ETV Bharat / bharat

200 రాకపోతే తప్పుకుంటారా?: ప్రశాంత్​ సవాల్

author img

By

Published : Dec 22, 2020, 3:20 PM IST

భాజపా నాయకులకు మరో సవాల్ విసిరారు ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్​. బంగాల్​ అసెంబ్లీ ఎన్నికల్లో 200 సీట్లు రాకపోతే ఆ పార్టీ నేతలు పదవుల నుంచి తప్పుకుంటారా? అని ఛాలెంజ్​ చేశారు.

Will BJP leaders quit if party fails to get 200 seats in Bengal, asks Prashant Kishor
'200 సీట్లు రాకపోతే భాజపా నాయకులు తప్పుకుంటారా?'

వచ్చే ఏడాది జరిగే బంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా రెండు అంకెల సీట్లు కూడా దాటదని జోస్యం చెప్పిన మరునాడే.. ఆ పార్టీ నేతలకు మరో సవాల్ విసిరారు ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్​. ఎన్నికల్లో 200 సీట్లు గెలుస్తామని చెబుతున్న కాషాయ దళ నాయకులు.. అలా జరగకపోతే పదవుల నుంచి తప్పుకుంటారా? అని ఛాలెంజ్​ చేశారు.

బంగాల్​లో ఈసారి 200 సీట్లకుపై స్థానాలు కైవసం చేసుకుని అధికారంలోకి వస్తామని అమిత్​ షా సహా భాజపా నాయకులు చెబుతున్నారు. ఆ పార్టీ రెండంకెలు దాటి 100 సీట్లు గెలిస్తే ట్విట్టర్​ నుంచి తప్పుకుంటానని సోమవారమే ప్రకటించారు ప్రశాంత్ కిశోర్​. ప్రస్తుతం ఆయన మమతా బెనర్జీ సారథ్యంలోని టీఎంసీకి ఎన్నికల వ్యూహకర్తగా వ్యవహరిస్తున్నారు. 2014లో ప్రధాని నరేంద్ర మోదీ అధికారంలోకి రావడానికి ఆయనే కీలక సూత్రధారి.

బంగాల్​ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం దేశం ఓ ఎన్నికల వ్యూహకర్తను కోల్పోతుందని భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి కైలాశ్ విజయ​వర్గీయ అన్నారు. ప్రశాంత్​ వ్యాఖ్యలకు స్పందనగా ఈ ట్వీట్ చేశారు.

ఇదీ చూడండి: '200 స్థానాలు గెలుస్తాం.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం'

వచ్చే ఏడాది జరిగే బంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా రెండు అంకెల సీట్లు కూడా దాటదని జోస్యం చెప్పిన మరునాడే.. ఆ పార్టీ నేతలకు మరో సవాల్ విసిరారు ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్​. ఎన్నికల్లో 200 సీట్లు గెలుస్తామని చెబుతున్న కాషాయ దళ నాయకులు.. అలా జరగకపోతే పదవుల నుంచి తప్పుకుంటారా? అని ఛాలెంజ్​ చేశారు.

బంగాల్​లో ఈసారి 200 సీట్లకుపై స్థానాలు కైవసం చేసుకుని అధికారంలోకి వస్తామని అమిత్​ షా సహా భాజపా నాయకులు చెబుతున్నారు. ఆ పార్టీ రెండంకెలు దాటి 100 సీట్లు గెలిస్తే ట్విట్టర్​ నుంచి తప్పుకుంటానని సోమవారమే ప్రకటించారు ప్రశాంత్ కిశోర్​. ప్రస్తుతం ఆయన మమతా బెనర్జీ సారథ్యంలోని టీఎంసీకి ఎన్నికల వ్యూహకర్తగా వ్యవహరిస్తున్నారు. 2014లో ప్రధాని నరేంద్ర మోదీ అధికారంలోకి రావడానికి ఆయనే కీలక సూత్రధారి.

బంగాల్​ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం దేశం ఓ ఎన్నికల వ్యూహకర్తను కోల్పోతుందని భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి కైలాశ్ విజయ​వర్గీయ అన్నారు. ప్రశాంత్​ వ్యాఖ్యలకు స్పందనగా ఈ ట్వీట్ చేశారు.

ఇదీ చూడండి: '200 స్థానాలు గెలుస్తాం.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.