ETV Bharat / bharat

దిల్లీలో మరణిస్తున్న పక్షులు- ప్రభుత్వం ఆంక్షలు

దేశ రాజధానిలో బర్డ్​ ఫ్లూ భయాలు నెలకొన్నాయి. జసోలా పార్క్​లో 24 కాకులు మృతి చెందాయి. సంజయ్​ కొలనులో 10 బాతులు మరణించాయి. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. వాటి నమూనాలకు ల్యాబ్​లకు పంపించారు. ఇతర ప్రాంతాల నుంచి దిల్లీలోకి పక్షులను దిగుమతి చేసుకోవడాన్ని నిషేధిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఘాజీపుర్​ పౌల్ట్రీ మార్కెట్​ను తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు తెలిపింది.

author img

By

Published : Jan 9, 2021, 6:40 PM IST

Bird flu scare: 24 crows found dead in Jasola park, 10 ducks die at Sanjay Lake
దేశ రాజధానిలో బర్డ్​ ఫ్లూ భయాలు- మరణిస్తున్న పక్షులు

దక్షిణ దిల్లీలోని జసోలా జిల్లా పార్క్​లో గత మూడు రోజుల్లో 24 కాకులు మరణించాయని అధికారులు తెలిపారు. సంజయ్​ కొలనులో 10 బాతులు మరణించినట్లు పేర్కొన్నారు. బర్డ్​ ఫ్లూ భయాల నేపథ్యంలో వీటి నమూనాలను సేకరించి పరీక్షల కోసం ల్యాబ్​కు పంపినట్లు వెల్లడించారు. పక్షులు చనిపోవడానికి కారణం బర్డ్​ ఫ్లూనా కాదా అనే విషయం తెలియాల్సి ఉందన్నారు.

ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ముందు జాగ్రత్త చర్యగా దిల్లీలోకి పక్షుల దిగుమతిని నిషేధిస్తున్నట్లు కేజ్రీవాల్ ప్రభుత్వం ప్రకటించింది. ఘాజీపూర్​ పౌల్ట్రీ మార్కెట్​ను తాత్కాలికంగా మూసి వేస్తున్నట్లు తెలిపింది.

దేశ రాజధానిలో గత కొద్ది రోజులుగా పదుల సంఖ్యలో పక్షులు మరణిస్తున్నాయి. అయితే ఇప్పటి వరకు ఒక్క బర్డ్​ ఫ్లూ కేసు కూడా నమోదు కాలేదని అధికారులు తెలిపారు.

కర్ణాటకలో లేదు..

కర్ణాటకలో ఇప్పటివరకు బర్డ్​ ఫ్లూ కేసులు బయటపడలేదని ఆ రాష్ట్ర ఆరోగ్య మంత్రి కే సుధాకర్​ తెలిపారు. పక్షుల నమూనాలపై జరిపిన పరీక్షల్లో నెగిటివ్​గా తేలిందని చెప్పారు. పొరుగు రాష్ట్రం కేరళో బర్డ్​ ఫ్లూ వ్యాప్తి ఉన్న నేపథ్యంలో తాము అప్రమత్తంగా ఉన్నట్లు పేర్కొన్నారు. కేరళతో సరిహద్దు ఉన్న దక్షిణ కన్నడ ప్రాంతంలో 6 కాకులు మరణించాయని, వాటి నమూనాలకు పరీక్షలకు పంపామన్నారు.

గుజరాత్ జునాగడ్​లో శనివారం నాలుగు కాకులు మరణించాయి. ఆ రాష్ట్రంలో శుక్రవారం తొలి బర్డ్ ఫ్లూ కేసును గుర్తించారు అధికారులు. మరణించిన రెండు ల్యాప్​వింగ్స్​ నమూనాలకు పరీక్షించగా బర్డ్​ ఫ్లూ నిర్ధరణ అయినట్లు తెలిపారు. శనివారం మరణించిన కాకుల నమూనాలను భోపాల్​లోని ల్యాబ్​కు పంపించినట్లు పేర్కొన్నారు.​

ఇదీ చూడండి: శ్వేతవర్ణంలో కశ్మీర్​ లోయ- పర్యటకుల సందడి

దక్షిణ దిల్లీలోని జసోలా జిల్లా పార్క్​లో గత మూడు రోజుల్లో 24 కాకులు మరణించాయని అధికారులు తెలిపారు. సంజయ్​ కొలనులో 10 బాతులు మరణించినట్లు పేర్కొన్నారు. బర్డ్​ ఫ్లూ భయాల నేపథ్యంలో వీటి నమూనాలను సేకరించి పరీక్షల కోసం ల్యాబ్​కు పంపినట్లు వెల్లడించారు. పక్షులు చనిపోవడానికి కారణం బర్డ్​ ఫ్లూనా కాదా అనే విషయం తెలియాల్సి ఉందన్నారు.

ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ముందు జాగ్రత్త చర్యగా దిల్లీలోకి పక్షుల దిగుమతిని నిషేధిస్తున్నట్లు కేజ్రీవాల్ ప్రభుత్వం ప్రకటించింది. ఘాజీపూర్​ పౌల్ట్రీ మార్కెట్​ను తాత్కాలికంగా మూసి వేస్తున్నట్లు తెలిపింది.

దేశ రాజధానిలో గత కొద్ది రోజులుగా పదుల సంఖ్యలో పక్షులు మరణిస్తున్నాయి. అయితే ఇప్పటి వరకు ఒక్క బర్డ్​ ఫ్లూ కేసు కూడా నమోదు కాలేదని అధికారులు తెలిపారు.

కర్ణాటకలో లేదు..

కర్ణాటకలో ఇప్పటివరకు బర్డ్​ ఫ్లూ కేసులు బయటపడలేదని ఆ రాష్ట్ర ఆరోగ్య మంత్రి కే సుధాకర్​ తెలిపారు. పక్షుల నమూనాలపై జరిపిన పరీక్షల్లో నెగిటివ్​గా తేలిందని చెప్పారు. పొరుగు రాష్ట్రం కేరళో బర్డ్​ ఫ్లూ వ్యాప్తి ఉన్న నేపథ్యంలో తాము అప్రమత్తంగా ఉన్నట్లు పేర్కొన్నారు. కేరళతో సరిహద్దు ఉన్న దక్షిణ కన్నడ ప్రాంతంలో 6 కాకులు మరణించాయని, వాటి నమూనాలకు పరీక్షలకు పంపామన్నారు.

గుజరాత్ జునాగడ్​లో శనివారం నాలుగు కాకులు మరణించాయి. ఆ రాష్ట్రంలో శుక్రవారం తొలి బర్డ్ ఫ్లూ కేసును గుర్తించారు అధికారులు. మరణించిన రెండు ల్యాప్​వింగ్స్​ నమూనాలకు పరీక్షించగా బర్డ్​ ఫ్లూ నిర్ధరణ అయినట్లు తెలిపారు. శనివారం మరణించిన కాకుల నమూనాలను భోపాల్​లోని ల్యాబ్​కు పంపించినట్లు పేర్కొన్నారు.​

ఇదీ చూడండి: శ్వేతవర్ణంలో కశ్మీర్​ లోయ- పర్యటకుల సందడి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.