ETV Bharat / bharat

కొవిడ్​తో అనాథలుగా 10వేల మంది పిల్లలు.. సుప్రీం కీలక ఆదేశాలు

author img

By

Published : Jan 19, 2022, 8:50 PM IST

Covid compensation: కొవిడ్​ పరిహారం చెల్లింపులో జాప్యంపై సుప్రీం కోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. కరోనా మృతుల కుటుంబాలకు పరిహారం చెల్లించకపోవటంపై ఆంధ్రప్రదేశ్​, బిహార్​ ప్రభుత్వాలకు సమన్లు జారీ చేసింది. కరోనా కారణంగా అనాథలైన 10వేల మంది పిల్లలను చేరదీసి, పరిహారం ఇవ్వాలని స్పష్టం చేసింది.

Covid compensation: కరోనా మహమ్మారి కారణంగా తల్లిదండ్రులను కోల్పోయి అనాథలుగా మారిన 10వేల మంది పిల్లలకు సాయం చేయటంపై కీలక వ్యాఖ్యలు చేసింది సుప్రీం కోర్టు. అనాథలైన పిల్లలను చేరదీసి పరిహారం అందించాలని అన్ని రాష్ట్రాలను ఆదేశించింది. కొవిడ్​-19 మృతుల కుటుంబాలకు రూ.50వేల ఎక్స్​గ్రేషియా పంపిణీ చేయకపోవటంపై అసంతృప్తి వ్యక్తం చేసింది. ఆంధ్రప్రదేశ్​, బిహార్​ ప్రభుత్వాలకు సమన్లు జారీ చేసింది. పరిహారం చెల్లించలేకపోవటంపై వివరణ ఇవ్వాలని ఆయా రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులను ఆదేశించింది.

అలాగే.. ఆంధ్రప్రదేశ్​ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్​ శర్మకు షోకాజ్​ నోటీసులు ఇచ్చింది సుప్రీం కోర్టు. కరోనా పరిహారం పంపిణీపై గతంలో ఇచ్చిన ఆదేశాలను పాటించకపోవటంపై కోర్టు ధిక్కరణ చర్యలు ఎందుకు తీసుకోకూడదో చెప్పాలని స్పష్టం చేసింది.

దేశంలో కరోనా మహమ్మారి ప్రారంభమైనప్పటి నుంచి వైరస్​ సహా ఇతర కారణాలతో 10వేల మంది పిల్లలు అనాథలుగా మారారని, వారికి సాయం చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్​పై విచారణ చేపట్టింది.. జస్టిస్​ ఎంఆర్​ షా, జస్టిస్​ సంజీవ్​ ఖన్నాల ధర్మాసనం.

" బాల్​ స్వరాజ్​ పోర్టల్​లో పొందుపరిచిన డేటా ప్రకారం దేశంలో 10వేల మంది పిల్లలు తమ తల్లిదండ్రులను కోల్పోయారు. పరిహారం కోసం వారు దరఖాస్తు చేసుకోవటం చాలా కష్టమైన పని. అలాంటి చిన్నారులను చేరదీయాలని ఆయా రాష్ట్రాలను ఆదేశిస్తున్నాం. వారికి పరిహారం చెల్లించాలి. రాష్ట్రంలో నమోదైన మరణాలు, బాల్​ స్వరాజ్​ పోర్టల్​లోని వివరాలను రాష్ట్ర లీగల్​ సర్వీసెస్​ అథారిటీకి అందించాలి."

- ధర్మాసనం.

ఈ అంశంపై గురువారం పూర్తిస్థాయి ఆదేశాలను ఇస్తామని పేర్కొంది ధర్మాసనం.

విచారణ సందర్భంగా కేంద్రం తరఫున హాజరైన అదనపు సొలిసిటర్​ జనరల్​ ఐశ్వర్య భటి అందించిన జాబితాను పరిశీలించింది సుప్రీం కోర్టు. చాలా రాష్ట్రాలు దరఖాస్తులను తిరస్కరించాయని ఆమె తెలిపారు. ఉదాహరణగా గుజరాత్​(4,234), మహారాష్ట్ర(49,113), తమిళనాడు(10,138), తెలంగాణ(1,489)లను సూచించారు. అయితే, దరఖాస్తుల తిరస్కరణకు సరైన వివరాలు ఇవ్వకపోవటమే కారణం కావచ్చని పేర్కొంది ధర్మాసనం. అయితే.. దరఖాస్తుదారులకు కారణం తెలియజేస్తూ మరోమారు అవకాశం ఇవ్వాలని ఆదేశించింది. సాంకేతిక సమస్యలతో ఏ ఒక్క దరఖాస్తును తిరస్కరించొద్దని స్పష్టం చేసింది.

మధ్యాహ్న భోజనం తర్వాత.. ఆంధ్రప్రదేశ్​ చీఫ్​ సెక్రటరీ సమీర్​ శర్మ, బిహార్​ చీఫ్​ సెక్రటరీ ఆమిర్​ సుభాని వర్చువల్​గా విచారణకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏపీ తరఫు న్యాయవాది ఆర్​ బసంత్ హాజరై​.. రాష్ట్రంలో 41,292 దరఖాస్తులు వచ్చాయని, అందులో 34,819 అర్హులుగా గుర్తించినట్లు కోర్టుకు తెలిపారు. 6,400 కేసులు తిరస్కరణకు గురికాగా.. 23,835 మందికి పరహారం చెల్లించినట్లు చెప్పారు. ఇంకా 10,984 మందికి ఇవ్వాల్సి ఉందన్నారు. అందులో 5,141 మందికి మూడు రోజుల్లో చెల్లింపులు పూర్తవుతాయని చెప్పారు.

ఇదీ చూడండి: కొవిడ్​ బాధితులకు పరిహారంపై కేంద్రానికి కీలక ఆదేశాలు!

కొవిడ్ పరిహారం చెల్లింపులో జాప్యం.. ఏపీ సీఎస్​కు 'సుప్రీం' సమన్లు

Covid compensation: కరోనా మహమ్మారి కారణంగా తల్లిదండ్రులను కోల్పోయి అనాథలుగా మారిన 10వేల మంది పిల్లలకు సాయం చేయటంపై కీలక వ్యాఖ్యలు చేసింది సుప్రీం కోర్టు. అనాథలైన పిల్లలను చేరదీసి పరిహారం అందించాలని అన్ని రాష్ట్రాలను ఆదేశించింది. కొవిడ్​-19 మృతుల కుటుంబాలకు రూ.50వేల ఎక్స్​గ్రేషియా పంపిణీ చేయకపోవటంపై అసంతృప్తి వ్యక్తం చేసింది. ఆంధ్రప్రదేశ్​, బిహార్​ ప్రభుత్వాలకు సమన్లు జారీ చేసింది. పరిహారం చెల్లించలేకపోవటంపై వివరణ ఇవ్వాలని ఆయా రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులను ఆదేశించింది.

అలాగే.. ఆంధ్రప్రదేశ్​ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్​ శర్మకు షోకాజ్​ నోటీసులు ఇచ్చింది సుప్రీం కోర్టు. కరోనా పరిహారం పంపిణీపై గతంలో ఇచ్చిన ఆదేశాలను పాటించకపోవటంపై కోర్టు ధిక్కరణ చర్యలు ఎందుకు తీసుకోకూడదో చెప్పాలని స్పష్టం చేసింది.

దేశంలో కరోనా మహమ్మారి ప్రారంభమైనప్పటి నుంచి వైరస్​ సహా ఇతర కారణాలతో 10వేల మంది పిల్లలు అనాథలుగా మారారని, వారికి సాయం చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్​పై విచారణ చేపట్టింది.. జస్టిస్​ ఎంఆర్​ షా, జస్టిస్​ సంజీవ్​ ఖన్నాల ధర్మాసనం.

" బాల్​ స్వరాజ్​ పోర్టల్​లో పొందుపరిచిన డేటా ప్రకారం దేశంలో 10వేల మంది పిల్లలు తమ తల్లిదండ్రులను కోల్పోయారు. పరిహారం కోసం వారు దరఖాస్తు చేసుకోవటం చాలా కష్టమైన పని. అలాంటి చిన్నారులను చేరదీయాలని ఆయా రాష్ట్రాలను ఆదేశిస్తున్నాం. వారికి పరిహారం చెల్లించాలి. రాష్ట్రంలో నమోదైన మరణాలు, బాల్​ స్వరాజ్​ పోర్టల్​లోని వివరాలను రాష్ట్ర లీగల్​ సర్వీసెస్​ అథారిటీకి అందించాలి."

- ధర్మాసనం.

ఈ అంశంపై గురువారం పూర్తిస్థాయి ఆదేశాలను ఇస్తామని పేర్కొంది ధర్మాసనం.

విచారణ సందర్భంగా కేంద్రం తరఫున హాజరైన అదనపు సొలిసిటర్​ జనరల్​ ఐశ్వర్య భటి అందించిన జాబితాను పరిశీలించింది సుప్రీం కోర్టు. చాలా రాష్ట్రాలు దరఖాస్తులను తిరస్కరించాయని ఆమె తెలిపారు. ఉదాహరణగా గుజరాత్​(4,234), మహారాష్ట్ర(49,113), తమిళనాడు(10,138), తెలంగాణ(1,489)లను సూచించారు. అయితే, దరఖాస్తుల తిరస్కరణకు సరైన వివరాలు ఇవ్వకపోవటమే కారణం కావచ్చని పేర్కొంది ధర్మాసనం. అయితే.. దరఖాస్తుదారులకు కారణం తెలియజేస్తూ మరోమారు అవకాశం ఇవ్వాలని ఆదేశించింది. సాంకేతిక సమస్యలతో ఏ ఒక్క దరఖాస్తును తిరస్కరించొద్దని స్పష్టం చేసింది.

మధ్యాహ్న భోజనం తర్వాత.. ఆంధ్రప్రదేశ్​ చీఫ్​ సెక్రటరీ సమీర్​ శర్మ, బిహార్​ చీఫ్​ సెక్రటరీ ఆమిర్​ సుభాని వర్చువల్​గా విచారణకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏపీ తరఫు న్యాయవాది ఆర్​ బసంత్ హాజరై​.. రాష్ట్రంలో 41,292 దరఖాస్తులు వచ్చాయని, అందులో 34,819 అర్హులుగా గుర్తించినట్లు కోర్టుకు తెలిపారు. 6,400 కేసులు తిరస్కరణకు గురికాగా.. 23,835 మందికి పరహారం చెల్లించినట్లు చెప్పారు. ఇంకా 10,984 మందికి ఇవ్వాల్సి ఉందన్నారు. అందులో 5,141 మందికి మూడు రోజుల్లో చెల్లింపులు పూర్తవుతాయని చెప్పారు.

ఇదీ చూడండి: కొవిడ్​ బాధితులకు పరిహారంపై కేంద్రానికి కీలక ఆదేశాలు!

కొవిడ్ పరిహారం చెల్లింపులో జాప్యం.. ఏపీ సీఎస్​కు 'సుప్రీం' సమన్లు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.