ETV Bharat / bharat

'సరిహద్దులో శాంతి కోసం కేంద్రం ప్రయత్నం'

author img

By

Published : Aug 2, 2021, 4:02 PM IST

అసోం-మిజోరం సరిహద్దు వివాదానికి పరిష్కారాన్ని కనుగొనేందుకు కేంద్రం కృషి చేస్తోందని మిజోరం గవర్నర్​ కంభంపాటి హరిబాబు తెలిపారు. సోమవారం ఆయన ప్రధానమంత్రి నరేంద్రమోదీతో భేటీ అయ్యారు. మరోవైపు.. అసోం భాజపా ఎంపీలు కూడా మోదీతో సమావేశమయ్యారు.

mizoram governor k.haribabu
మిజోరం గవర్నర్ కె.హరిబాబు

అసోం, మిజోరం మధ్య సరిహద్దు ఘర్షణలు నెలకొన్న వేళ.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో మిజోరం గవర్నర్​ కంభంపాటి హరిబాబు సోమవారం సమావేశమయ్యారు. ఈ భేటీ అనంతరం.. సరిహద్దు వివాదంపై పరిష్కారం కనుగొనేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందని హరిబాబు స్పష్టం చేశారు.

"అసోం, మిజోరం మధ్య తలెత్తిన సరిహద్దు ఘర్షణలు.. అత్యంత దురదృష్టకరమైనవి. ఉద్రిక్తతలను తగ్గించేందుకు, ఈ సమస్యకు ఓ పరిష్కారం కనగొనేందుకు కేంద్ర హోం మంత్రి అమిత్​ షా ప్రయత్నిస్తున్నారు. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు శాంతి పునురుద్ధరణకు కట్టుబడి ఉన్నారు."

-హరిబాబు, మిజోరం గవర్నర్​.

మరోవైపు.. కేంద్ర మంత్రి సర్బానంద సోనోవాల్​ సహా అసోంకు చెందిన భాజపా ఎంపీలతోనూ మోదీ సమావేశమయ్యారు.

అసోం-మిజోరం సరిహద్దుల్లో జులై 26న జరిగిన ఘర్షణల్లో ఐదుగురు అసోం పోలీసులు మరణించారు. దీంతో ఇరు రాష్ట్రాల మధ్య ఉద్రిక్త వాతావరణం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలోనే అసోం సీఎం హిమంత, ఆరుగురు అధికారులు సహా మరో 200 మంది వ్యక్తులపై మిజోరం పోలీసులు క్రిమినల్‌ కేసులు నమోదు చేశారు.

ఆయనపై ఎఫ్​ఐఆర్​ వాపస్​కు ఆదేశాలు..

అయితే.. వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన మిజోరం రాజ్యసభ ఎంపీ కె.వన్లాల్​వేనపై నమోదు చేసిన ఎఫ్​ఐఆర్​ను ఉపసంహరించుకోవాలని తాను రాష్ట్ర పోలీసులను ఆదేశించానని అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ సోమవారం తెలిపారు. సహృద్భావంతో తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. అయితే.. మిగతా పోలీసులపై కేసులు కొనసాగుతాయని స్పష్టం చేశారు.

"వివాదాలను స్నేహపూర్వకంగా పరిష్కరించుకోవాలని మిజోరం ముఖ్యమంత్రి జోరమ్​తంగ అన్నారు. ఈశాన్య రాష్ట్రాలు.. ఎల్లప్పుడూ బలంగా ఉండేందుకు అసోం ప్రయత్నిస్తుంది. సరిహద్దుల్లో శాంతి నెలకొల్పేందుకు అసోం ఎల్లప్పడూ కట్టుబడి ఉంటుంది. స్నేహపూర్వక వాతావరణాన్ని పెంపొందించే ఉద్దేశంతో.. ఎంపీ కె.వన్లాల్​వేనాపై నమోదైన ఎఫ్​ఐఆర్​ను ఉపసంహరించుకోవాలని నేను రాష్ట్ర పోలీసులను ఆదేశించాను."

-హిమంత బిశ్వశర్మ, అసోం ముఖ్యమంత్రి.

ఇతర ఈశాన్య రాష్ట్రాలకు చెందిన భాజపా ఎంపీలు కూడా.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీని సోమవారం కలిశారు. ఈ సున్నితమైన అంశాన్ని కాంగ్రెస్​.. రాజకీయం చేస్తోందని వారు ఆరోపించారు. సరిహద్దు ఉద్రిక్తతలకు సంబంధించి చర్యలు తీసుకోవాలని మోదీకి వారు వినతిపత్రాన్ని సమర్పించారు. వివాదాస్పద ప్రకటనలతో విదేశీ శక్తులు.. సరిహద్దు విభేదాలను రెచ్చగొడుతున్నాయని కేంద్ర మంత్రి కిరెణ్ రిజిజు ఆరోపించారు.

మరోవైపు.. హిమంతపై నమోదైన ఎఫ్​ఐఆర్​ను తాము ఉపసంహరిస్తామని మిజోరం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి చువాంగో ఆదివారం తెలిపారు.

ఇవీ చూడండి:

అసోం, మిజోరం మధ్య సరిహద్దు ఘర్షణలు నెలకొన్న వేళ.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో మిజోరం గవర్నర్​ కంభంపాటి హరిబాబు సోమవారం సమావేశమయ్యారు. ఈ భేటీ అనంతరం.. సరిహద్దు వివాదంపై పరిష్కారం కనుగొనేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందని హరిబాబు స్పష్టం చేశారు.

"అసోం, మిజోరం మధ్య తలెత్తిన సరిహద్దు ఘర్షణలు.. అత్యంత దురదృష్టకరమైనవి. ఉద్రిక్తతలను తగ్గించేందుకు, ఈ సమస్యకు ఓ పరిష్కారం కనగొనేందుకు కేంద్ర హోం మంత్రి అమిత్​ షా ప్రయత్నిస్తున్నారు. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు శాంతి పునురుద్ధరణకు కట్టుబడి ఉన్నారు."

-హరిబాబు, మిజోరం గవర్నర్​.

మరోవైపు.. కేంద్ర మంత్రి సర్బానంద సోనోవాల్​ సహా అసోంకు చెందిన భాజపా ఎంపీలతోనూ మోదీ సమావేశమయ్యారు.

అసోం-మిజోరం సరిహద్దుల్లో జులై 26న జరిగిన ఘర్షణల్లో ఐదుగురు అసోం పోలీసులు మరణించారు. దీంతో ఇరు రాష్ట్రాల మధ్య ఉద్రిక్త వాతావరణం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలోనే అసోం సీఎం హిమంత, ఆరుగురు అధికారులు సహా మరో 200 మంది వ్యక్తులపై మిజోరం పోలీసులు క్రిమినల్‌ కేసులు నమోదు చేశారు.

ఆయనపై ఎఫ్​ఐఆర్​ వాపస్​కు ఆదేశాలు..

అయితే.. వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన మిజోరం రాజ్యసభ ఎంపీ కె.వన్లాల్​వేనపై నమోదు చేసిన ఎఫ్​ఐఆర్​ను ఉపసంహరించుకోవాలని తాను రాష్ట్ర పోలీసులను ఆదేశించానని అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ సోమవారం తెలిపారు. సహృద్భావంతో తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. అయితే.. మిగతా పోలీసులపై కేసులు కొనసాగుతాయని స్పష్టం చేశారు.

"వివాదాలను స్నేహపూర్వకంగా పరిష్కరించుకోవాలని మిజోరం ముఖ్యమంత్రి జోరమ్​తంగ అన్నారు. ఈశాన్య రాష్ట్రాలు.. ఎల్లప్పుడూ బలంగా ఉండేందుకు అసోం ప్రయత్నిస్తుంది. సరిహద్దుల్లో శాంతి నెలకొల్పేందుకు అసోం ఎల్లప్పడూ కట్టుబడి ఉంటుంది. స్నేహపూర్వక వాతావరణాన్ని పెంపొందించే ఉద్దేశంతో.. ఎంపీ కె.వన్లాల్​వేనాపై నమోదైన ఎఫ్​ఐఆర్​ను ఉపసంహరించుకోవాలని నేను రాష్ట్ర పోలీసులను ఆదేశించాను."

-హిమంత బిశ్వశర్మ, అసోం ముఖ్యమంత్రి.

ఇతర ఈశాన్య రాష్ట్రాలకు చెందిన భాజపా ఎంపీలు కూడా.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీని సోమవారం కలిశారు. ఈ సున్నితమైన అంశాన్ని కాంగ్రెస్​.. రాజకీయం చేస్తోందని వారు ఆరోపించారు. సరిహద్దు ఉద్రిక్తతలకు సంబంధించి చర్యలు తీసుకోవాలని మోదీకి వారు వినతిపత్రాన్ని సమర్పించారు. వివాదాస్పద ప్రకటనలతో విదేశీ శక్తులు.. సరిహద్దు విభేదాలను రెచ్చగొడుతున్నాయని కేంద్ర మంత్రి కిరెణ్ రిజిజు ఆరోపించారు.

మరోవైపు.. హిమంతపై నమోదైన ఎఫ్​ఐఆర్​ను తాము ఉపసంహరిస్తామని మిజోరం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి చువాంగో ఆదివారం తెలిపారు.

ఇవీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.