ETV Bharat / bharat

4 ఏళ్ల తర్వాత నరసింహ ఆలయం ఓపెన్​ .. పీకల్లోతు నీటిలో వెళ్తేనే దర్శనం..

author img

By

Published : Feb 18, 2022, 1:33 PM IST

Updated : Feb 18, 2022, 7:06 PM IST

BIDAR NARSIMHA TEMPLE: కర్ణాటకలోని ప్రసిద్ధ నరసింహ స్వామి దేవాలయం నాలుగేళ్ల తర్వాత తెరుచుకుంది. సొరంగంలో నీరు ఎక్కువవడం వల్ల ఆలయాన్ని మూసివేశారు ఆధికారులు. స్వామివారిని దర్శించుకోవాలంటే 300 మీటర్ల మేర సొరంగంలో పీకల్లోతు నీళ్లలో వెళ్లాల్సి ఉంటుంది.

bidar
narasimha temple

BIDAR NARSIMHA TEMPLE: కర్ణాటక, బీదర్​ సమీపంలోని మణిచోళ పర్వత శ్రేణుల్లోని గుహలో ఉన్న నరసింహస్వామి ఆలయం నాలుగేళ్ల తర్వాత తెరుచుకుంది. ఈ స్వామివారిని దర్శించుకోవాలంటే 300 మీటర్ల మేర సొరంగంలో పీకల్లోతు నీళ్లలో వెళ్లాల్సి ఉంటుంది. సొరంగంలో నీరు ఎక్కువవడం వల్ల నాలుగేళ్ల క్రితం ఆలయాన్ని మూసివేశారు ఆధికారులు.

ఈ ఆలయం ఎక్కడుంది?

బీదర్ నగరం నుంచి 4.8 కిలోమీటర్ల దూరంలో ఉన్న మణిచోళ కొండ శ్రేణి క్రింద 300 మీటర్ల సొరంగంలో ఈ పురాతన ఆలయం ఉంది. నీరు ఎల్లప్పుడూ ఈ సొరంగం గుండా ప్రవహిస్తుంది. నరసింహుని దర్శనం కోసం భక్తులు నీటిలో నడుచుకుంటూ వెళ్తారు.

devotees
నీటిలో నడిచి వెళ్తున్న భక్తులు

ఉదయం 7 నుంచి రాత్రి 10 వరకు

ఆక్సిజన్​తో పాటు నీరు అధికమవ్వడం కారణంగా గత నాలుగు సంవత్సరాలుగా ఆలయాన్ని మూసివేశారు. రెండేళ్లుగా కరోనా మహమ్మారి విజృంభణ కూడా కారణమైంది.

ఇప్పుడు భక్తుల సౌకర్యార్థం గుహ దేవాలయంలో లైటింగ్​ సిస్టమ్ అమర్చారు. ఉదయం 7 నుంచి రాత్రి 10 గంటలవరకు ఆలయం తెరచి ఉంటుంది. కర్ణాటకలోని వివిధ జిల్లాలు తోపాటు మహారాష్ట్ర, తెలంగాణ, తమిళనాడుతో సహా ఇతర రాష్ట్రాల నుంచి ప్రజలు వచ్చి స్వామి వారిని పూజిస్తుంటారు.

ఇదీ చదవండి: మేడారం మహాజాతర - ప్రత్యక్ష ప్రసారం

BIDAR NARSIMHA TEMPLE: కర్ణాటక, బీదర్​ సమీపంలోని మణిచోళ పర్వత శ్రేణుల్లోని గుహలో ఉన్న నరసింహస్వామి ఆలయం నాలుగేళ్ల తర్వాత తెరుచుకుంది. ఈ స్వామివారిని దర్శించుకోవాలంటే 300 మీటర్ల మేర సొరంగంలో పీకల్లోతు నీళ్లలో వెళ్లాల్సి ఉంటుంది. సొరంగంలో నీరు ఎక్కువవడం వల్ల నాలుగేళ్ల క్రితం ఆలయాన్ని మూసివేశారు ఆధికారులు.

ఈ ఆలయం ఎక్కడుంది?

బీదర్ నగరం నుంచి 4.8 కిలోమీటర్ల దూరంలో ఉన్న మణిచోళ కొండ శ్రేణి క్రింద 300 మీటర్ల సొరంగంలో ఈ పురాతన ఆలయం ఉంది. నీరు ఎల్లప్పుడూ ఈ సొరంగం గుండా ప్రవహిస్తుంది. నరసింహుని దర్శనం కోసం భక్తులు నీటిలో నడుచుకుంటూ వెళ్తారు.

devotees
నీటిలో నడిచి వెళ్తున్న భక్తులు

ఉదయం 7 నుంచి రాత్రి 10 వరకు

ఆక్సిజన్​తో పాటు నీరు అధికమవ్వడం కారణంగా గత నాలుగు సంవత్సరాలుగా ఆలయాన్ని మూసివేశారు. రెండేళ్లుగా కరోనా మహమ్మారి విజృంభణ కూడా కారణమైంది.

ఇప్పుడు భక్తుల సౌకర్యార్థం గుహ దేవాలయంలో లైటింగ్​ సిస్టమ్ అమర్చారు. ఉదయం 7 నుంచి రాత్రి 10 గంటలవరకు ఆలయం తెరచి ఉంటుంది. కర్ణాటకలోని వివిధ జిల్లాలు తోపాటు మహారాష్ట్ర, తెలంగాణ, తమిళనాడుతో సహా ఇతర రాష్ట్రాల నుంచి ప్రజలు వచ్చి స్వామి వారిని పూజిస్తుంటారు.

ఇదీ చదవండి: మేడారం మహాజాతర - ప్రత్యక్ష ప్రసారం

Last Updated : Feb 18, 2022, 7:06 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.