ETV Bharat / bharat

'మూడు నెలల్లో 500 మెడికల్​ ఆక్సిజన్​ ప్లాంట్లు'

author img

By

Published : Apr 28, 2021, 5:27 PM IST

దేశ వ్యాప్తంగా వచ్చే మూడు నెలల్లో 500 మెడికల్​ ఆక్సిజన్​ ప్లాంట్లు ఏర్పాటు చేయనున్నట్లు రక్షణ మంత్రి రాజ్​నాథ్​సింగ్​ తెలిపారు. వీటిని పీఎం కేర్స్​ సాయంతో డీఆర్​డీఓ ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు.

Defence Minister, rajnath
'మూడు నెలల్లో 500 మెడికల్​ ఆక్సిజన్​ ప్లాంట్లు'

రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ(డీఆర్​డీఓ) వచ్చే మూడు నెలల్లో దేశ వ్యాప్తంగా 500 మెడికల్ ఆక్సిజన్ ప్లాంట్లు ఏర్పాటు చేయనున్నట్లు రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు. పీఎం కేర్స్ ఫండ్ సాయంతో వీటిని నిర్మిస్తున్నట్లు వెల్లడించారు. డీఆర్​డీఓ అభివృద్ధి చేసిన తేలికపాటి యుద్ధ విమానం తేజస్‌లో ఆన్‌బోర్డ్‌ ఆక్సిజన్ ఉత్పత్తికి ఉపయోగించిన సాంకేతికత మెడికల్ ఆక్సిజన్ ప్లాంట్‌ (ఎంఓపీ) దేశ ఆక్సిజన్ అవసరాలు తీర్చడానికి ఉపయోగపడుతున్నట్లు రాజ్‌నాథ్ ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

తాము అభివృద్ధి చేసిన ఎంఓపీ సాంకేతికతను బెంగళూరు టాటా అడ్వాన్స్‌డ్‌ సిస్టమ్స్‌ లిమిటెడ్‌తో పాటు కోయంబత్తూర్‌లోని ట్రైడెంట్ న్యూమాటిక్స్‌కు బదిలీ చేసే ప్రక్రియ కొనసాగుతోందని డీఆర్​డీఓ ఓ ప్రకటనలో తెలిపింది. ఈ రెండు సంస్థలు 380 వరకు ప్లాంట్లు ఏర్పాటు చేస్తాయని వెల్లడించింది. నిమిషానికి 500 లీటర్ల కెపాసిటీతో మరో 120 ప్లాంట్లను డెహ్రాడూన్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ పెట్రోలియం నిర్మించేలా చర్చలు సాగుతున్నట్లు వివరించింది.

నిమిషానికి వెయ్యి లీటర్ల ఆక్సిజన్ ఉత్పత్తి అయ్యేలా ఎంఓపీ సాంకేతికతను డీఆర్‌డీఓ అభివృద్ధి చేసింది. దీని నుంచి 190 మంది రోగులకు కలిపి నిమిషానికి 5 లీటర్ల వేగంతో ప్రాణవాయువు అందించవచ్చు. సిలిండర్ల పరంగా చూస్తే రోజుకు 195 సిలిండర్ల మేర మెడికల్ ఆక్సిజన్ ఉత్పత్తి అవుతుంది.

ఇదీ చూడండి: దుబాయ్, సింగపూర్‌ నుంచి ఆక్సిజన్ కంటైనర్లు

రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ(డీఆర్​డీఓ) వచ్చే మూడు నెలల్లో దేశ వ్యాప్తంగా 500 మెడికల్ ఆక్సిజన్ ప్లాంట్లు ఏర్పాటు చేయనున్నట్లు రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు. పీఎం కేర్స్ ఫండ్ సాయంతో వీటిని నిర్మిస్తున్నట్లు వెల్లడించారు. డీఆర్​డీఓ అభివృద్ధి చేసిన తేలికపాటి యుద్ధ విమానం తేజస్‌లో ఆన్‌బోర్డ్‌ ఆక్సిజన్ ఉత్పత్తికి ఉపయోగించిన సాంకేతికత మెడికల్ ఆక్సిజన్ ప్లాంట్‌ (ఎంఓపీ) దేశ ఆక్సిజన్ అవసరాలు తీర్చడానికి ఉపయోగపడుతున్నట్లు రాజ్‌నాథ్ ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

తాము అభివృద్ధి చేసిన ఎంఓపీ సాంకేతికతను బెంగళూరు టాటా అడ్వాన్స్‌డ్‌ సిస్టమ్స్‌ లిమిటెడ్‌తో పాటు కోయంబత్తూర్‌లోని ట్రైడెంట్ న్యూమాటిక్స్‌కు బదిలీ చేసే ప్రక్రియ కొనసాగుతోందని డీఆర్​డీఓ ఓ ప్రకటనలో తెలిపింది. ఈ రెండు సంస్థలు 380 వరకు ప్లాంట్లు ఏర్పాటు చేస్తాయని వెల్లడించింది. నిమిషానికి 500 లీటర్ల కెపాసిటీతో మరో 120 ప్లాంట్లను డెహ్రాడూన్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ పెట్రోలియం నిర్మించేలా చర్చలు సాగుతున్నట్లు వివరించింది.

నిమిషానికి వెయ్యి లీటర్ల ఆక్సిజన్ ఉత్పత్తి అయ్యేలా ఎంఓపీ సాంకేతికతను డీఆర్‌డీఓ అభివృద్ధి చేసింది. దీని నుంచి 190 మంది రోగులకు కలిపి నిమిషానికి 5 లీటర్ల వేగంతో ప్రాణవాయువు అందించవచ్చు. సిలిండర్ల పరంగా చూస్తే రోజుకు 195 సిలిండర్ల మేర మెడికల్ ఆక్సిజన్ ఉత్పత్తి అవుతుంది.

ఇదీ చూడండి: దుబాయ్, సింగపూర్‌ నుంచి ఆక్సిజన్ కంటైనర్లు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.