ETV Bharat / bharat

ఎన్నికల వేళ భారీగా బంగారం, నగదు పట్టివేత

author img

By

Published : Mar 25, 2021, 5:48 AM IST

తమిళనాట అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో.. అక్రమంగా తరలిస్తున్న బంగారం, నగదు బయటపడింది. చెన్నై రైల్వేస్టేషన్​లో ఎనిమిది కిలోల పసిడిని రైల్వేశాఖ స్వాధీనం చేసుకుంది. శ్రీరంగం రోడ్డు మార్గంలో చేపట్టిన తనిఖీల్లో.. సరైన లెక్కలు చూపని కారణంగా సుమారు రూ. కోటి నగదు పట్టుబడింది. ఈ రెండు వేర్వేరు ఘటనలపై అధికారులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

Eight Kgs Gold and around Rs. 1crore cash seized by Election Commission in Tamilnadu
ఎన్నికల వేళ 8 కిలోల బంగారం, రూ.కోటి నగదు పట్టివేత

తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. భారీ ఎత్తున బంగారం బయటపడింది. చెన్నై రైల్వే స్టేషన్​లో అక్రమంగా తరలిస్తున్న 8 కిలోల పసిడిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

Eight Kgs Gold seized at Chennai Railway Station
పట్టుబడిన బంగారం

కోయంబత్తూర్​ నుంచి చెన్నై సెంట్రల్​ రైల్వే స్టేషన్​కు చేరుకున్న రైల్లో తనిఖీలు చేపట్టింది రైల్వే భద్రతా సిబ్బంది. ఈ క్రమంలో దిలీప్​ కుమార్​ అనే ప్రయాణికుడి బ్యాగ్​లో 8 కిలోల బంగారాన్ని గుర్తించింది. దిలీప్​ను విచారించగా.. సరైన పత్రాలు చూపలేదు. ఆ పుత్తడిని స్వాధీనం చేసుకొని ఎన్నికల అధికారులకు అప్పగించింది.

ఇదీ చదవండి: తదుపరి సీజేఐగా జస్టిస్ రమణ!

రూ.కోటి నగదు స్వాధీనం

ఆ రాష్ట్రంలోనే మరోచోట సుమారు కోటి రూపాయల నగదు పట్టుబడింది. శ్రీరంగం-పేట్టవైతలై రహదారి మార్గంలో చేపట్టిన తనిఖీల్లో అక్రమంగా తరలిస్తున్న ఈ సొమ్మును.. ఎన్నికల కమిషన్​ స్వాధీనం చేసుకుంది.

నగదు స్వాధీనం చేసుకున్న ఆ వాహనంపై ఓ రాజకీయ పార్టీకి చెందిన జెండా, ఓ అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థికి చెందిన స్టిక్కర్​ ఉన్నట్టు గుర్తించారు అధికారులు. ఆ సమయంలో అందులో నలుగురు వ్యక్తులు ఉన్నట్టు తెలిపిన పోలీసులు.. సంబంధిత సొమ్ముకు వారు ఎలాంటి ఆధారాలూ చూపలేదని చెప్పారు. ఈ కేసును ఆదాయపు పన్ను శాఖకు అప్పగిస్తున్నట్టు వివరించారు.

Rs. 1crore cash seized by Election Commission in Tamilnadu
స్వాధీనం చేసుకున్న సుమారు రూ.కోటి నగదు
Rs. 1crore cash seized by Election Commission in Tamilnadu
నగదు పట్టుబడిన వాహనం

ఇదీ చదవండి: కొవిడ్‌ నీడలో.. 5 రాష్ట్రాల్లో ఎన్నికలకు ఈసీ సన్నద్ధం!

తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. భారీ ఎత్తున బంగారం బయటపడింది. చెన్నై రైల్వే స్టేషన్​లో అక్రమంగా తరలిస్తున్న 8 కిలోల పసిడిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

Eight Kgs Gold seized at Chennai Railway Station
పట్టుబడిన బంగారం

కోయంబత్తూర్​ నుంచి చెన్నై సెంట్రల్​ రైల్వే స్టేషన్​కు చేరుకున్న రైల్లో తనిఖీలు చేపట్టింది రైల్వే భద్రతా సిబ్బంది. ఈ క్రమంలో దిలీప్​ కుమార్​ అనే ప్రయాణికుడి బ్యాగ్​లో 8 కిలోల బంగారాన్ని గుర్తించింది. దిలీప్​ను విచారించగా.. సరైన పత్రాలు చూపలేదు. ఆ పుత్తడిని స్వాధీనం చేసుకొని ఎన్నికల అధికారులకు అప్పగించింది.

ఇదీ చదవండి: తదుపరి సీజేఐగా జస్టిస్ రమణ!

రూ.కోటి నగదు స్వాధీనం

ఆ రాష్ట్రంలోనే మరోచోట సుమారు కోటి రూపాయల నగదు పట్టుబడింది. శ్రీరంగం-పేట్టవైతలై రహదారి మార్గంలో చేపట్టిన తనిఖీల్లో అక్రమంగా తరలిస్తున్న ఈ సొమ్మును.. ఎన్నికల కమిషన్​ స్వాధీనం చేసుకుంది.

నగదు స్వాధీనం చేసుకున్న ఆ వాహనంపై ఓ రాజకీయ పార్టీకి చెందిన జెండా, ఓ అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థికి చెందిన స్టిక్కర్​ ఉన్నట్టు గుర్తించారు అధికారులు. ఆ సమయంలో అందులో నలుగురు వ్యక్తులు ఉన్నట్టు తెలిపిన పోలీసులు.. సంబంధిత సొమ్ముకు వారు ఎలాంటి ఆధారాలూ చూపలేదని చెప్పారు. ఈ కేసును ఆదాయపు పన్ను శాఖకు అప్పగిస్తున్నట్టు వివరించారు.

Rs. 1crore cash seized by Election Commission in Tamilnadu
స్వాధీనం చేసుకున్న సుమారు రూ.కోటి నగదు
Rs. 1crore cash seized by Election Commission in Tamilnadu
నగదు పట్టుబడిన వాహనం

ఇదీ చదవండి: కొవిడ్‌ నీడలో.. 5 రాష్ట్రాల్లో ఎన్నికలకు ఈసీ సన్నద్ధం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.