ETV Bharat / bharat

కుంభమేళ: గంగానదిలో భక్తుల పుణ్యస్నానాలు

author img

By

Published : Apr 12, 2021, 9:54 AM IST

Updated : Apr 12, 2021, 10:09 AM IST

కుంభమేళలో భాగంగా హరిద్వార్​లోని 'హర్​ కీ పౌరీ' ఘాట్​ వద్ద రెండో షాహీ స్నానాలు చేశారు భక్తులు. కరోనా విజృంభిస్తున్న వేళ పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరవటంపై ఆందోళన వ్యక్తం చేశారు అధికారులు.

Haridwar Kumbh Live Update
షాహి స్నాన్​'లో భౌతిక దూరం కష్టమన్న అధికారులు

కుంభమేళలో భాగంగా ఉత్తరాఖండ్​​ హరిద్వార్​లోని 'హర్​ కీ పౌరీ' ఘాట్ వద్ద రెండో షాహీ స్నానాలు చేశారు భక్తులు. వేల సంఖ్యలో పాల్గొన్నారు. కరోనా విజృంస్తున్న వేళ వేలాది మంది పుణ్యస్నానాలకు హాజరవటంపై ఆందోళన వ్యక్తం చేశారు అధికారులు. భౌతిక దూరం పాటించటం సాధ్యం కాదని కుంభమేళ జనరల్​ ఐజీ సంజయ్​ గుంజ్యాల్​ అన్నారు. భౌతిక దూరం పాటించేందుకు ప్రయత్నిస్తే.. తొక్కిసలాట జరిగే ప్రమాదముందని చెప్పారు.

Haridwar Kumbh Live Update
'షాహి స్నాన్​'లో భారీగా పాల్గొన్న జనం

"కొవిడ్​ నిబంధనలు పాటించాలని భక్తులకు మేము విజ్ఞప్తి చేస్తున్నాము. కానీ భారీ మొత్తంలో జనం హాజరయ్యారు. ఈ నేపథ్యంలో నిబంధనలు అతిక్రమించారని చలానాలు విధించటం కూడా సాధ్యం కాదు. ఘాట్​ల వద్ద భౌతిక దూరం పాటించేలా చేయటం కష్టమైన పని. తప్పని స్థితిలో భౌతిక దూరం పాటించాలని నిబంధనలు విధిస్తే తొక్కిసలాట జరిగే ప్రమాదం ఉంది. ఈ రోజు ఉదయం 7 గంటల వరకే సాధారణ ప్రజలకు అనుమతి ఉంటుంది. ఆ తర్వాత అకాఢాలకే ఈ ప్రాంతాన్ని కేటాయించాము."

-సంజయ్​ గుంజ్యాల్, కుంభమేళ జనరల్​ ఐజీ

మొదటి షాహీ స్నానాలు మార్చి 11న మహాశివరాత్రి సందర్భంగా ముగిశాయి. రెండో షాహీ స్నానాలు ఏప్రిల్​ 12, 14 తేదీల్లో ఆచరిస్తారు.

Importance Of Kumbh Shahi Snan
జనసంద్రంగా నదీ తీరాలు
Importance Of Kumbh Shahi Snan
పుణ్యస్నానాలు ఆచరిస్తున్న భక్తులు

ఉత్తరాఖండ్​లో ఒక్కరోజే 1,333 కరోనా కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం రాష్ట్రంలో 7,323 యాక్టివ్​ కేసులు ఉన్నాయి.

ఇదీ జరిగింది: కరోనా కట్టడిలో ఆ మూడు రాష్ట్రాల్లో లోపాలివే..!

కుంభమేళలో భాగంగా ఉత్తరాఖండ్​​ హరిద్వార్​లోని 'హర్​ కీ పౌరీ' ఘాట్ వద్ద రెండో షాహీ స్నానాలు చేశారు భక్తులు. వేల సంఖ్యలో పాల్గొన్నారు. కరోనా విజృంస్తున్న వేళ వేలాది మంది పుణ్యస్నానాలకు హాజరవటంపై ఆందోళన వ్యక్తం చేశారు అధికారులు. భౌతిక దూరం పాటించటం సాధ్యం కాదని కుంభమేళ జనరల్​ ఐజీ సంజయ్​ గుంజ్యాల్​ అన్నారు. భౌతిక దూరం పాటించేందుకు ప్రయత్నిస్తే.. తొక్కిసలాట జరిగే ప్రమాదముందని చెప్పారు.

Haridwar Kumbh Live Update
'షాహి స్నాన్​'లో భారీగా పాల్గొన్న జనం

"కొవిడ్​ నిబంధనలు పాటించాలని భక్తులకు మేము విజ్ఞప్తి చేస్తున్నాము. కానీ భారీ మొత్తంలో జనం హాజరయ్యారు. ఈ నేపథ్యంలో నిబంధనలు అతిక్రమించారని చలానాలు విధించటం కూడా సాధ్యం కాదు. ఘాట్​ల వద్ద భౌతిక దూరం పాటించేలా చేయటం కష్టమైన పని. తప్పని స్థితిలో భౌతిక దూరం పాటించాలని నిబంధనలు విధిస్తే తొక్కిసలాట జరిగే ప్రమాదం ఉంది. ఈ రోజు ఉదయం 7 గంటల వరకే సాధారణ ప్రజలకు అనుమతి ఉంటుంది. ఆ తర్వాత అకాఢాలకే ఈ ప్రాంతాన్ని కేటాయించాము."

-సంజయ్​ గుంజ్యాల్, కుంభమేళ జనరల్​ ఐజీ

మొదటి షాహీ స్నానాలు మార్చి 11న మహాశివరాత్రి సందర్భంగా ముగిశాయి. రెండో షాహీ స్నానాలు ఏప్రిల్​ 12, 14 తేదీల్లో ఆచరిస్తారు.

Importance Of Kumbh Shahi Snan
జనసంద్రంగా నదీ తీరాలు
Importance Of Kumbh Shahi Snan
పుణ్యస్నానాలు ఆచరిస్తున్న భక్తులు

ఉత్తరాఖండ్​లో ఒక్కరోజే 1,333 కరోనా కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం రాష్ట్రంలో 7,323 యాక్టివ్​ కేసులు ఉన్నాయి.

ఇదీ జరిగింది: కరోనా కట్టడిలో ఆ మూడు రాష్ట్రాల్లో లోపాలివే..!

Last Updated : Apr 12, 2021, 10:09 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.