ETV Bharat / bharat

రాజధానిలో పెరిగిన 'మందు' భామలు..!

author img

By

Published : Sep 3, 2019, 8:17 PM IST

Updated : Sep 29, 2019, 8:11 AM IST

దేశ రాజధానిలో మద్యం సేవించే మహిళల సంఖ్య గణనీయంగా పెరుగుతోందని తాజాగా ఓ సర్వేలో తేలింది. దేశంలో మద్యానికి డిమాండ్ పెరగడానికి ఇది కూడా ఓ కారణమని తేల్చింది. ప్రస్తుత తరం మహిళలు విభిన్న జీవన విధానానికి అలవాటు పడుతున్నారని సర్వే పేర్కొంది.

రాజధానిలో పెరిగిన 'మందు' భామలు..!

మద్యం ప్రియులు ఎక్కువగా ఉన్న దేశాల్లో.. భారత్​ ముందు వరుసలో ఉంది. మద్యం సేవించే వారి సంఖ్య దేశంలో అంతకంతకూ పెరిగిపోతోందని 'కమ్యునిటీ ఎగైనెస్ట్​ డ్రంకన్​ డ్రైవింగ్​ (సీఏడీడీ)' సర్వేలో తేలింది. దేశంలో మద్యం సేవించే మహిళల సంఖ్య గణనీయంగా వృద్ధి చెందుతోందని పేర్కొంది.

పెరుగుతున్న సంపద, ఆకాంక్షలు, సామాజిక ఒత్తిడి, విభిన్న జీవనశైలిని కోరుకోవడం వంటి అంశాలు మహిళలను మద్యం వైపు ప్రేరేపిస్తున్నాయని సీఏడీడీ సర్వే తెలిపింది. దేశ రాజధాని దిల్లీలో 18 నుంచి 70 ఏళ్ల మధ్య వయసు గల 5వేల మంది మహిళలపై సర్వే నిర్వహించి ఈ వివరాలను నివేదించింది.

'మద్యం సేవించే మహిళలు పెరిగిపోతున్నారు. మహిళలు మద్యాన్ని ఎక్కువ సేవిస్తున్నారు' అని సర్వే పేర్కొంది.

సంప్రదాయానికి చెల్లు

దశాబ్దాల కాలంగా మహిళలు మద్యానికి దూరంగా ఉన్నారు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో.. వచ్చే ఐదేళ్లలో మద్యం సేవించే మహిళల సంఖ్య 25 శాతం పెరుగుతుందని సర్వే అంచనా వేసింది.

ప్రపంచ ఆరోగ్య సంస్థ గణాంకాల ప్రకారం 2010- 2017 మధ్య కాలంలో మద్యం వినియోగం 38 శాతం వృద్ధి చెందింది. 2005లో సగటున ఒక్కరు.. ఏడాదికి 2.4 లీటర్ల మద్యాన్ని సేవిస్తుండగా... 2016కు 5.7 లీటర్లకు చేరిందని సర్వే ప్రకటించింది.

నిరాశ, ఒంటరితనం, ఆందోళన, బాధ, మానసిక, శారీరక ఒత్తిడిని అధిగమించడానికి మహిళలు మద్యాన్ని ఉపశమన మార్గంగా ఎంచుకుంటున్నారని సర్వే తెలిపింది.

  • 18-30 ఏళ్ల మధ్య మహిళల్లో 43.7 శాతం మంది అలవాటు లేకపోయినా మద్యాన్ని సేవిస్తున్నారు.
  • 31-45 ఏళ్ల మధ్య మహిళల్లో 41.7 శాతం మంది వృత్తిని బట్టి మద్యానికి అలవాటు పడుతున్నారు.
  • 60 ఏళ్లకు పైబడిన 53 శాతం మంది, 46-60 ఏళ్ల మధ్య మహిళలు భావోద్వేగాల కారణంగా మద్యం సేవిస్తున్నారు.

మహిళలు వారానికి 8 నుంచి 10కి మించి డ్రింక్స్ సేవిస్తే హానికరం కాదని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. రోజుకు రెండు డ్రింక్స్​కి మించి తాగడం మంచిది కాదని పేర్కొంది. గర్భవతిగా ఉన్న మహిళలు మద్యానికి దూరంగా ఉండాలని సూచించింది.

ఇదీ చూడండి: గొలుసు దొంగకు బడిత పూజ చేయించిన మహిళ..!

మద్యం ప్రియులు ఎక్కువగా ఉన్న దేశాల్లో.. భారత్​ ముందు వరుసలో ఉంది. మద్యం సేవించే వారి సంఖ్య దేశంలో అంతకంతకూ పెరిగిపోతోందని 'కమ్యునిటీ ఎగైనెస్ట్​ డ్రంకన్​ డ్రైవింగ్​ (సీఏడీడీ)' సర్వేలో తేలింది. దేశంలో మద్యం సేవించే మహిళల సంఖ్య గణనీయంగా వృద్ధి చెందుతోందని పేర్కొంది.

పెరుగుతున్న సంపద, ఆకాంక్షలు, సామాజిక ఒత్తిడి, విభిన్న జీవనశైలిని కోరుకోవడం వంటి అంశాలు మహిళలను మద్యం వైపు ప్రేరేపిస్తున్నాయని సీఏడీడీ సర్వే తెలిపింది. దేశ రాజధాని దిల్లీలో 18 నుంచి 70 ఏళ్ల మధ్య వయసు గల 5వేల మంది మహిళలపై సర్వే నిర్వహించి ఈ వివరాలను నివేదించింది.

'మద్యం సేవించే మహిళలు పెరిగిపోతున్నారు. మహిళలు మద్యాన్ని ఎక్కువ సేవిస్తున్నారు' అని సర్వే పేర్కొంది.

సంప్రదాయానికి చెల్లు

దశాబ్దాల కాలంగా మహిళలు మద్యానికి దూరంగా ఉన్నారు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో.. వచ్చే ఐదేళ్లలో మద్యం సేవించే మహిళల సంఖ్య 25 శాతం పెరుగుతుందని సర్వే అంచనా వేసింది.

ప్రపంచ ఆరోగ్య సంస్థ గణాంకాల ప్రకారం 2010- 2017 మధ్య కాలంలో మద్యం వినియోగం 38 శాతం వృద్ధి చెందింది. 2005లో సగటున ఒక్కరు.. ఏడాదికి 2.4 లీటర్ల మద్యాన్ని సేవిస్తుండగా... 2016కు 5.7 లీటర్లకు చేరిందని సర్వే ప్రకటించింది.

నిరాశ, ఒంటరితనం, ఆందోళన, బాధ, మానసిక, శారీరక ఒత్తిడిని అధిగమించడానికి మహిళలు మద్యాన్ని ఉపశమన మార్గంగా ఎంచుకుంటున్నారని సర్వే తెలిపింది.

  • 18-30 ఏళ్ల మధ్య మహిళల్లో 43.7 శాతం మంది అలవాటు లేకపోయినా మద్యాన్ని సేవిస్తున్నారు.
  • 31-45 ఏళ్ల మధ్య మహిళల్లో 41.7 శాతం మంది వృత్తిని బట్టి మద్యానికి అలవాటు పడుతున్నారు.
  • 60 ఏళ్లకు పైబడిన 53 శాతం మంది, 46-60 ఏళ్ల మధ్య మహిళలు భావోద్వేగాల కారణంగా మద్యం సేవిస్తున్నారు.

మహిళలు వారానికి 8 నుంచి 10కి మించి డ్రింక్స్ సేవిస్తే హానికరం కాదని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. రోజుకు రెండు డ్రింక్స్​కి మించి తాగడం మంచిది కాదని పేర్కొంది. గర్భవతిగా ఉన్న మహిళలు మద్యానికి దూరంగా ఉండాలని సూచించింది.

ఇదీ చూడండి: గొలుసు దొంగకు బడిత పూజ చేయించిన మహిళ..!

Pathankot (Punjab), Sep 03 (ANI): Public Relations Officer of IAF, Anupam Banerjee on the induction of Apache attack helicopters said we had attack helicopters earlier, but this aircraft brings in lethal firepower with great accuracy. Anupam Banerjee said, "It's a ceremonial induction of the aircraft into IAF. As of now, we've 8 aircraft. 22 aircraft will come in phased manner and all will be inducted into IAF. We had attack helicopters earlier, but this aircraft brings in lethal firepower with great accuracy." Indian Air Force's advanced Apache AH-64E chopper is set to be inducted at Pathankot Air Base on September 3. The multi-role combat Apache helicopters are used by the US Army. Indian Air Force had signed contract with Boeing Ltd for 22 helicopters in 2015. Induction of Apache choppers will boost combat capabilities of Indian armed forces.

Last Updated : Sep 29, 2019, 8:11 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.