ETV Bharat / bharat

'మోదీ పంజాబ్​ సభ'కు సమీపంలో పాకిస్థాన్​​ బోట్​!

author img

By

Published : Jan 8, 2022, 12:06 PM IST

BSF seized pakistan boat: ప్రధాని మోదీ పంజాబ్​లోని ఫిరోజ్​పుర్​ సభకు వెళ్తూ భద్రతా లోపం కారణంగా ఆకస్మికంగా పర్యటన ముగించారు. ఆ ప్రాంతానికి సమీపంలోనే తాజాగా.. పాకిస్థాన్​కు చెందిన ఓ బోట్​ను బీఎస్​ఎఫ్​ సిబ్బంది శనివారం సీజ్​ చేశారు. సభా ప్రాంగణానికి సమీపంలోనే పాక్​ బోట్​ ఉండటం ప్రాధాన్యం సంతరించుకుంది.

BSF seizes Pakistani boat
'మోదీ పంజాబ్​ సభ'కు సమీపంలో పాకిస్థాన్​​ బోట్​

BSF seized pakistan boat: పంజాబ్​, ఫిరోజ్​పుర్​ జిల్లాలోని సరిహద్దు ఔట్​పోస్ట్​కు సమీపంలో వదిలివేసిన ఓ పాకిస్థాన్​ బోట్​ను గుర్తించింది సరిహద్దు భద్రతా దళం. అంతర్జాతీయ సరిహద్దుకు అతి సమీపంలో ఉండటం వల్ల ఫిరోజ్​పుర్​ అత్యంత సున్నితమైన ప్రాంతమని.. గతంలో ఇక్కడ పాకిస్థాన్​ డ్రోన్లు భారత భూభాగంలోకి వచ్చిన సంఘటనలు ఉన్నట్లు పేర్కొంది.

136వ బెటాలియన్​కు చెందిన సిబ్బంది డీటీ మాల్​ బార్డర్​ ఔట్​పోస్ట్​ సమీపంలో పెట్రోలింగ్​ నిర్వహిస్తుండగా.. చెక్క బోటును గుర్తించినట్లు బీఎస్​ఎఫ్​ సీనియర్​ అధికారి ఒకరు తెలిపారు.

" శీతాకాలంలో ఈ ప్రాంతం పూర్తిగా పొగమంచుతో కప్పి ఉంటుంది. చెక్క పడవను గుర్తించిన తర్వాత ఆ ప్రాంతంలో తనిఖీలు చేపట్టాం. అనుమానాస్పదంగా ఎవరైనా కనిపిస్తే వెంటనే సమాచారం అందించాలని గ్రామస్థులను అప్రమత్తం చేశాం. అలాంటి బోట్లు తరుచుగా మత్తు పదార్థలు, ఆయుధాల అక్రమ రవాణాకు ఉపయోగిస్తుంటారు."

- బీఎస్​ఎఫ్​ అధికారి

Modi security breach: పంజాబ్​ పర్యటనలో భాగంగా భద్రతా లోపంతో ఫిరోజ్​పుర్​లోని ఓ వంతెనపై 15-20 నిమిషాలపాటు ప్రధానమంత్రి కాన్వాయ్​ నిలిచిపోయింది. ప్రధాని భద్రత అంశం ప్రస్తుతం సంచలనంగా మారిన క్రమంలో ఆ ప్రాంతానికి సమీపంలోనే పాకిస్థాన్​ బోటును గుర్తించటం ప్రాధాన్యం సంతరించుకుంది.

ఇదీ చూడండి:

BSF seized pakistan boat: పంజాబ్​, ఫిరోజ్​పుర్​ జిల్లాలోని సరిహద్దు ఔట్​పోస్ట్​కు సమీపంలో వదిలివేసిన ఓ పాకిస్థాన్​ బోట్​ను గుర్తించింది సరిహద్దు భద్రతా దళం. అంతర్జాతీయ సరిహద్దుకు అతి సమీపంలో ఉండటం వల్ల ఫిరోజ్​పుర్​ అత్యంత సున్నితమైన ప్రాంతమని.. గతంలో ఇక్కడ పాకిస్థాన్​ డ్రోన్లు భారత భూభాగంలోకి వచ్చిన సంఘటనలు ఉన్నట్లు పేర్కొంది.

136వ బెటాలియన్​కు చెందిన సిబ్బంది డీటీ మాల్​ బార్డర్​ ఔట్​పోస్ట్​ సమీపంలో పెట్రోలింగ్​ నిర్వహిస్తుండగా.. చెక్క బోటును గుర్తించినట్లు బీఎస్​ఎఫ్​ సీనియర్​ అధికారి ఒకరు తెలిపారు.

" శీతాకాలంలో ఈ ప్రాంతం పూర్తిగా పొగమంచుతో కప్పి ఉంటుంది. చెక్క పడవను గుర్తించిన తర్వాత ఆ ప్రాంతంలో తనిఖీలు చేపట్టాం. అనుమానాస్పదంగా ఎవరైనా కనిపిస్తే వెంటనే సమాచారం అందించాలని గ్రామస్థులను అప్రమత్తం చేశాం. అలాంటి బోట్లు తరుచుగా మత్తు పదార్థలు, ఆయుధాల అక్రమ రవాణాకు ఉపయోగిస్తుంటారు."

- బీఎస్​ఎఫ్​ అధికారి

Modi security breach: పంజాబ్​ పర్యటనలో భాగంగా భద్రతా లోపంతో ఫిరోజ్​పుర్​లోని ఓ వంతెనపై 15-20 నిమిషాలపాటు ప్రధానమంత్రి కాన్వాయ్​ నిలిచిపోయింది. ప్రధాని భద్రత అంశం ప్రస్తుతం సంచలనంగా మారిన క్రమంలో ఆ ప్రాంతానికి సమీపంలోనే పాకిస్థాన్​ బోటును గుర్తించటం ప్రాధాన్యం సంతరించుకుంది.

ఇదీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.