ETV Bharat / bharat

'ప్రపంచంలోనే తొలి మెగా ఈవెంట్​ ఇదే' - raj nath singh at aero india

ఎన్నో కఠిన పరిస్థితులు ఉన్నప్పటికీ.. ఏరో ఇండియా కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించడంపై హర్షం వ్యక్తం చేశారు రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్​. బెంగళూరులో జరుగుతున్నఈ కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు.

aero india 2021
ప్రపంచంలోనే తొలి మెగా ఈవెంట్​ ఇదే: రాష్ట్రపతి
author img

By

Published : Feb 5, 2021, 4:34 PM IST

కొవిడ్ వల్ల గతేడాది ఎన్నో ప్రతికూల పరిస్థితులు ఎదురైనప్పటికీ.. ఏరో ఇండియా 2021 కార్యక్రమం విజయవంతంగా చేపట్టడంపై రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్​ హర్షం వ్యక్తం చేశారు. 43 దేశాల నుంచి ఉన్నత స్థాయి అధికారులు, 530 సంస్థలు.. ఇందులో పాల్గొన్నాయని చెప్పారు. కర్ణాటక బెంగళూరులో జరుగుతున్న 'ఏరో ఇండియా 2021' కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు.

aero india 2021
రాష్ట్రపతికి స్వాగతం పలుకుతున్న అధికారులు

వర్చువల్​గా ఈ తరహా కార్యక్రమం నిర్వహించడం.. ప్రపంచంలోనే ఇదే మొదటిసారి అని రామ్​నాథ్​ కోవింద్​ పేర్కొన్నారు. ఈ కార్యక్రమం వల్ల వివిధ దేశాల్లోని, సంస్థలతో 201 కొత్త వ్యాపార భాగస్వామ్య ఒప్పందాలు జరిగాయని తెలిపారు.

aero india 2021
ఏరో ఇండియా కార్యక్రమంలో హాజరయ్యేందుకు విచ్చేస్తున్న రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్​

16,000 మంది పాల్గొన్నారు..

ప్రపంచవ్యాప్తంగా కొవిడ్​ నిబంధనలు కొనసాగుతున్నప్పటికీ.. ఏరో ఇండియా 2021 కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించామని రక్షణ మంత్రి రాజ్​నాథ్​ సింగ్​ పేర్కొన్నారు. ప్రత్యక్షంగా ఈ కార్యక్రమంలో 16,000 మంది పాల్గొన్నారని తెలిపారు. 4.5 లక్షలకు పైగా మంది వర్చువల్​గా పాల్గొన్నారని చెప్పారు.

కొవిడ్ వల్ల గతేడాది ఎన్నో ప్రతికూల పరిస్థితులు ఎదురైనప్పటికీ.. ఏరో ఇండియా 2021 కార్యక్రమం విజయవంతంగా చేపట్టడంపై రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్​ హర్షం వ్యక్తం చేశారు. 43 దేశాల నుంచి ఉన్నత స్థాయి అధికారులు, 530 సంస్థలు.. ఇందులో పాల్గొన్నాయని చెప్పారు. కర్ణాటక బెంగళూరులో జరుగుతున్న 'ఏరో ఇండియా 2021' కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు.

aero india 2021
రాష్ట్రపతికి స్వాగతం పలుకుతున్న అధికారులు

వర్చువల్​గా ఈ తరహా కార్యక్రమం నిర్వహించడం.. ప్రపంచంలోనే ఇదే మొదటిసారి అని రామ్​నాథ్​ కోవింద్​ పేర్కొన్నారు. ఈ కార్యక్రమం వల్ల వివిధ దేశాల్లోని, సంస్థలతో 201 కొత్త వ్యాపార భాగస్వామ్య ఒప్పందాలు జరిగాయని తెలిపారు.

aero india 2021
ఏరో ఇండియా కార్యక్రమంలో హాజరయ్యేందుకు విచ్చేస్తున్న రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్​

16,000 మంది పాల్గొన్నారు..

ప్రపంచవ్యాప్తంగా కొవిడ్​ నిబంధనలు కొనసాగుతున్నప్పటికీ.. ఏరో ఇండియా 2021 కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించామని రక్షణ మంత్రి రాజ్​నాథ్​ సింగ్​ పేర్కొన్నారు. ప్రత్యక్షంగా ఈ కార్యక్రమంలో 16,000 మంది పాల్గొన్నారని తెలిపారు. 4.5 లక్షలకు పైగా మంది వర్చువల్​గా పాల్గొన్నారని చెప్పారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.