ETV Bharat / bharat

breakthrough infection: 'టీకా తీసుకున్న 25శాతం ఆరోగ్య సిబ్బందికి కరోనా'

author img

By

Published : Sep 1, 2021, 6:09 AM IST

రెండు డోసుల కరోనా టీకా తీసుకున్నప్పటికీ వైరస్ (breakthrough infection) ముప్పు పొంచి ఉందని ఓ అధ్యయనంలో తేలింది. అలా​ 25శాతానికి పైగా ఆరోగ్య కార్యకర్తలు కొవిడ్ బారినపడినట్లు పరిశోధకులు వెల్లడించారు.

breakthrough infection
కరోనా టీకా

కరోనా టీకా (covid vaccine) తీసుకున్నప్పటికీ 25శాతానికి పైగా ఆరోగ్య సిబ్బంది వైరస్​ బారినపడుతున్నట్లు (breakthrough infection) ఓ అధ్యయనం వెల్లడించింది. దీనికి కారణం డెల్టా వేరియంట్​ అని అంచనా వేశారు అధ్యయనకర్తలు. ఇన్​స్టిట్యూట్​ ఆఫ్ జీనోమిక్స్​ అండ్ ఇంటిగ్రేటివ్ బయోలజీ (ఐజీఐబీ), మ్యాక్స్​ హాస్పిటల్స్​ సంయుక్తంగా ఈ అధ్యయనాన్ని జరిపాయి.

తీవ్రత తక్కువే..

గతంలో కన్నా డెల్టా విజృంభణ తర్వాత బ్రేక్​త్రూ ఇన్​ఫెక్షన్లు ఎక్కువయ్యాయని అధ్యయనంలో తేలింది. అయితే దాని తీవ్రత చాలా స్వల్పమేనని ఐజీఐబీ శాస్త్రవేత్త శాంతను సేన్​గుప్తా తెలిపారు. "వ్యాధి తీవ్రత తగ్గించేందుకు, మరణాలను నిరోధించేందుకు వ్యాక్సినేషన్ కీలకం. బ్రేక్​త్రూ బారినపడిన ఎక్కువ శాతం మందిలో లక్షణాలు లేవు, కాబట్టి వైరస్​కు అదుపు చేయడానికి మాస్కు ధరించడం తప్పనిసరి" అని సేన్​గుప్తా అన్నారు.

కరోనాబారిన పడకుండా 2 డోసుల టీకా తీసుకున్న 95 మంది ఆరోగ్య కార్యకర్తలపై ఈ అధ్యయనం జరిగింది. వారిలో 25.3శాతం మంది 2 నెలల లోపే వైరస్​ బారిన పడినట్లు అధ్యయనం తెలిపింది.

ఇదీ చూడండి: టీకా తీసుకున్నవారికీ కరోనా- అసలు కారణం ఇదే!

కరోనా టీకా (covid vaccine) తీసుకున్నప్పటికీ 25శాతానికి పైగా ఆరోగ్య సిబ్బంది వైరస్​ బారినపడుతున్నట్లు (breakthrough infection) ఓ అధ్యయనం వెల్లడించింది. దీనికి కారణం డెల్టా వేరియంట్​ అని అంచనా వేశారు అధ్యయనకర్తలు. ఇన్​స్టిట్యూట్​ ఆఫ్ జీనోమిక్స్​ అండ్ ఇంటిగ్రేటివ్ బయోలజీ (ఐజీఐబీ), మ్యాక్స్​ హాస్పిటల్స్​ సంయుక్తంగా ఈ అధ్యయనాన్ని జరిపాయి.

తీవ్రత తక్కువే..

గతంలో కన్నా డెల్టా విజృంభణ తర్వాత బ్రేక్​త్రూ ఇన్​ఫెక్షన్లు ఎక్కువయ్యాయని అధ్యయనంలో తేలింది. అయితే దాని తీవ్రత చాలా స్వల్పమేనని ఐజీఐబీ శాస్త్రవేత్త శాంతను సేన్​గుప్తా తెలిపారు. "వ్యాధి తీవ్రత తగ్గించేందుకు, మరణాలను నిరోధించేందుకు వ్యాక్సినేషన్ కీలకం. బ్రేక్​త్రూ బారినపడిన ఎక్కువ శాతం మందిలో లక్షణాలు లేవు, కాబట్టి వైరస్​కు అదుపు చేయడానికి మాస్కు ధరించడం తప్పనిసరి" అని సేన్​గుప్తా అన్నారు.

కరోనాబారిన పడకుండా 2 డోసుల టీకా తీసుకున్న 95 మంది ఆరోగ్య కార్యకర్తలపై ఈ అధ్యయనం జరిగింది. వారిలో 25.3శాతం మంది 2 నెలల లోపే వైరస్​ బారిన పడినట్లు అధ్యయనం తెలిపింది.

ఇదీ చూడండి: టీకా తీసుకున్నవారికీ కరోనా- అసలు కారణం ఇదే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.