ETV Bharat / bharat

సీరం టీకా వలంటీర్​ ఆరోపణలపై దర్యాప్తు

author img

By

Published : Nov 29, 2020, 5:08 PM IST

సీరం సంస్థ రూపొందిస్తున్న కొవిషీల్డ్​ టీకా వల్ల తనకు నాడీ సంబంధిత సమస్యలు తలెత్తాయన్న చెన్నై వాసి ఆరోపణలపై డీసీజీఐ దర్యాప్తు మొదలుపెట్టింది. ఆయనకు ఇచ్చిన డోసులో ఏదైనా సమస్య ఉందా? అన్న కోణంలో దర్యాప్తు చేపట్టినట్టు ఐసీఎమ్​ఆర్​ వెల్లడించింది.

dcgi-and-institutional-ethics-committee-investigating-claim-of-adverse-event-in-covid-vaccine-trial-officials
'చెన్నై వలంటీర్​ ఘటనపై డీసీజీఐ దర్యాప్తు'

కొవిషీల్డ్ టీకా తనపై దుష్ప్రభావం చూపించిందని చెన్నైకు చెందిన ఓ వలంటీర్ చేసిన ఆరోపణలపై ఐసీఎమ్​ఆర్​ అధికారులు స్పందించారు. ఆయనకు ఇచ్చిన డోసులో ఏదైనా లోపం ఉందా? అన్న అంశాన్ని ఇన్​స్టిట్యూషనల్​ ఎథిక్స్​ కమిటీతో కలిసి భారత ఔషధ నియంత్రణ సంస్థ(డీసీజీఐ) దర్యాప్తు చేపట్టినట్టు వెల్లడించారు.

"హడావుడి చేసి విచారణకు ఆదేశాలివ్వడం లేదా ఇందులో జోక్యం చేసుకోవడానికి ఇది సరైన సమయం కాదు. ప్రస్తుతానికి ఘటనకు సంబంధించిన విషయాలపై డీసీజీఐ, ఇన్​స్టిట్యూషనల్​ ఎథిక్స్​ కమిటీ దర్యాప్తు చేపట్టింది. కరోనా వ్యాక్సిన్​కు, ఈ ఘటనకు ఏదైనా సంబంధం ఉందా? అనే అంశాన్ని పరిశీలిస్తాయి."

-- డా. సమిరన్​ పాండ, ఐసీఎమ్​ఆర్​.

చెన్నైకు చెందిన 40ఏళ్ల బిజినెస్​ కన్సల్టెంట్​కు అక్టోబర్​ 1న టీకా ఇచ్చారు. అనంతరం తనకు నాడీ సంబంధిత సమస్యలు తలెత్తినట్లు ఆయన పేర్కొన్నారు. కొవిషీల్డ్ టీకా ట్రయల్స్ నిర్వహిస్తోన్న సీరం సంస్థపై రూ. 5కోట్ల దావా వేశారు. ఈ మేరకు టీకా తయారీదారులతో పాటు, నియంత్రణ సంస్థలకు నోటీసులు పంపించారు.

ఇదీ చూడండి:- 'కరోనా టీకా వచ్చినా.. ఆ నిబంధనలు తప్పనిసరి'

కొవిషీల్డ్ టీకా తనపై దుష్ప్రభావం చూపించిందని చెన్నైకు చెందిన ఓ వలంటీర్ చేసిన ఆరోపణలపై ఐసీఎమ్​ఆర్​ అధికారులు స్పందించారు. ఆయనకు ఇచ్చిన డోసులో ఏదైనా లోపం ఉందా? అన్న అంశాన్ని ఇన్​స్టిట్యూషనల్​ ఎథిక్స్​ కమిటీతో కలిసి భారత ఔషధ నియంత్రణ సంస్థ(డీసీజీఐ) దర్యాప్తు చేపట్టినట్టు వెల్లడించారు.

"హడావుడి చేసి విచారణకు ఆదేశాలివ్వడం లేదా ఇందులో జోక్యం చేసుకోవడానికి ఇది సరైన సమయం కాదు. ప్రస్తుతానికి ఘటనకు సంబంధించిన విషయాలపై డీసీజీఐ, ఇన్​స్టిట్యూషనల్​ ఎథిక్స్​ కమిటీ దర్యాప్తు చేపట్టింది. కరోనా వ్యాక్సిన్​కు, ఈ ఘటనకు ఏదైనా సంబంధం ఉందా? అనే అంశాన్ని పరిశీలిస్తాయి."

-- డా. సమిరన్​ పాండ, ఐసీఎమ్​ఆర్​.

చెన్నైకు చెందిన 40ఏళ్ల బిజినెస్​ కన్సల్టెంట్​కు అక్టోబర్​ 1న టీకా ఇచ్చారు. అనంతరం తనకు నాడీ సంబంధిత సమస్యలు తలెత్తినట్లు ఆయన పేర్కొన్నారు. కొవిషీల్డ్ టీకా ట్రయల్స్ నిర్వహిస్తోన్న సీరం సంస్థపై రూ. 5కోట్ల దావా వేశారు. ఈ మేరకు టీకా తయారీదారులతో పాటు, నియంత్రణ సంస్థలకు నోటీసులు పంపించారు.

ఇదీ చూడండి:- 'కరోనా టీకా వచ్చినా.. ఆ నిబంధనలు తప్పనిసరి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.