ETV Bharat / bharat

కరోనా దావాగ్నిలా వ్యాపించింది: సుప్రీంకోర్టు

నిబంధనలు సరిగా పాటించకపోవడం వల్ల దేశంలో కరోనా దావాగ్నిలా వ్యాప్తి చెందిందని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. కరోనా మార్గదర్శకాలపై దాఖలైన పలు పిటిషన్ల విచారణ సందర్భంగా ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది.

author img

By

Published : Dec 18, 2020, 7:33 PM IST

Updated : Dec 18, 2020, 8:41 PM IST

COVID-19 is world war, has spread like wild fire due to lack of implementation of guidelines: SC
కరోనా దావాగ్నిలా వ్యాపించింది: సుప్రీంకోర్టు

కరోనా నియంత్రణ మార్గదర్శకాల అమల్లో లోపాల కారణంగా దేశంలో కొవిడ్‌ దావాగ్నిలా వ్యాపిస్తోందని సర్వోన్నత న్యాయస్థానం ఆందోళన వ్యక్తం చేసింది. కరోనా మార్గదర్శకాలపై దాఖలైన పలు పిటిషన్ల విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. కొవిడ్‌ 19పై ప్రపంచ యుద్ధం జరుగుతోందని, ఈ మహ్మమారి కారణంగా ప్రపంచంలో ప్రతి ఒక్కరూ బాధపడుతున్నారని ఆవేదన వ్యక్తంచేసింది.

కరోనా మార్గదర్శకాలపై దాఖలైన పిటిషన్లపై జస్టిస్‌ అశోక్‌ భూషణ్‌ నేతృత్వంలోని ధర్మాసనం నేడు విచారణ జరిపింది. కేంద్రం తీసుకొచ్చిన మార్గదర్శకాలు, స్టాండర్డ్‌ ఆపరేటింగ్‌ ప్రొసీజర్లు సరిగ్గా అమలవడం లేదని, అందువల్ల దేశంలో కరోనా దావాగ్నిలా వ్యాపిస్తోందని పేర్కొంది. ఈ సందర్భంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు న్యాయస్థానం పలు సూచనలు చేసింది. కరోనా పరిస్థితుల దృష్ట్యా ఆయా ప్రాంతాల్లో లాక్‌డౌన్‌ లేదా కర్ఫ్యూ విధించాలనుకుంటే ఆ నిర్ణయంపై చాలా రోజులు ముందుగానే ప్రకటన చేయాలని సూచించింది. దాంతో ప్రజలు అందుకు అనుగుణంగా సిద్ధమవుతారని తెలిపింది. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ప్రతి రాష్ట్రం అప్రమత్తంగా వ్యవహరించాలని, కేంద్రంతో కలిసి పనిచేయాలని సూచించింది. ప్రజల ఆరోగ్యం, రక్షణకే ప్రథమ ప్రాధాన్యమివ్వాలని తెలిపింది.

అంతేగాక, కరోనా దృష్ట్యా గత ఎనిమిది నెలలుగా వైద్యులు, నర్సులు విరామం లేకుండా పనిచేస్తుండటంతో శారీరకంగా, మానసికంగా ఒత్తిడికి గురవుతున్నారని కోర్టు పేర్కొంది. వారికి తగినంత విశ్రాంతి కల్పించాల్సిన అవసరం ఉందని ధర్మాసనం సూచించింది.

ఇదీ చూడండి: కొవిడ్ ఆస్పత్రుల్లో తనిఖీలకు సుప్రీం ఆదేశాలు

కరోనా నియంత్రణ మార్గదర్శకాల అమల్లో లోపాల కారణంగా దేశంలో కొవిడ్‌ దావాగ్నిలా వ్యాపిస్తోందని సర్వోన్నత న్యాయస్థానం ఆందోళన వ్యక్తం చేసింది. కరోనా మార్గదర్శకాలపై దాఖలైన పలు పిటిషన్ల విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. కొవిడ్‌ 19పై ప్రపంచ యుద్ధం జరుగుతోందని, ఈ మహ్మమారి కారణంగా ప్రపంచంలో ప్రతి ఒక్కరూ బాధపడుతున్నారని ఆవేదన వ్యక్తంచేసింది.

కరోనా మార్గదర్శకాలపై దాఖలైన పిటిషన్లపై జస్టిస్‌ అశోక్‌ భూషణ్‌ నేతృత్వంలోని ధర్మాసనం నేడు విచారణ జరిపింది. కేంద్రం తీసుకొచ్చిన మార్గదర్శకాలు, స్టాండర్డ్‌ ఆపరేటింగ్‌ ప్రొసీజర్లు సరిగ్గా అమలవడం లేదని, అందువల్ల దేశంలో కరోనా దావాగ్నిలా వ్యాపిస్తోందని పేర్కొంది. ఈ సందర్భంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు న్యాయస్థానం పలు సూచనలు చేసింది. కరోనా పరిస్థితుల దృష్ట్యా ఆయా ప్రాంతాల్లో లాక్‌డౌన్‌ లేదా కర్ఫ్యూ విధించాలనుకుంటే ఆ నిర్ణయంపై చాలా రోజులు ముందుగానే ప్రకటన చేయాలని సూచించింది. దాంతో ప్రజలు అందుకు అనుగుణంగా సిద్ధమవుతారని తెలిపింది. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ప్రతి రాష్ట్రం అప్రమత్తంగా వ్యవహరించాలని, కేంద్రంతో కలిసి పనిచేయాలని సూచించింది. ప్రజల ఆరోగ్యం, రక్షణకే ప్రథమ ప్రాధాన్యమివ్వాలని తెలిపింది.

అంతేగాక, కరోనా దృష్ట్యా గత ఎనిమిది నెలలుగా వైద్యులు, నర్సులు విరామం లేకుండా పనిచేస్తుండటంతో శారీరకంగా, మానసికంగా ఒత్తిడికి గురవుతున్నారని కోర్టు పేర్కొంది. వారికి తగినంత విశ్రాంతి కల్పించాల్సిన అవసరం ఉందని ధర్మాసనం సూచించింది.

ఇదీ చూడండి: కొవిడ్ ఆస్పత్రుల్లో తనిఖీలకు సుప్రీం ఆదేశాలు

Last Updated : Dec 18, 2020, 8:41 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.