ETV Bharat / bharat

తమిళనాడు: ఐటీ కంపెనీలకూ నీటికొరత సెగ!

తమిళనాడులో నీటి కొరత రాష్ట్ర ప్రజల్ని మరింత ఇబ్బందుల్లోకి నెడుతోంది. నీటి ఎద్దడితో సామాన్య ప్రజానీకంతో పాటు ఐటీ సంస్థలూ విపత్కర పరిస్థితుల్ని ఎదుర్కొంటున్నాయి. శౌచాలయాల్లో నీరు లేక ఉద్యోగుల్ని ఇంటి నుంచే పని చేయాలని కోరుతున్నాయి. అతిథి గృహాలు, హోటళ్లనూ ఈ సమస్య తీవ్రంగా వేధిస్తోంది.

author img

By

Published : Jun 19, 2019, 12:07 PM IST

Updated : Jun 19, 2019, 1:03 PM IST

తమిళనాడు: ఐటీ కంపెనీలకూ నీటికొరత సెగ!
ఉద్యోగుల్ని ఇంటి నుంచే పని చేయాలని కోరుతున్న ఐటీ సంస్థలు

దక్షిణాది రాష్ట్రం తమిళనాడును ప్రస్తుతం వేధిస్తున్న సమస్య నీటి సంక్షోభం. తాగునీటికే కాదు.. ఇతరత్రా ఏ అవసరానికైనా.. వాటర్​ ట్యాంకర్ల కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పటివరకు హోటళ్లు, అతిథి గృహాల వరకే ప్రధానంగా ఉన్న ఈ దుస్థితి ఐటీ సంస్థలనూ తాకింది.

సాధారణ అవసరాల కోసం శౌచాలయాల వినియోగానికి నీరు లేక.. ఇంటి నుంచే పని చేయాలని ఉద్యోగుల్ని కోరుతున్నాయి ప్రముఖ ఐటీ సంస్థలు. వాటర్​ ట్యాంకర్లూ.. సమస్యను పూర్తిగా తీర్చలేకపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి.

శౌచాలయాల వినియోగం కొంతైనా తగ్గించి.. రాష్ట్రాన్ని వేధిస్తున్న నీటి సమస్యను అధిగమించేందుకు ఇలాంటి నిర్ణయాల్ని తీసుకుంటున్నాయి.
మహాబలిపురం రోడ్​లోని.. సిరుసేరి ఐటీ పార్క్​ ఉద్యోగుల్ని పీటీఐ సంప్రదించగా ఈ విషయాలు తెలిశాయి.

పదికి రెండు మాత్రమే వాడుకలో..

నీటి సమస్యతో కంపెనీలో బాత్​రూంల సంఖ్య తగ్గించారని వెల్లడించారో సాఫ్ట్​వేర్​ ఉద్యోగి. ఒక అంతస్తులో 10 శౌచాలయాలుంటే.. నీటి సంక్షోభంతో రెండు మాత్రమే వినియోగానికి ఉంచుతున్నారన్నారు.

తమ రోజు వారీ కార్యకలాపాలు కొనసాగేందుకు వీలుగా.. ఐటీ కంపెనీలు ఎక్కువగా వాటర్​ ట్యాంకర్లనే ఎంచుకోవాల్సి వస్తోందంటేనే సమస్య ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.

అన్ని విధాల ప్రయత్నాలు...

ఈ ప్రధాన సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వమూ అన్ని ప్రత్యామ్నాయాలు పరిశీలిస్తోంది. రాష్ట్ర పురపాలక, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి వేలుమణి ఈ సమస్యపై స్పందించారు.

ఇంటి నుంచే పని.. సాంప్రదాయం ఎప్పటి నుంచో ఉందని పేర్కొన్నారు. వారి అవసరాల నిమిత్తం వేరే మార్గాల ద్వారా నీటి సరఫరా చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. అయితే.. నీటి ఎద్దడి సమస్యతో హోటళ్లు, రెస్టారెంట్లు మూతపడ్డాయన్న నివేదికల్ని ఖండించారు మంత్రి.

నీటిని పొదుపు చేసేందుకు చిన్న, మధ్య తరహా హోటళ్లు ప్లాస్టిక్​ ప్లేట్లకు బదులుగా.. అరటి ఆకులను ఉపయోగిస్తే మంచిదనే పరిష్కారం సూచించారు వేలుమణి.

హోటళ్లు, మాన్షన్లు తాత్కాలిక మూసివేత..

ట్రిప్లికేన్​ ప్రాంతంలో ఇప్పటికే నీటికొరతతో కొన్ని విలాసవంతమైన హోటళ్లు, మాన్షన్లను తాత్కాలికంగా మూసివేశారు. ఐటీ సంస్థలు క్యాంటీన్లనూ మూసివేయాల్సిన పరిస్థితి వచ్చింది.

రాష్ట్రంలో వర్షాలు లేక పలు ప్రాంతాల్లో భూగర్భ జలాలు అడుగంటి పోయాయి. నీటి కోసం చేతిపంపులు, వాటర్​ట్యాంకర్ల వద్ద ప్రజలు గుమికూడుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో తాగునీటి కోసం సుదూర ప్రాంతాలకు తరలి వెళ్తున్నారు. సమస్యను ఎలాగైనా తీర్చాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. నిరసనలతో ధర్నాలు చేస్తున్నారు.

ఇదీ చూడండి:

సంక్షోభం: నీళ్లు లేవ్.. అతిథి గృహాల్లో గదుల్లేవ్​

ఉద్యోగుల్ని ఇంటి నుంచే పని చేయాలని కోరుతున్న ఐటీ సంస్థలు

దక్షిణాది రాష్ట్రం తమిళనాడును ప్రస్తుతం వేధిస్తున్న సమస్య నీటి సంక్షోభం. తాగునీటికే కాదు.. ఇతరత్రా ఏ అవసరానికైనా.. వాటర్​ ట్యాంకర్ల కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పటివరకు హోటళ్లు, అతిథి గృహాల వరకే ప్రధానంగా ఉన్న ఈ దుస్థితి ఐటీ సంస్థలనూ తాకింది.

సాధారణ అవసరాల కోసం శౌచాలయాల వినియోగానికి నీరు లేక.. ఇంటి నుంచే పని చేయాలని ఉద్యోగుల్ని కోరుతున్నాయి ప్రముఖ ఐటీ సంస్థలు. వాటర్​ ట్యాంకర్లూ.. సమస్యను పూర్తిగా తీర్చలేకపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి.

శౌచాలయాల వినియోగం కొంతైనా తగ్గించి.. రాష్ట్రాన్ని వేధిస్తున్న నీటి సమస్యను అధిగమించేందుకు ఇలాంటి నిర్ణయాల్ని తీసుకుంటున్నాయి.
మహాబలిపురం రోడ్​లోని.. సిరుసేరి ఐటీ పార్క్​ ఉద్యోగుల్ని పీటీఐ సంప్రదించగా ఈ విషయాలు తెలిశాయి.

పదికి రెండు మాత్రమే వాడుకలో..

నీటి సమస్యతో కంపెనీలో బాత్​రూంల సంఖ్య తగ్గించారని వెల్లడించారో సాఫ్ట్​వేర్​ ఉద్యోగి. ఒక అంతస్తులో 10 శౌచాలయాలుంటే.. నీటి సంక్షోభంతో రెండు మాత్రమే వినియోగానికి ఉంచుతున్నారన్నారు.

తమ రోజు వారీ కార్యకలాపాలు కొనసాగేందుకు వీలుగా.. ఐటీ కంపెనీలు ఎక్కువగా వాటర్​ ట్యాంకర్లనే ఎంచుకోవాల్సి వస్తోందంటేనే సమస్య ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.

అన్ని విధాల ప్రయత్నాలు...

ఈ ప్రధాన సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వమూ అన్ని ప్రత్యామ్నాయాలు పరిశీలిస్తోంది. రాష్ట్ర పురపాలక, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి వేలుమణి ఈ సమస్యపై స్పందించారు.

ఇంటి నుంచే పని.. సాంప్రదాయం ఎప్పటి నుంచో ఉందని పేర్కొన్నారు. వారి అవసరాల నిమిత్తం వేరే మార్గాల ద్వారా నీటి సరఫరా చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. అయితే.. నీటి ఎద్దడి సమస్యతో హోటళ్లు, రెస్టారెంట్లు మూతపడ్డాయన్న నివేదికల్ని ఖండించారు మంత్రి.

నీటిని పొదుపు చేసేందుకు చిన్న, మధ్య తరహా హోటళ్లు ప్లాస్టిక్​ ప్లేట్లకు బదులుగా.. అరటి ఆకులను ఉపయోగిస్తే మంచిదనే పరిష్కారం సూచించారు వేలుమణి.

హోటళ్లు, మాన్షన్లు తాత్కాలిక మూసివేత..

ట్రిప్లికేన్​ ప్రాంతంలో ఇప్పటికే నీటికొరతతో కొన్ని విలాసవంతమైన హోటళ్లు, మాన్షన్లను తాత్కాలికంగా మూసివేశారు. ఐటీ సంస్థలు క్యాంటీన్లనూ మూసివేయాల్సిన పరిస్థితి వచ్చింది.

రాష్ట్రంలో వర్షాలు లేక పలు ప్రాంతాల్లో భూగర్భ జలాలు అడుగంటి పోయాయి. నీటి కోసం చేతిపంపులు, వాటర్​ట్యాంకర్ల వద్ద ప్రజలు గుమికూడుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో తాగునీటి కోసం సుదూర ప్రాంతాలకు తరలి వెళ్తున్నారు. సమస్యను ఎలాగైనా తీర్చాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. నిరసనలతో ధర్నాలు చేస్తున్నారు.

ఇదీ చూడండి:

సంక్షోభం: నీళ్లు లేవ్.. అతిథి గృహాల్లో గదుల్లేవ్​

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
US NETWORK POOL - AP CLIENTS ONLY
Miami - 18 June 2019
1. US President Donald Trump walks down stairs from Air Force One, supporters chanting "U-S-A!"
2. President Trump greets crowd of supporters on airport tarmac
US NETWORK POOL - AP CLIENTS ONLY
Doral - 18 June 2019
++MUTE FROM SOURCE++
3. Various of Trump motorcade arriving at Trump National Doral golf resort
STORYLINE:
U.S. President Donald Trump greeted supporters at Miami International Airport after he announced his re-election bid at a rally in Orlando, Florida.
He then travelled to the Trump National Doral resort near Miami.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Jun 19, 2019, 1:03 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.