ETV Bharat / bharat

''అందరికీ న్యాయం'లో అతిపెద్ద అడ్డంకి అదే'

author img

By

Published : Nov 26, 2020, 7:40 PM IST

రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన వేడుకల్లో రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్​ పాల్గొన్నారు. అందరికీ న్యాయం అనే విధానాన్ని అభివృద్ధి చేసే అంశంలో ఖర్చులే అతిపెద్ద అడ్డంకులని అభిప్రాయపడ్డారు.

cost-top-most-hurdle-in-improving-access-to-justice-for-all-says-president-kovind
''అందరికీ న్యాయం'లో అతిపెద్ద అడ్డంకి అదే'

"అందరికీ న్యాయం" విధానాన్ని మెరుగుపరచడంలో అతిపెద్ద అడ్డంకి 'వ్యయం' అని అభిప్రాయపడ్డారు రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్​. అయితే కరోనా సంక్షోభం వంటి పరిస్థితుల్లోను విధులు నిర్వర్తించి దేశ ప్రజలకు న్యాయాన్ని అందించిందని న్యాయవ్యవస్థపై ప్రశంసల వర్షం కురిపించారు.

రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా సుప్రీంకోర్టు నిర్వహించిన వేడుకల్లో పాల్గొన్నారు కోవింద్​. సంక్షోభంలో.. సాంకేతికతను ఉపయోగించుకుని అత్యున్నత న్యాయస్థానం ముందుకు సాగిన తీరు ప్రశంసనీయమన్నారు. తీర్పులను ప్రాంతీయ భాషల్లోనూ అందుబాటులో ఉంచడం తనకు ఎంతో సంతోషానిచ్చిందని వెల్లడించారు. న్యాయస్థానానికి ప్రజలను చేరువ చేసేందుకు ఇది దోహదపడుతుందన్నారు.

ఈ కార్యక్రమంలో భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్​ ఎస్​ఏ బోబ్డే, కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్​ ప్రసాద్ పాల్గొన్నారు.

సంక్షోభ సమయంలో ఇతర దేశాల్లోని అత్యున్నత కోర్టుల కన్నా.. భారత సర్వోన్నత న్యాయస్థానం మెరుగైన ప్రదర్శనను కనబరిచిందని జస్టిస్​ ఎస్​ఏ బోబ్డే వెల్లడించారు.

సుప్రీంకోర్టుపై విమర్శలు చేయడం సరికాదని అభిప్రాయపడ్డారు రవిశంకర్​.

ఇదీ చూడండి:- 'పునరుత్పాదక రంగానికి ప్రోత్సాహకాలు'

"అందరికీ న్యాయం" విధానాన్ని మెరుగుపరచడంలో అతిపెద్ద అడ్డంకి 'వ్యయం' అని అభిప్రాయపడ్డారు రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్​. అయితే కరోనా సంక్షోభం వంటి పరిస్థితుల్లోను విధులు నిర్వర్తించి దేశ ప్రజలకు న్యాయాన్ని అందించిందని న్యాయవ్యవస్థపై ప్రశంసల వర్షం కురిపించారు.

రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా సుప్రీంకోర్టు నిర్వహించిన వేడుకల్లో పాల్గొన్నారు కోవింద్​. సంక్షోభంలో.. సాంకేతికతను ఉపయోగించుకుని అత్యున్నత న్యాయస్థానం ముందుకు సాగిన తీరు ప్రశంసనీయమన్నారు. తీర్పులను ప్రాంతీయ భాషల్లోనూ అందుబాటులో ఉంచడం తనకు ఎంతో సంతోషానిచ్చిందని వెల్లడించారు. న్యాయస్థానానికి ప్రజలను చేరువ చేసేందుకు ఇది దోహదపడుతుందన్నారు.

ఈ కార్యక్రమంలో భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్​ ఎస్​ఏ బోబ్డే, కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్​ ప్రసాద్ పాల్గొన్నారు.

సంక్షోభ సమయంలో ఇతర దేశాల్లోని అత్యున్నత కోర్టుల కన్నా.. భారత సర్వోన్నత న్యాయస్థానం మెరుగైన ప్రదర్శనను కనబరిచిందని జస్టిస్​ ఎస్​ఏ బోబ్డే వెల్లడించారు.

సుప్రీంకోర్టుపై విమర్శలు చేయడం సరికాదని అభిప్రాయపడ్డారు రవిశంకర్​.

ఇదీ చూడండి:- 'పునరుత్పాదక రంగానికి ప్రోత్సాహకాలు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.