ETV Bharat / bharat

దూబే కేసులో డీఐజీపై యూపీ సర్కార్​ వేటు - yogi governement

సీనియర్​ ఐపీఎస్​ అధికారి అనంత్​ దేవ్​పై సస్పెన్షన్​ వేటు వేసింది ఉత్తర్​ప్రదేశ్​ ప్రభుత్వం. గ్యాంగ్​స్టర్​ వికాస్​ దూబేతో.. అనంత్​కు సంబంధాలున్నట్లు ప్రత్యేక దర్యాప్తు బృందం గుర్తించింది. ఈ నేపథ్యంలోనే ఆయనపై చర్యలు తీసుకున్నారు.

UP govt suspends IPS officer over Kanpur ambush
వికాస్​ దూబే కేసులో డీఐజీపై యోగి సర్కార్​ వేటు
author img

By

Published : Nov 13, 2020, 6:15 AM IST

గ్యాంగ్‌స్టర్ వికాస్ దూబేతో సంబంధాలు ఉన్నట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న డీఐజీ అనంత్ దేవ్‌పై ఉత్తర్​ప్రదేశ్​ ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేసింది. గతంలో కాన్పుర్ పోలీస్ చీఫ్‌గా పనిచేసిన అనంత్ దేవ్‌కి, దూబేకి సంబంధాలున్నట్టు సిట్ బృందం గుర్తించడంతో ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. జులై 2న కాన్పుర్‌లోని బిక్రు గ్రామంలో తనను అరెస్టు చేసేందుకు వచ్చిన 8 మంది పోలీసులను వికాస్ ముఠా కాల్చిచంపింది. వికాస్ దూబేతో మరో పోలీస్ అధికారి వినయ్ తివారీకి సంబంధాలు ఉన్నాయంటూ కాల్పుల ఘటనలో మృతి చెందిన డీఎస్పీ దేవేంద్ర మిశ్రా రాసిన ఓ లేఖపై చర్యలు తీసుకోలేదని అనంత్ దేవ్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.

ఇదీ చూడండి: గ్యాంగ్​స్టర్​ ఎన్​కౌంటర్​పై విచారణకు కమిషన్

''అనంత్ దేవ్‌ను సస్పెండ్ చేశాం. సిట్ నివేదిక ఆధారంగా ఈ చర్యలు తీసుకున్నాం.'' అని హోంశాఖ అదనపు ముఖ్య కార్యదర్శి అవనీశ్ కుమార్ అవస్థీ పేర్కొన్నారు. జులై 10న వికాస్ దూబేను ఉజ్జయినీ నుంచి కాన్పుర్ తరలిస్తుండగా అతడు పారిపోయేందుకు ప్రయత్నించాడంటూ పోలీసులు ఎన్‌కౌంటర్ చేశారు.

గ్యాంగ్‌స్టర్ వికాస్ దూబేతో సంబంధాలు ఉన్నట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న డీఐజీ అనంత్ దేవ్‌పై ఉత్తర్​ప్రదేశ్​ ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేసింది. గతంలో కాన్పుర్ పోలీస్ చీఫ్‌గా పనిచేసిన అనంత్ దేవ్‌కి, దూబేకి సంబంధాలున్నట్టు సిట్ బృందం గుర్తించడంతో ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. జులై 2న కాన్పుర్‌లోని బిక్రు గ్రామంలో తనను అరెస్టు చేసేందుకు వచ్చిన 8 మంది పోలీసులను వికాస్ ముఠా కాల్చిచంపింది. వికాస్ దూబేతో మరో పోలీస్ అధికారి వినయ్ తివారీకి సంబంధాలు ఉన్నాయంటూ కాల్పుల ఘటనలో మృతి చెందిన డీఎస్పీ దేవేంద్ర మిశ్రా రాసిన ఓ లేఖపై చర్యలు తీసుకోలేదని అనంత్ దేవ్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.

ఇదీ చూడండి: గ్యాంగ్​స్టర్​ ఎన్​కౌంటర్​పై విచారణకు కమిషన్

''అనంత్ దేవ్‌ను సస్పెండ్ చేశాం. సిట్ నివేదిక ఆధారంగా ఈ చర్యలు తీసుకున్నాం.'' అని హోంశాఖ అదనపు ముఖ్య కార్యదర్శి అవనీశ్ కుమార్ అవస్థీ పేర్కొన్నారు. జులై 10న వికాస్ దూబేను ఉజ్జయినీ నుంచి కాన్పుర్ తరలిస్తుండగా అతడు పారిపోయేందుకు ప్రయత్నించాడంటూ పోలీసులు ఎన్‌కౌంటర్ చేశారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.