ETV Bharat / bharat

కరోనాతో మరో ఎమ్మెల్యే మృతి!

author img

By

Published : Jun 24, 2020, 11:29 AM IST

కరోనా మహమ్మారి చిన్నాపెద్ద, ధనిక పేద అని తేడా లేకుండా బలి తీసుకుంటోంది. కొన్నిరోజుల క్రితం పశ్చిమ బంగాలో కరోనా బారిన పడిన తృణమూల్​ కాంగ్రెస్​ ఎమ్మెల్యే తమోనాశ్​ ఘోష్​ తాజాగా మృతి చెందారు.

Trinamool Congress legislator Tamonash Ghosh who tested positive for coronavirus died
కరోనా కారణంగా మరో ఎమ్మెల్యే మృతి!

గత నెలలో కరోనా సోకిన తృణమూల్‌ కాంగ్రెస్‌ శాసనసభ్యుడు తమోనాశ్‌ ఘోష్‌ కన్నుమూశారు. 60 సంవత్సరాల తమోనాశ్‌.. గుండె, కిడ్నీ సమస్యలతో కూడా బాధపడుతున్నారు. అయితే ఆయన కరోనా కారణంగానే చనిపోయారా లేదా అన్నది నిర్ధరణ కావాల్సి ఉంది.

తృణమూల్‌ తరపున ఆయన ఫాల్తా స్థానం నుంచి మూడు సార్లు శాసనసభ్యుడుగా ఎన్నికయ్యారు ఘోష్​.

దీదీ విచారం..

తమోనాశ్‌ ఘోష్‌ మృతి పట్ల బంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. తమోనాశ్‌ ఎంతో సామాజిక సేవ చేశారని గుర్తు చేసుకున్నారు మమత. ఆయన మరణం తీరని లోటన్నారు.

డీఎంకే ఎమ్మెల్యే..

కరోనా కారణంగా ఇప్పటికే తమిళనాడులో డీఎంకే శాసనసభ్యుడు అన్బగలన్‌ మృతి చెందగా.. దేశంలోని పలు రాష్ట్రాల్లో ప్రజా ప్రతినిధులు కూడా వైరస్‌ బారిన పడ్డారు.

ఇదీ చూడండి: కరోనాతో మరో ఏడాది సహజీవనం తప్పదా?

గత నెలలో కరోనా సోకిన తృణమూల్‌ కాంగ్రెస్‌ శాసనసభ్యుడు తమోనాశ్‌ ఘోష్‌ కన్నుమూశారు. 60 సంవత్సరాల తమోనాశ్‌.. గుండె, కిడ్నీ సమస్యలతో కూడా బాధపడుతున్నారు. అయితే ఆయన కరోనా కారణంగానే చనిపోయారా లేదా అన్నది నిర్ధరణ కావాల్సి ఉంది.

తృణమూల్‌ తరపున ఆయన ఫాల్తా స్థానం నుంచి మూడు సార్లు శాసనసభ్యుడుగా ఎన్నికయ్యారు ఘోష్​.

దీదీ విచారం..

తమోనాశ్‌ ఘోష్‌ మృతి పట్ల బంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. తమోనాశ్‌ ఎంతో సామాజిక సేవ చేశారని గుర్తు చేసుకున్నారు మమత. ఆయన మరణం తీరని లోటన్నారు.

డీఎంకే ఎమ్మెల్యే..

కరోనా కారణంగా ఇప్పటికే తమిళనాడులో డీఎంకే శాసనసభ్యుడు అన్బగలన్‌ మృతి చెందగా.. దేశంలోని పలు రాష్ట్రాల్లో ప్రజా ప్రతినిధులు కూడా వైరస్‌ బారిన పడ్డారు.

ఇదీ చూడండి: కరోనాతో మరో ఏడాది సహజీవనం తప్పదా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.