హిమాచల్ ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శాంత కుమార్ సతీమణి సంతోష్ షెల్జా గుండెపోటుతో మరణించారు. గతంలో కరోనా నుంచి కోలుకున్న ఆమెకు మరోసారి వైరస్ సోకగా డిసెంబర్ 27న ఆసుపత్రిలో చేరారు. శాంతకుమార్ సైతం ఇదే ఆసుపత్రిలో కొవిడ్ చికిత్స పొందుతున్నారు.
కాంగ్రా జిల్లాలోని టండా మెడికల్ కాలేజీలో చికిత్స పొందుతున్న షెల్జాకు మంగళవారం తెల్లవారుజామున గుండెపోటు వచ్చిందని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి.
రెండు రోజుల క్రితమే ప్రధాని నరేంద్ర మోదీ హిమాచల్ ప్రదేశ్ సీఎంకు ఫోన్ చేసి ఆరోగ్యంపై ఆరాతీశారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
ఇదీ చదవండి: 'ఆత్మనిర్భర్ భారత్కు సరకు రవాణా కీలకం'
మరో కేంద్ర మంత్రికి కరోనా..
కేంద్ర ఆరోగ్య మంత్రి అశ్వినీ కుమార్ చౌబేకు కరోనా పాజిటివ్గా తేలింది.
స్వల్ప లక్షణాలు కనిపించగా కరోనా పరీక్ష చేయించుకున్నా. ప్రస్తుతం పూర్తి ఆరోగ్యంగా ఉన్నా. ఇంట్లోనే స్వీయ ఏకాంతంలో గడుపుతున్నా. ఈ మధ్య నన్ను కలిసిన వారందరూ పరీక్షలు చేయించుకోండి.
-చౌబే ట్వీట్