ETV Bharat / bharat

యూపీలో మరో ఘోరం- ఎస్సీ యువతిపై హత్యాచారం

author img

By

Published : Mar 3, 2021, 11:19 AM IST

ఉత్తర్​ప్రదేశ్​లో ఓ ఎస్సీ యువతిపై గుర్తుతెలియని వ్యక్తి హత్యాచారానికి పాల్పడ్డాడు. గొర్రెలను మేతకు తీసుకెళ్లిన యువతిపై లైంగికదాడి చేసి.. ఆపై గొంతు నులిమి ఉసురు తీశాడు ఓ కిరాతకుడు.

Dalit girl found raped, murdered in Aligarh
యూపీలో మరో దారుణం.. దళిత యువతిపై హత్యాచారం

ఉత్తర్​ప్రదేశ్​ అలీగఢ్​లోని ఓ గ్రామంలో 17ఏళ్ల ఎస్సీ యువతిపై ఓ దుండగుడు హత్యాచారానికి పాల్పడిన ఘటన వెలుగులోకి వచ్చింది. గొర్రెలను మేతకు తీసుకెళ్లిన యువతిని పొలాల్లో ఈడ్చుకెళ్లి.. లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఆపై గొంతునులిమి చంపి, అర్ధనగ్నంగా విడిచి వెళ్లిపోయాడు.

ఇదీ జరిగింది

అలీగఢ్​లోని ఓ గ్రామంలో అమ్మమ్మతో కలిసి నివసిస్తున్న ఆ యువతి.. వృద్ధురాలిని పొలాలకు తీసుకువెళుతుండేది. అయితే ఆదివారం ఉదయం ఆ యువతే గొర్రెలను మేతకు తీసుకెళ్లింది. సూర్యాస్తమయం అయినా ఇంటికి రాలేదు. దీంతో కుటుంబ సభ్యులు వెతకడం ప్రారంభించారు. ఆ రోజు సాయంత్రం దుస్తులు చినిగిపోయి అర్ధ నగ్నంగా గోధుమ చేనులో శవమై కనిపించింది.

సమాచారం అందుకుని ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు.. మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. బాధితురాలిని గొంతు నులిమి చంపినట్లు శవపరీక్షలో తేలిందని అలీగఢ్​ ఎస్​పీ మునిరాజ్​ తెలిపారు. శరీరంపై గాయాలైనట్లు తెలిపిన ఆయన.. ఆమె చర్మంపై గోళ్లుతో రక్కిన్నట్లు ఆనవాలు ఉన్నాయని పేర్కొన్నారు. ఈ ఘటనకు సంబంధించి ఇప్పటివరకు 12 మంది అనుమానితులను ప్రశ్నించినట్లు వెల్లడించారు.

ఈ ఘటనపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి.. నిందితుడి కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

ఇదీ చూడండి: సుత్తితో భార్య, పిల్లలపై దాడి- ముగ్గురు మృతి

ఉత్తర్​ప్రదేశ్​ అలీగఢ్​లోని ఓ గ్రామంలో 17ఏళ్ల ఎస్సీ యువతిపై ఓ దుండగుడు హత్యాచారానికి పాల్పడిన ఘటన వెలుగులోకి వచ్చింది. గొర్రెలను మేతకు తీసుకెళ్లిన యువతిని పొలాల్లో ఈడ్చుకెళ్లి.. లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఆపై గొంతునులిమి చంపి, అర్ధనగ్నంగా విడిచి వెళ్లిపోయాడు.

ఇదీ జరిగింది

అలీగఢ్​లోని ఓ గ్రామంలో అమ్మమ్మతో కలిసి నివసిస్తున్న ఆ యువతి.. వృద్ధురాలిని పొలాలకు తీసుకువెళుతుండేది. అయితే ఆదివారం ఉదయం ఆ యువతే గొర్రెలను మేతకు తీసుకెళ్లింది. సూర్యాస్తమయం అయినా ఇంటికి రాలేదు. దీంతో కుటుంబ సభ్యులు వెతకడం ప్రారంభించారు. ఆ రోజు సాయంత్రం దుస్తులు చినిగిపోయి అర్ధ నగ్నంగా గోధుమ చేనులో శవమై కనిపించింది.

సమాచారం అందుకుని ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు.. మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. బాధితురాలిని గొంతు నులిమి చంపినట్లు శవపరీక్షలో తేలిందని అలీగఢ్​ ఎస్​పీ మునిరాజ్​ తెలిపారు. శరీరంపై గాయాలైనట్లు తెలిపిన ఆయన.. ఆమె చర్మంపై గోళ్లుతో రక్కిన్నట్లు ఆనవాలు ఉన్నాయని పేర్కొన్నారు. ఈ ఘటనకు సంబంధించి ఇప్పటివరకు 12 మంది అనుమానితులను ప్రశ్నించినట్లు వెల్లడించారు.

ఈ ఘటనపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి.. నిందితుడి కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

ఇదీ చూడండి: సుత్తితో భార్య, పిల్లలపై దాడి- ముగ్గురు మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.