిడ్​ సెంటర్​లో జరిగింది.

ఇదీ జరిగింది..

సిద్ధార్థ్​, ఉద్యానాథ్​ అనే ఇద్దరు యువకులకు ఇటీవల కరోనా పాజిటివ్​ అని తేలింది. దీంతో వారు శుక్రవారం.. మెల్​ట్రాన్​​ కొవిడ్​ సెంటర్​ను ఆశ్రయించారు. అయితే వీరిలో ఎలాంటి లక్షణాలు లేకపోయినా.. ప్రాథమిక చికిత్స అందించాల్సి ఉంటుందని అక్కడి వైద్యులు యువకులకు స్పష్టం చేశారు. ఇందుకోసం ఆసుపత్రిలో చేరాల్సి ఉంటుందని చెప్పగా అందుకు వారు అంగీకరించారు.

కానీ ఆ యువకులు వారి స్థానంలో మరో ఇద్దరిని ఆసుపత్రిలో చేర్పించి పరారయ్యారు. మరోవైపు ఈ విషయం తెలియని వైద్యులు అసలు వారి స్థానంలో వచ్చిన యువకులకు చికిత్సను ప్రారంభించారు. అయితే ఆ యువకులు ఎలాంటి మందులు తీసుకోలేదు. ఆదివారం.. ఆసుపత్రి హెడ్​ను కలిసి తమను వీలైనంత త్వరగా డిశ్చార్జ్​ చేయాలని విజ్ఞప్తి చేయగా.. అందుకు ఆమె నిరాకరించారు.

మరుసటిరోజు కూడా వారు ఇదే వైఖరి ప్రదర్శించడం వల్ల అనుమానం వ్యక్తం చేసిన వైద్యులు.. యువకులను ప్రశ్నించగా అసలు విషయం బయటపడింది. తాము అసలు పేషెంట్లమే కాదని.. రూ.10వేలు ఇస్తామంటే కరోనా రోగులుగా ఆసుపత్రిలో చేరామని చెప్పుకొచ్చారు. దీనిపై ఆసుపత్రి యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేసింది. సిద్ధార్థ్​, ఉద్యానాథ్​, వారి స్థానంలో ఆసుపత్రిలో చేరిన ఇద్దరు సహా వీరికి సహకరించిన మరో ఇద్దరి పేర్లను ఫిర్యాదులో పేర్కొంది.

ఇదీ చూడండి : దేశంలోనే తొలి 'పాడ్​ హోటల్​' ప్రారంభం.. ఎక్కడంటే?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.