అత్యవసర వినియోగం కోసం.. ఆక్సిజన్కు సంబంధించిన నిల్వలను ఏర్పాటు చేయాలని కేంద్రానికి సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ బఫర్ స్టాక్కు సంబంధించిన వివరాలను రాష్ట్రాలను అందించాలని స్పష్టం చేసింది. ఫలితంగా సాధారణ సరఫరాకు ఆటంకం కలిగితే తక్షణమే వీటిని ఉపయోగించుకునేందుకు వీలుంటుందని పేర్కొంది.
రానున్న నాలుగు రోజుల్లో ఈ అత్యవసర వినియోగానికి సంబంధించిన ఏర్పాట్లు చేయాలని జస్టిస్ డీవై చంద్రచూద్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం వెల్లడించింది. రాష్ట్రాలకు ప్రస్తుతమున్న ఆక్సిజన్ కేటాయింపులకు అదనంగా ఇది ఉండాలని స్పష్టం చేసింది.
మరోవైపు సోమవారం అర్థరాత్రి నాటికి.. దేశ రాజధాని దిల్లీలో ఆక్సిజన్ కొరత సమస్యను పరిష్కరించాలని కేంద్రానికి ఆదేశించింది త్రిసభ్య ధర్మసనం. కరోనా రెండో దశ నేపథ్యంలో.. ఆసుపత్రుల్లో చేరే వారి కోసం రెండు వారాల్లో జాతీయ విధానాన్ని రూపొందించాలని స్పష్టం చేసింది.
ఇదీ చూడండి:- 'వ్యాక్సిన్ పంపిణీని వెంటనే ప్రారంభించండి'