ETV Bharat / bharat

'దిల్లీలో హింస బాధాకరం.. కేంద్రానిదే తప్పు'

author img

By

Published : Jan 26, 2021, 9:24 PM IST

కేంద్ర ప్రభుత్వం రైతుల పట్ల పక్షపాతకంగా వ్యవహరించడం వల్లే ట్రాక్టర్ ర్యాలీ హింసాత్మకంగా మారిందని ఆరోపించారు బంగాల్​ సీఎం మమతా బెనర్జీ. దిల్లీలోని దృశ్యాలు తనను కలచివేశాయని ట్విట్టర్​ వేదికగా తెలిపారు. ఈ వ్యవహారంలో ఇతర విపక్ష నేతలు కూడా కేంద్రాన్నే తప్పుబట్టారు.

Centre's insensitive attitude, indifference to be blamed: Mamata on Delhi violence
దిల్లీ హింసకు కేంద్రమే కారణం: మమత

నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దిల్లీలో రైతులు చేపట్టిన ట్రాక్టర్​ ర్యాలీ ఉద్రిక్తంగా మారడంపై బంగాల్​ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రం.. రైతుల పట్ల పక్షపాతంగా వ్యవహరించటమే ఈ హింసకు కారణమన్నారు. రైతు చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ట్వీట్​ చేశారు.

"దిల్లీలోని దృశ్యాలు నన్ను కలచివేశాయి. దీనికి కారణం.. రైతు సోదరులు, సోదరీమణుల పట్ల కేంద్రం పక్షపాతంగా వ్యవహరించటమే. రైతులను సంప్రదించకుండా చట్టాలను చేసింది కేంద్రమే. రైతులు రెండు నెలల నుంచి నిరసనలు చేస్తున్నా పట్టించుకోలేదు. ఈ భయానక చట్టాలను వెంటనే రద్దు చేయాలి."

--మమతా బెనర్జీ , బంగాల్​ సీఎం.

దిల్లీలోని ఉద్రిక్తతలపై ఎన్​సీపీ అధినేత శరద్ పవార్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కేంద్రం రైతులని పట్టించుకోలేదని.. అందుకే ట్రాక్టర్​ ర్యాలీ నిర్వహించారన్నారు.

"రైతులు ఇంత కాలం శాంతియుతంగా నిరసనలు చేశారు. కానీ కేంద్రం పట్టించుకోలేదు. అందుకే రైతులు ట్రాక్టర్ ర్యాలీ నిర్వహించారు. శాంతి భద్రతలను కట్టడి చేయటంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైంది. కేంద్రం రైతుల సమస్యలను పరిష్కరించాలి. ఈ రోజు ఆందోళన సాగిన విధానం చాలా బాధాకరం. రైతులు శాంతియుతంగా గ్రామాలకు వెళ్లండి. మిమ్మల్ని తప్పుబట్టే అవకాశం కేంద్రానికి ఇవ్వకండి."

--- శరద్ పవార్, ఎన్​సీపీ అధినేత.

స్టాలిన్​ ఫైర్..

దిల్లీలో ట్రాక్టర్ ర్యాలీ చేపట్టిన రైతులపై లాఠీ ఛార్జ్​ చేయటాన్ని తీవ్రంగా ఖండించారు డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్​. రైతులతో కేంద్రం జరుపుతున్న చర్చలను.. కేవలం కండితుడుపు చర్యగా అభివర్ణించారు.

బయటి శక్తులే

మంగళవారం జరిగిన ట్రాక్టర్​ ర్యాలీలో రైతులపై కేంద్రం వ్యవహరించిన తీరును తాము తీవ్రంగా ఖండిస్తున్నామని ఆమ్​ ఆద్మీ పార్టీ తెలిపింది. ఈ ఘటనపై కేంద్ర ప్రభుత్వం పశ్చాత్తాప పడాలంది. ర్యాలీలో విధ్వంసాన్ని.. బయటి వ్యక్తులే సృష్టించారన్న విషయం రైతులే తమకు తెలిపారని ఆప్​ వివరించింది.

సాగుచట్టాలకు వ్యతిరేకంగా రైతులు మంగళవారం దిల్లీలో ట్రాక్టర్​ ర్యాలీ నిర్వహించారు. రాజధానిలోని అనేక ప్రాంతాల్లో నిరసనకారులు బీభత్సం సృష్టించారు. భద్రత కోసం పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్లను ధ్వంసం చేశారు. నిబంధనలను పక్కనపెట్టి.. అనుమతులిచ్చిన మార్గాన్ని వీడి ఎర్రకోటవైపు దూసుకెళ్లారు. ఎర్రకోటపై ఓ మతానికి సంబంధించిన జెండాను ఎగురవేశారు. ఈ క్రమంలో దిల్లీవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో ఉద్రిక్తతల వల్ల పోలీసులు, నిరసనకారుల మధ్య ఘర్షణ చెలరేగింది.

ఇదీ చదవండి : దద్దరిల్లిన దిల్లీ- ఎర్రకోటపై 'రైతు' జెండా

ట్రాక్టర్​ ర్యాలీతో రణరంగంగా మారిన దిల్లీ

నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దిల్లీలో రైతులు చేపట్టిన ట్రాక్టర్​ ర్యాలీ ఉద్రిక్తంగా మారడంపై బంగాల్​ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రం.. రైతుల పట్ల పక్షపాతంగా వ్యవహరించటమే ఈ హింసకు కారణమన్నారు. రైతు చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ట్వీట్​ చేశారు.

"దిల్లీలోని దృశ్యాలు నన్ను కలచివేశాయి. దీనికి కారణం.. రైతు సోదరులు, సోదరీమణుల పట్ల కేంద్రం పక్షపాతంగా వ్యవహరించటమే. రైతులను సంప్రదించకుండా చట్టాలను చేసింది కేంద్రమే. రైతులు రెండు నెలల నుంచి నిరసనలు చేస్తున్నా పట్టించుకోలేదు. ఈ భయానక చట్టాలను వెంటనే రద్దు చేయాలి."

--మమతా బెనర్జీ , బంగాల్​ సీఎం.

దిల్లీలోని ఉద్రిక్తతలపై ఎన్​సీపీ అధినేత శరద్ పవార్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కేంద్రం రైతులని పట్టించుకోలేదని.. అందుకే ట్రాక్టర్​ ర్యాలీ నిర్వహించారన్నారు.

"రైతులు ఇంత కాలం శాంతియుతంగా నిరసనలు చేశారు. కానీ కేంద్రం పట్టించుకోలేదు. అందుకే రైతులు ట్రాక్టర్ ర్యాలీ నిర్వహించారు. శాంతి భద్రతలను కట్టడి చేయటంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైంది. కేంద్రం రైతుల సమస్యలను పరిష్కరించాలి. ఈ రోజు ఆందోళన సాగిన విధానం చాలా బాధాకరం. రైతులు శాంతియుతంగా గ్రామాలకు వెళ్లండి. మిమ్మల్ని తప్పుబట్టే అవకాశం కేంద్రానికి ఇవ్వకండి."

--- శరద్ పవార్, ఎన్​సీపీ అధినేత.

స్టాలిన్​ ఫైర్..

దిల్లీలో ట్రాక్టర్ ర్యాలీ చేపట్టిన రైతులపై లాఠీ ఛార్జ్​ చేయటాన్ని తీవ్రంగా ఖండించారు డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్​. రైతులతో కేంద్రం జరుపుతున్న చర్చలను.. కేవలం కండితుడుపు చర్యగా అభివర్ణించారు.

బయటి శక్తులే

మంగళవారం జరిగిన ట్రాక్టర్​ ర్యాలీలో రైతులపై కేంద్రం వ్యవహరించిన తీరును తాము తీవ్రంగా ఖండిస్తున్నామని ఆమ్​ ఆద్మీ పార్టీ తెలిపింది. ఈ ఘటనపై కేంద్ర ప్రభుత్వం పశ్చాత్తాప పడాలంది. ర్యాలీలో విధ్వంసాన్ని.. బయటి వ్యక్తులే సృష్టించారన్న విషయం రైతులే తమకు తెలిపారని ఆప్​ వివరించింది.

సాగుచట్టాలకు వ్యతిరేకంగా రైతులు మంగళవారం దిల్లీలో ట్రాక్టర్​ ర్యాలీ నిర్వహించారు. రాజధానిలోని అనేక ప్రాంతాల్లో నిరసనకారులు బీభత్సం సృష్టించారు. భద్రత కోసం పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్లను ధ్వంసం చేశారు. నిబంధనలను పక్కనపెట్టి.. అనుమతులిచ్చిన మార్గాన్ని వీడి ఎర్రకోటవైపు దూసుకెళ్లారు. ఎర్రకోటపై ఓ మతానికి సంబంధించిన జెండాను ఎగురవేశారు. ఈ క్రమంలో దిల్లీవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో ఉద్రిక్తతల వల్ల పోలీసులు, నిరసనకారుల మధ్య ఘర్షణ చెలరేగింది.

ఇదీ చదవండి : దద్దరిల్లిన దిల్లీ- ఎర్రకోటపై 'రైతు' జెండా

ట్రాక్టర్​ ర్యాలీతో రణరంగంగా మారిన దిల్లీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.